అనంతపురం నగర ఎమ్మెల్యే గారైన అనంత వెంకట రామి రెడ్డి గారిని హాఫ్ డే స్కూల్స్ విషయమై అనంతపురం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రెప్రజెంట్ చేయడం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని, ఉష్ణోగ్రత కూడా 42 డిగ్రీలు ఉందని కావున వెంటనే ఒకటవ తేదీ నుండి హాఫ్ డే స్కూల్స్ విషయమై ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది.ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ గౌ౹౹ విద్యాశాఖ మంత్రి గారితో ఫోన్లో సంభాషించడం జరిగింది. గౌ౹౹ మంత్రిగారు ఢిల్లీ లో ఉన్నందున, రేపు అధికారులతో సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించడం జరిగింది.
No comments:
Post a Comment