APTF VIZAG: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం.

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం.

ఉద్యోగ సంఘాల నేతలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించిన ఆర్ధికశాఖ అధికారులు.

– రాష్ట్ర విభజన పర్యవసానాల కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు వచ్చాయన్న అధికారులు.

– జనాభా 58.32 శాతం వస్తే, రెవిన్యూ 46శాతం వచ్చిందన్న అధికారులు.

– దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అతితక్కువ తలసరి ఆదాయం రూ.1,70,215 మాత్రమే ఉంది

– రాష్ట్ర విభజన కారణంగా షెడ్యూలు 9లో పేర్కొన్న సంస్థల కారణంగా రూ. 1.06 లక్ష కోట్ల ఆస్తులను వదిలి వచ్చాం

– షెడ్యూలు 10లో ఉన్న సంస్థలను వదులుకోవడం ద్వారా రూ.39,191 కోట్ల విలువైన ఆస్తులను కోల్పోయాం.

– రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం.

– రెవిన్యూ లోటు రూపంలో కేంద్రం నుంచి రూ. 18,969 కోట్ల రూపాయల బకాయి ఉంది.

– కోవిడ్‌ కారణంగా మరింత ఆదాయాన్ని కోల్పోయాం. 

– కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా గణనీయంగా తగ్గింది.

–చీఫ్‌ సెక్రటరీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 14.29శాతం ఫిట్‌మెంట్‌కు ఏడాదికి ప్రభుత్వంపై పడేభారం రూ.7,136 కోట్లు.

– ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. తెలంగాణాలో, ఛత్తీస్‌గఢ్‌లో, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, హరియాణ రాష్ట్రాల కంటే అధికం.

సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...

– ఉద్యోగ సంఘాల నేతలు చాలా విషయాలు చెప్పారు.

– కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాను.

– నా చేతికి ఎముక ఉండదని అందరూ అంటూ ఉంటారు.

– ఉదారంగా ఉండే విషయంలో, మానవతా దృక్పథంతో ఉండే విషయంలో, నాకన్నా బాగా స్పందించేవాళ్లు, నా కన్నా ఎక్కువగా స్పందించేవాళ్లు తక్కువగా ఉంటారు.

– ఎవరికైనా మంచే చేయాలని తాపత్రయపడతాను.

– మంచి వీలైనంత ఎక్కువమందికి చేయాలని ఆరాటపడతాను.

– ఆ మంచిలో ఏ ఒక్కరూ కూడా భాగస్వామ్యులు కాకుండా మిగిలిపోకూడదని ఆరాటపడతాను.

– ఈ మంచి నుంచి అన్నది నానైజం.

– కొన్ని కొన్ని వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

– కొన్ని అంశాలను బేరీజు వేసుకోవాలి.

– ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని పరిణామం, తర్వాత సంవత్సరాల అన్నింటిపైనా ప్రభావం చూపుతుంది.

– మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకోని పరిస్థితులు వచ్చాయి.

– ప్రతి ఏటా ఆదాయాలు పెరుగుకుంటూ వస్తాయి. 

– కనీసం 15శాతం పెరుగుతూ వస్తోంది.

– కాని గత 2 ఏళ్లుగా ఆదాయం పెరిగిందా? అని ఆలోచన చేయాలి.

– ఒకవైపు ఆదాయాలు పెరగకపోగా.. తగ్గాయి?

– ఒకవైపు పీఆర్సీసీ గురించి మాట్లాడుతున్నాం.. మరో వైపు ఒమిక్రాన్‌ విస్తరిస్తోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలియదు? 

దాని ప్రభావం దేశ ఆదాయాల మీద, రాష్ట్ర ఆదాయాల మీద ఎలా ఉంటుందో అర్ధం కాని పరిస్థితులు?

– అలాంటి పరిస్థితుల మధ్య పీఆర్సీపైన మాట్లాడుతున్నాం. 

– కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ రోజు దేశ వ్యాప్తంగా 98వేల కేసులు నమోదయ్యాయి. రేపటికి 2 లక్షలు అంటున్నారు.

– అనేక రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ కూడా వచ్చేసింది.

– ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేని పరిస్థితి.

– నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో ఆదాయాలు తగ్గాయి.

ఐజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ రెండు ఆదాయాలు తగ్గిన పరిస్థితి.

–ఇటువంటి పరిస్థితుల మధ్య మనం నిర్ణయం తీసుకోవడానికి కూర్చున్నాం.

– ఎలాంటి నిర్ణయం తీసుకున్నాసరే... ఆ నిర్ణయంతో మనం కలిసి ముందుకు సాగాలి.

– మనం చేయదగ్గ పరిస్థితి ఉందా? అన్న ఆలోచన చేయాలి.

