APTF VIZAG: కోవిడ్ వల్ల మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.దీనికి సంబంధించి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ చేసుకునే విధానం

కోవిడ్ వల్ల మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.దీనికి సంబంధించి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ చేసుకునే విధానం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ(విపత్తు నిర్వహణ) శాఖ.రాష్ట్రంలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి వారసులకు రూ. 50,000/-ల సహాయం

ఆంధ్రప్రదేశ్ నివాసులకు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా రాష్ట్రంలో | కోవిడ్-19 కారణంగా మరణించిన వారి వారసులకు రూ.50,000/- (ఎక్స్ గ్రేషియా) ఆర్థిక సహాయాన్ని అందజేయాలని భారత ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ యొక్క మార్గదర్శకాల ప్రకారం నిర్ణయించడమైనది. తదనుగుణంగా కోవిడ్-19 కారణంగా మరణించిన వారి వారసులకు త్వరగా మరియు సులభంగా సహాయం అందజేయుటకు మొబైల్ హిత ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించబడినది. పోర్టల్ http://covid19.ap.gov.in/exgratia పై క్లిక్ చేయడం ద్వారా ఎక్స్ గ్రేషియా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ పోర్టల్పై మొబైల్/ కంప్యూటర్ నుండి ఒటిపిని జనరేట్ చేయడం ద్వారా మరియు దిగువ తెలిపిన ఏదేని రుజువును అప్లోడ్  చేయడం ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఆర్టి-పిసిఆర్/ర్యాపిడ్ యాంటిజెన్/మాలిక్యులర్ టెస్ట్ యొక్క పాజిటివ్ టెస్ట్ రిపోర్టు

 పై వాటిలో ఏదైనా ఒకటి.

 కొవిడ్-19 యొక్క వైద్య చికిత్స/ రోగనిర్ధారణకు మద్దతుగా డాక్యుమెంట్ కాపీ

ఫారం-1/ ఫారం-4ఎ

పై వాటితోపాటు దిగువ సూచించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవలెను.

మరణించిన వారి మరణ ధ్రువీకరణ పత్రం యొక్క కాపి

వారసుల అఫిడవిట్

సహాయం అందుకునే వారసులు బ్యాంక్ పాస్ బుక్/క్రాస్ చెక్ (ఐఎస్ఎస్సి కోడ్ వున్న) కాపి లేదా జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద స్వయంగా (ఆఫ్లైన్) అందజేయడం ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చును.

మరణించిన వారి వారసులు  దరఖాస్తుదారుకు దరఖాస్తుపై నిర్ణయం పట్ల ఏదేని ఆక్షేపణ/ఫిర్యాదు ఉన్నట్లయితే ఆన్లైన్ పోర్టల్ http://covid19.ap.gov.in/exgratia నందుగల ఫిర్యాదుల పరిష్కారం కమిటీకి దరఖాస్తు చేయవచ్చును. లేదా స్వయంగా కలెక్టరు కార్యాలయంలో దాఖలు చేయవచ్చును. ఎక్స్ షియా/పోర్టలు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుపై ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెం. 104ను సంప్రదించవచ్చును.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today