వాయిదా పడిన ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 29న అమరావతి సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సాధారణ పరిపాలనశాఖ మంగళవారం లేఖలు పంపింది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 11 పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
No comments:
Post a Comment