నీట్-పీజీ పరీక్షలు
దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న జరగాల్సిన నీట్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
★ కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తున్న వేళ ఆఫ్లైన్లో ఈ పరీక్షలు నిర్వహించనుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ట్విటర్లో వెల్లడించారు.
★ యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
★ కరోనా పరిస్థితిని బట్టి ఈ పరీక్షకు కొత్త తేదీని తర్వాత వెల్లడిస్తామన్నారు.
★ మరోవైపు, కరోనా వైరస్ రెండో విజృంభణ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో వైద్యుల బృందం గురువారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment