ఉపాధ్యాయుల బదిలీల విషయంలో తుది జాబితాను ప్రచురించవద్దని పాఠశాల విద్యా శాఖను హైకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితాపై ఉపాధ్యాయుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే అంశానికి మాత్రమే ప్రస్తుతం పరిమితం కావాలని స్పష్టంచేసిం ది. తుది జాబితా ప్రచురించే విషయంలో తమ ఆదేశాల కోసం వేచి చూడాలని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలకు జారీ చేసిన జీవో 187 లోపభూయిష్టంగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బదిలీలకు రూపొందిం చిన మార్గదర్శకాలు సహేతుకంగా లేవ న్నారు. అధికారులు ఈ మార్గదర్శకాలను యాంత్రికంగా రూపొందించినట్లు కనిపిసోందని తెలిపారు.
No comments:
Post a Comment