టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 5
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ అభ్య ర్థులు, అలాగే గతంలో ఫెయిలైన విద్యార్థులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రూ.50 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
No comments:
Post a Comment