APTF VIZAG: 30 వరకు సచివాలయాల్లో ప్రత్యేక ‘ఆధార్' క్యాంపులు. బయోమెట్రిక్ వివరాల అప్డేట్కు అవకాశం

30 వరకు సచివాలయాల్లో ప్రత్యేక ‘ఆధార్' క్యాంపులు. బయోమెట్రిక్ వివరాల అప్డేట్కు అవకాశం

ఆధార్ కార్డుదారులు తమ బయోమె ట్రిక్ వివరాలను అప్డేడేట్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో విడత ఈ నెల 30 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. మంగళవారం నుంచి నాలుగు రోజులు పాటు ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న అన్ని గ్రామ సచివా లయాల్లోనూ ఈ క్యాంపులు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల అధికారు లకు ఆదేశాలిచ్చింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ ఆధార్ కార్డులో తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి దాకా ఆధార్ వివరాలు అసలు నమోదు చేసుకోని పాఠశాలల విద్యార్థులు ఈ క్యాంపులో తమ వివరాలు పూర్తి ఉచితం గా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results