APTF VIZAG: విద్యకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఉపాధ్యాయులకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

విద్యకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఉపాధ్యాయులకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 ప్రీ ప్రైమరీ విద్య అవసరం లేదంటోన్న కొందరు ఉపాధ్యాయులు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

👉పాఠశాలలపై ప్రభుత్వ విధానాన్ని వద్దనే అధికారం ఉపాధ్యాయులకు లేదని బొత్స వ్యాఖ్యానించారు.

👉 ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారా? అని నిలదీశారు. 

👉ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకే సంస్కరణలు చేపట్టామని.. రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణల యజ్ఞం ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుందన్నారు.

👉 సీబీఎస్ఈ, ఆంగ్ల మాధ్యమంలో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్‌లు.. ఇలా వేర్వేరు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులు చెబుతోన్న వివిధ అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

👉 ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమన్నారు.

👉 పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లితండ్రులూ అభ్యంతరం చెప్పటం లేదన్నారు. 

👉ఎవరో కుట్రలు చేసి ఈ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.


పుస్తకాల విషయంలో జాప్యం నిజమే.

పాఠ్య పుస్తకాల విషయంలో జాప్యం జరిగిన మాట వాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

👉 పాఠశాల విద్యాశాఖ ఓ కఠిన నిర్ణయం తీసుకున్న కారణంగానే ఆలస్యమైందన్నారు.

👉 ప్రభుత్వం ఇచ్చిన సిలబస్, కరికులమ్ ఇచ్చిన తర్వాత ఏ ప్రైవేటు పాఠశాలా దాన్ని మార్చేందుకు వీల్లేదన్నారు. 

👉గతంలో ప్రైవేటు పాఠశాలలు తమ సబ్జెక్టులు కూడా కలిపేసి ముద్రించే వారన్న మంత్రి.. పరీక్షలు ఎప్పుడూ ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ఆధారంగానే జరుగుతాయని గుర్తించాలన్నారు.

👉 వ్యాపారం కోసం గతంలో ప్రైవేటు సంస్థలు ముద్రించేసి వాటినే విక్రయించుకునే వారన్నారు. 

👉ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలను మాత్రమే పంపిణీ చేసేలా ఈసారి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

👉ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇస్తున్నాం, ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత ధరకే విక్రయిస్తున్నామన్నారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4