APTF VIZAG: ప్రతి నెలా 5 లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడి.

ప్రతి నెలా 5 లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడి.

రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కొవిడ్ పరి స్థితులవల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి నెలా 5వ తేదీ నాటికి 90-95% ఉద్యోగుల జీతాలు, పింఛన్లను ప్రభుత్వం చెల్లి స్తోంది. మిగిలిన 5% మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అను గుణంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వగలం' అని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యో గుల జీతాలు, పింఛను బిల్లులు 90-95 % వరకు నెలాఖరు రోజున ఖజానా అధికారులు పాస్ చేస్తారని, వాటి చెల్లింపులు ఆ మరుసటి నెల 5లోగా పూర్తి చేస్తున్నామని ఆయన వివరించారు. రిజర్వు బ్యాంకు, బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు (వేస్ అండ్ మీన్స్- చేబదుళ్లు) అందుబాటులో ఉన్న పరి స్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు సాగుతున్నాయని వివరించారు. ఇంతకు ముందు, ఇప్పుడు ఇదే పద్ధతి కొనసాగుతోందని తెలిపార

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today