APTF VIZAG: సదుపాయాలుంటే 3 , 4 , 5 తరగతుల విలీనం

సదుపాయాలుంటే 3 , 4 , 5 తరగతుల విలీనం

 ప్రాథమిక పాఠశాలల్లోని 3 , 4 , 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత , ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది . దీనిపై శుక్ర , శనివారాల్లో రెండు రోజులపాటు జిల్లా విద్యాధికారులతో ( డీఈఓ ) ప్రత్యేక కార్యశాల నిర్వహించింది . కిలోమీటరు దూరంలోని ప్రాథమిక పాఠశాలల మ్యాపింగ్ను కమిషనరేట్లోనే డీఈఓలు పూర్తి చేశారు . మొదట కిలోమీటరు దూరంలోని 3 , 4 , 5 తరగతులన్నింటినీ తరలించాలని నిర్ణయించారు . అవసరమైన చోట ' నాడు- నేడు ' కింద అదనపు తరగతి గదులు నిర్మించాలని అంచనాలు రూపొందించారు . నిధుల కొరత కారణంగా గదుల నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభించలేదు . ఒకవేళ జూన్లో నిర్మాణాలు చేపట్టినా అవి పూర్తయ్యేందుకు 3 నెలల సమయం పడుతుంది . జులై 4 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి . ఈలోగా అదనపు తరగతి గదులు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు . ఈ నేపథ్యంలో ప్రస్తుతం సదుపాయాలున్న చోటే మ్యాపింగ్ చేస్తున్నారు . ఉన్నత , ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి గదులు ఎక్కువగా ఉంటేనే 3 , 4 , 5 తరగతులను విలీనం చేస్తారు . లేదంటే కాగితాల్లో మాత్రమే మ్యాపింగ్ చూపి పిల్లలను ప్రాథమిక బడుల భవనాల్లోనే ఉంచుతారు

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today