కారణం ఒక్కసారి స్టేట్‌ ఓన్‌ రెవెన్యూస్‌(ఎస్‌ఓఆర్స్‌) గమనిస్తే.

2018–19లో ఎస్‌ఓఆర్‌ రూ. 62,503 కోట్లు అయితే 2019–20లో అది రూ.60,934 కోట్లకు తగ్గింది. 

– 2020–21లో ఇంకా రూ.60,688 కోట్లకు తగ్గింది.

మామూలుగా ప్రతియేటా 15 శాతం పెరగాలి. 

– 2018–19లో ఉన్న రూ.62వేల కోట్లు కాస్తా... 2019–20 కు వచ్చేసరికి 15 శాతం కనీసం పెరిగినా కూడా రూ.72 వేల కోట్లు కావాలి.

2020–21లో ఈ రూ. 72 వేల కోట్లు మరో 15 శాతం పెరిగితే రూ.84 వేల కోట్లు కావాలి.

– అలాంటిది ఈ ఎస్‌ఓఆర్‌ 2020–21లో రూ.60,688 కోట్లు మాత్రమే.

– 2018–19లో రూ.62,503 కోట్లు ఉండేది 2020–21 కి రూ.60,688 కోట్లకి తగ్గింది. 

ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం.

మరోవైపున మొత్తం జీతాలు, పెన్షన్లు చూస్తే

– 2018–19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ. 52,513 కోట్లు కాగా, 2020–21 నాటికి ఆ వ్యయం రూ. 67,340 కోట్లకు చేరుకుంది. 

– ఉద్యోగులకు అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాలు కారణంగా ఈ పెరుగుదల వచ్చింది:

– మనం అధికారంలోకి రాగానే ఆదాయం ఎలా ఉన్నా... ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ ఇచ్చాం. 

– దాదాపు రూ.18వేల కోట్ల రూపాయల వరకూ చెల్లించాం.

జూలై 1 2019 నుంచి ఈ రోజు వరకు ఐఆర్‌ ప్రభావం ఇది.

– అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచింది.

– కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ తదితర విభాగాలకు చెందిన 3,01,021 ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లుకు పెరిగింది.

– కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది.

– ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు, యూనివర్శిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు తదితర ఉద్యోగులకు వర్తింపు చేసింది.

– ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా వీరికి అమలు చేస్తోంది.

– ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 360 కోట్ల మేర ఏడాదికి ప్రభుత్వంపై భారం పడుతోంది. 

– ఏపీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశాం.

– దీని వల్ల 2020 నుంచి జనవరి నుంచి ఆ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.

– జనవరి 2020 నుంచి అక్టోబరు 2021 వరకూ రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.

– పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకు వచ్చాం:

– 1.28 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించాం. 

– ఏడాదికి రూ. 2,300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.

– ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ తదితర సిబ్బందిని భారీగా గతంలో ఎప్పుడూలేని విధంగా నియమించాం.

– ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరనే మాట రాకూడదని నియామకాలు చేపడుతున్నాం.

 –మొత్తంగా 39 వేల మందిని ఈ ఫిబ్రవరి నాటికి నియమిస్తాం.

– ఫిబ్రవరి నాటి నియామకాలు లెక్కలోకి తీసుకోకుండా ...ఈ రిపోర్టు సబ్‌మిట్‌ చేసేనాటికి చూస్తే... 14వేల మందిని నియమించారు. 

– దీనివల్ల అదనంగా ఇప్పటికే ఏడాదికి రూ.820 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడింది.

– అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రయోజనాల కోసం అప్కాస్‌ను ప్రారంభించాం:

– మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జీతాలను జమ చేస్తున్నాం:

– లక్షమందికి ఆప్కాస్‌లో ఉద్యోగాలు కల్పించాం.

– ఈపీఎఫ్‌ మరియు ఈఎస్‌ఐ వంటి సదుపాయాలను కల్పించాం.

– అప్కాస్‌ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ. 2,040 కోట్ల భారం పడుతోంది.

– ఎంపీడీఓలకు ప్రమోషనల్‌ ఛానల్‌ అంశాన్ని ఈ ప్రభుత్వం పరిష్కరించింది మన ప్రభుత్వమే:

– గ్రేడ్‌–1 వీఆర్వోలకు ప్రమోషన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసింది.

– రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,795 వీఆర్వో, వీఆర్‌ఏ పోçస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది కూడా మన ప్రభుత్వమే:

– మహిళా ఉద్యోగులకు ఏటా అదనంగా ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసిందీ మన ప్రభుత్వమే:

– రీలొకేట్‌ అయిన ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఐ చెల్లిస్తోంది.

