APTF VIZAG: 3 రాజధానులపై హైకోర్టు కీలక తీర్పు.రాజధానిపై ప్రభుత్వానికి శాసనాధికారం లేదు : హైకోర్టు

3 రాజధానులపై హైకోర్టు కీలక తీర్పు.రాజధానిపై ప్రభుత్వానికి శాసనాధికారం లేదు : హైకోర్టు

మూడు రాజధానులు , CRDA రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది . అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది . CRDA చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని , 6 నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని ఆదేశించింది . భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలంది . రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టేందుకు వీల్లేదని స్పష్టం చేసింది . 

రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది . అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని తెలిపింది . పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ . 50 వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది . అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని , అక్కడి అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని తీర్పు చెప్పింది .

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today