★ ఆగ్నేయాసియాలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక సూచనలు చేసింది.
★ క్షేత్రస్థాయిలో కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాదని నిపుణులు చెబుతున్నా.. అప్రమత్తత అవసరమని స్పష్టం చేసింది.
★ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్నిరకాలుగా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు.
★ కరోనా ఇంకా వ్యాప్తిచెందకుండా అధికార యంత్రాంగాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎక్కడికక్కడ కఠిన నిబంధనలను అమలు చేయాలి.
★ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వెంటిలేషన్, భౌతిక దూరం తదితర నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే' అని ఖేత్రపాల్సింగ్ సూచించారు.
★ విస్తరిస్తున్న వాటిలో ఒమిక్రాన్ కేసులు మాత్రమే కాకుండా.. అత్యంత ప్రమాదకరమైన డెల్టా సహా ఇతర వేరియంట్లు కూడా ఉన్నాయని తెలిపారు.
★ కొత్త వేరియంట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థలపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
★ టీకా తీసుకున్నప్పటికీ కొవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కులు, భౌతిక దూరం పాటించాల్సిందేనని హెచ్చరించారు.
★ ఒమిక్రాన్ వేరియంట్తో ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉండొచ్చనే వార్తలు ప్రస్తుతానికి ఊరటనిచ్చే అంశమే. అయితే పరిణామక్రమం పరంగా జరిగిన 'పొరపాటు' వల్లే ఇది తేలికపాటి వైరస్గా ఉందని,
★ తదుపరి వేరియంట్ మరింత ప్రమాదకరంగా మారొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయని భారత సంతతికి చెందిన పరిశోధకుడు రవీంద్ర గుప్తా తెలిపారు. ఆయన బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
★ తదుపరి వచ్చే వేరియంట్ చెలరేగిపోవచ్చని, అందుకే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు
No comments:
Post a Comment