2023-24 విద్యా సంవత్సరానికిగాను డా.బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి గతంలో ఇచ్చిన గడువును ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగించారు .
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 ఎస్సీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ గడువు మార్చి 24వ తేదీ తో ముగిసిపోగా దీన్ని మార్చి 31వ తేదీ వరకూ పొడిగించారు .
ఆన్ లైన్ ద్వారా ఈ ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించాలి. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతిలోకి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు అర్హులు.
5 వ తరగతిలోకి ప్రవేశం కోరే విద్యార్థులు
https://apgpcet.apcfss.in/swfifthform
అనే వెబ్ సైట్ ద్వారా, అలాగే ఇంటర్ లో ప్రవేశం కోరే విద్యార్థులు
https://apgpcet.apcfss.in/swinterform
అనే వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఈనెల 31వ తేదీ లోపుగా సమర్పించాలి.
గురుకుల సీట్ల కేటా యింపులో ఎస్సీ ఎస్సీలకు 75 శాతం, బీసీ-సీ కేటగిరీకి చెందిన క్రిస్టియన్ దళితుల కు 12శాతం, ఎసటీలకు 7శాతం, బీసీలకు 6 శాతం, ఓసీలకు 2శాతం రిజర్వేషన్ల ప్రకారంగా కేటాయించడం జరుగుతుంది.
No comments:
Post a Comment