రాష్ట్రంలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది.
శుక్రవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది.
నిత్యం మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ వేళల్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
No comments:
Post a Comment