ఇవన్నీ చేయడం వల్ల మొట్టమొదటి రోజు నుంచి ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మనం అడుగులు వేసినందువల్లనే, స్టేట్‌ ఓన్‌ రెవెన్యూస్‌లో ఆదాయాలు ఒకవైపు తగ్గుతున్నా కూడా... మొత్తం శాలరీలు, పెన్షన్ల్‌ ఖర్చు రూ.52,513 కోట్లు నుంచి రూ. రూ. 67వేల కోట్లకు పెరుగుతుందే తప్ప, తగ్గించే పరిస్థితి లేదు. 

2020–21 ఆర్దిక సంవత్సరం పరిస్థితి ఇది. 

ఈ యేడాది ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇది వాస్తవం.

– కాంట్రాక్టు ఉద్యోగులకు మనం వచ్చాక టైంస్కేలు అమలు చేశాం.

– తెలంగాణతో పలుమార్లు పోలిక వస్తోంది.

మన ఆర్గ్యుమెంట్‌కు బలం చేకూరుతుందని.. తెలంగాణతో పోలిక చేస్తే బాగుంటుందని అనిపించవచ్చు.

నిజంగా తెలంగాణలో వస్తున్న ఆదాయాలు మనకు వస్తున్నాయా? వారి తలసరి ఆదాయం ఎంత? వీటన్నింటినీ ఒక సారి పరిశీలన చేయాలని కోరుతున్నా.

– తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ. 1,70,215 మాత్రమే.

–తెలంగాణాలో జీతాలు మీద వాళ్లు ఖర్చు చేసింది రూ.17 వేల కోట్లు, పెన్షన్ల కోసం రూ.5603 కోట్లు మొత్తం కలిపి వాళ్లు ఖర్చు చేసింది( కాగ్‌ రిపోర్టు ప్రకారం) రూ.22,608 కోట్లు.

ఇది ఏఫ్రిల్‌ నుంచి అక్టోబరు తొలి ఏడునెలల కాలానికి అయిన ఖర్చు.

–అదే మన రాష్ట్రంలో 2021–22లో తొలి 7 నెలల కాలంలో జీతాలకు రూ.24,681.47 కోట్లు చెల్లించాం. ఇదే సమయంలో పెన్షన్ల కోసం రూ, 11,324 కోట్లు చెల్లించాం. దాదాపుగా 36వేల కోట్లు చెల్లించాం.

– ఈ కాలంలో గుజరాత్‌లో వేతనాలు, పెన్షన్లకోసం ఇచ్చింది కేవలం రూ.16,053 కోట్లు.

– బిహార్‌లో వేతనాలు, పింఛన్లకోసం రూ. 25,567.5 కోట్లు చెల్లించారు.

– ఇలాంటి వాస్తవ పరిస్థితిలో ఉన్నాం.

– తెలంగాణలో హైదరాబాద్‌ను కోల్పోయాం.

– మనకు ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి. తెలంగాణాకు ఆదాయాలు పెరుగుతున్నాయనే పరిస్థితుల్లో వారు ఉన్నారు. 

ఇవన్నీ వాస్తవాలు.

– మీతో సమావేశానికి ముందు పలు దఫాలుగా అధికారులతో మాట్లాడాను. 

– ఈ రోజు మనం ఐఆర్‌ ఇస్తూ ఉండి ఏ జీతాలు ఇస్తున్నామో.. 

ఆ జీతాలే నేరుగా... కమిటీ చెప్పినట్టుగా 14.29శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఏడాదికి ప్రభుత్వంపై పడేభారం రూ.7,137 కోట్లు. ఇది వాస్తవం.

– ఇచ్చిన డీఏలు కూడా ఉద్యోగులకు అందాలి. ఫిట్‌ మెంట్‌ ఇచ్చే సమయానికి డీఏలు కూడా క్లియర్‌ కావాలి. 

– ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నాను.

– అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తాం.

– మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తాం:

– ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నాను.

– మనం ఉన్న పరిస్థితిని దయచేసి అందరూ ఆలోచన చేయాలి:

– రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నాను.

– అదే సమయంలో మీరు చెప్పినవన్నీ పరిగణలోకి తీసుకుంటాను.

– ఎంత మంచి చేయగలిగితే.. అంత మంచి చేస్తాను.

ఇది నా హామీ. 

– అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం.. మంచి చేయాలన్న తపనతో ఉన్నాం:

– 2–3 రోజుల్లో దీనిపై ప్రకటన ప్రకటన చేస్తాం:

వాళ్లు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి వ్యత్యాసం ఉంది, అందుకనే మీతో మాట్లాడుతున్నాను. 

– నేను మీ అందరి కుటుంబ సభ్యుడ్ని:

– మీ అంచనాలు కూడా కాస్తా తగ్గాలి, వీళ్లు కూడా కాస్తా పెరగాల్సిన అవసరం ఉంది, వీళ్లకు కూడా చెప్తున్నాను. 

దాన్ని పరిష్కరిద్దాం.

– మీకు మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నాను: ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ ముఖ్య అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today