3 , 4 , 5 తరగతుల రిజిస్టర్లు అప్పగించాలని ఆదేశాలు
ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలల్లో విలీనమైన ప్రాథమిక పాఠశాలలకు చెందిన 3 , 4 , 5 తరగతుల విద్యార్థుల వివరాలు , రిజి స్టర్లు , టీసీలను అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు .
Click Here To Download proceedings
కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో 3 , 4 , 5 తరగతులను విలీనం చేయాలని , ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలల్లో సదు పాయం ఉన్నచోట్లే విద్యార్థులను పంపించాలని గతంలో ఆదేశాలు ఇచ్చిన అధి కారులు క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు .
ఉన్నత పాఠ శాలల్లో సదుపాయాలతో సంబంధం లేకుండా కిలోమీటరు దూరంలోని 3 , 4 , 5 తరగతులను విలీనం చేయడంతోపాటు రికార్డులను అప్పగించాలని ఆదేశిం చారు .
విద్యార్థుల సంఖ్య వందలోపు ఉన్న ప్రాథమికోన్నతబడులను మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు .
హేతుబద్ధీకరణతో ఎక్కువగా తేలిన ఉపాధ్యాయులను తాత్కాలి కంగా ఆయా బడుల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు .
ఎస్జీటీలు తాత్కా లికంగా సబ్జెక్టు ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పాల్సి ఉంటుంది .
విలీనమైన విద్యార్థుల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించొద్దని , ప్రస్తుతం ఉన్న రిజిస్టర్లోనే కొత్తగా వచ్చిన వారి పేర్లు రాయాలని సూచించారు
No comments:
Post a Comment