APTF VIZAG: ఉద్యోగుల డీఏ బిల్లులు వెనక్కి ! నిలిచిన దాదాపు రూ .3,000 కోట్ల చెల్లింపులు సీఎఫ్ఎంఎస్కు చేరకుండా అడ్డగింత

ఉద్యోగుల డీఏ బిల్లులు వెనక్కి ! నిలిచిన దాదాపు రూ .3,000 కోట్ల చెల్లింపులు సీఎఫ్ఎంఎస్కు చేరకుండా అడ్డగింత

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన కరవు భత్యం బకాయిల బిల్లు లను ప్రభుత్వం వెనక్కు పంపేసింది . ఆ బిల్లులను తిరిగి సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్కు సమర్పించాల్సి ఉన్నా అందుకు అవకాశం లేకుండా ఫ్రీజ్ చేసినట్లు సమాచారం . రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన 5 డీఏలను ప్రకటించింది . వాటి బకాయిలను కూడా విడ తల వారీగా చెల్లించాలని నిర్ణయించింది . పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులకు బకాయిలు వారి జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తామని , అదే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలో ఉన్న ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లిస్తా మని పేర్కొంది . దాంతో ఎప్పటికప్పుడు ఉద్యోగులు బిల్లులు సమర్పిస్తూ వచ్చారు . ఇలా ... ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న డీఏ బకాయిల బిల్లులను ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకూ చెల్లించలేదు . కొత్త ఆర్థిక సంవ త్సరం రావడంతో ఆర్థిక శాఖ అధికారులు ఆ బిల్లులను తిరిగి డీడీవోలకు పంపగా ... వారు పరిశీలించి ఖజానా అధికారులకు పంపించారు . అక్కడి నుంచి మళ్లీ సీఎఫ్ ఎంఎస్కు అవి చేరాల్సి ఉంది . అలా చేరిన తర్వాతే నిధుల లభ్యతను బట్టి బిల్లుల చెల్లింపులు ఉంటాయి . అయితే ... ఈ డీఏ బకాయిల బిల్లులన్నీ దాదాపు 25 రోజుల నుంచి ఖజానా అధికారుల వద్దే ఉన్నాయి . వాటిని సీఎఫ్ఎంఎస్ సమర్పించేందుకు అవకాశం లేకుండా సైట్లో లాక్ చేశారని చెబుతున్నారు . ఈ బిల్లుల మొత్తం కలిపి రూ .3,000 కోట్ల వరకు ఉంటుం దని అంచనా . ప్రస్తుతం ఏప్రిల్ నెల జీతాలు , పెన్షన్లకు సంబంధించిన బిల్లులను మాత్రమే సీఎఫ్ఎంఎస్లో అప్ లోడ్ చేయడం సాధ్యమవుతోందని చెబుతున్నారు .

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4