టీచర్లను ఆప్యాయంగా చూసుకుని ఫలితాలు రాబట్టాలని అధికారులకు సూచన.మనిషిని కష్టపెట్టి, బాధపెట్టి.. ఏం సాధించలేం: సీఎం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన ‘నాడు-నేడు' కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘నాడు-నేడుతో స్కూళ్లు, అంగన్వాడీలు అభివృద్ధి అయ్యాయి. రాష్ట్రంలోని ప్రతి స్కూల్ వినియోగంలో ఉండాలి. పిల్లలకు 2 కిలోమీటర్ల దూరం లోపలే పాఠశాల ఉండాలి. ఈ విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకం. స్కూళ్ల నిర్వహణలో జాతీయ ప్రమాణాలు పాటించాలి. పిల్లల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండాలి. అంగన్వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి. పాఠ్యప్రణాళిక పటిష్టంగా ఉండాలి’’ అని సీఎం జగన్ ఆదేశించారు.
No comments:
Post a Comment