APTF VIZAG: నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలి: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలి: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలి: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

నాడు – నేడు తర్వాత పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలి :

ఇప్పటికే ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి:

విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా అధికారులకు సీఎం ఆదేశాలు

స్కూళ్ల మ్యాపింగ్, జగనన్న విద్యాకానుక, నాడు –నేడు రెండో దశ, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, టాయిలెట్ల నిర్వహణ, స్వేచ్ఛ తదితర అంశాలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...

– ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు 

స్కూళ్ల మ్యాపింగ్‌కు అనుగుణంగా సిబ్బందిని నియామకం, నాడు–నేడు తర్వాత పిల్లల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అదనపు వసతుల కల్పన– స్కూళ్లలో ఏర్పాటుచేసిన వసతుల నిర్వహణ, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది.. ఈమూడు అంశాలపై దృష్టిపెట్టాలన్న సీఎం

– ఎప్పటికప్పుడు యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టును తనకు నివేదించాలన్న సీఎం

1.నూతన విద్యావిధానం ప్రకారం ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేశాం. 

ఇప్పటికే కొన్నింటిని ఈ కొత్త విధానం ప్రకారం ఏర్పాటు చేశారు. 

మిగిలిన స్కూళ్ల మ్యాపింగ్‌పై దృష్టిపెట్టాలన్న సీఎం, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి

ఆ మేరకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయలు, ఇతరత్రా అవసరాలను గుర్తించి వారిని నియమించాలన్న సీఎం

2.నాడు – నేడు కార్యక్రమం వల్ల స్కూళ్లలో పిల్లల సంఖ్య పెరిగింది:

ఈ నేపథ్యంలో పిల్లల సంఖ్యకు తగినట్టుగా మళ్లీ అక్కడ ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి: సీఎం

పిల్లల సామర్థ్యానికి తగినట్టుగా వసతులు, బోధన సిబ్బందిని పెట్టాల్సి ఉంటుంది

నాడు – నేడు మొదటి దశ, రెండో దశ తర్వాత పెరిగే పిల్లల సంఖ్యను పరిగణలోకి తీసుకుని అదనపు తరగతి గదులు, అదనంగా ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులు, నియమించాల్సిన బోధనా సిబ్బందిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి

3.నాడు–నేడు ద్వారా స్కూళ్లలో ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలి అధికారులకు సీఎం ఆదేశం

దీనికి గురించి పట్టించుకోకపోతే నాడు–నేడు కింద చేపట్టిన పనులకు అర్థంలేదు :

దీనిపై ఒక కార్యాచరణ సిద్ధంచేసుకోవాలి :

ఈ మూడు అంశాలపై యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టును తనకు నివేదించాలని అధికారులకు సీఎం ఆదేశం 

– సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది ఉండాలని స్పష్టంచేశాం :

– దీన్ని అమలు చేయడంలో ఉపాధ్యాయుల సహకారాన్ని తీసుకోవాలి

– ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుని సమర్థవంతంగా అమలు చేయాలి

– పిల్లలకు మంచి చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించి వారి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి

– ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారి సూచనలతో ముందుకెళ్లాలి

టీచర్లకు ఇంగ్లిషు బోధనపై శిక్షణ కార్యక్రమాల వివరాలు అందించిన అధికారులు

ఇంగ్లిషులో పరిజ్ఞానం కోసం ఉద్దేశించిన యాప్స్‌ను బాగా వినియోగించుకునేలా చూడాలన్న సీఎం.

జిల్లా అధికారులు నిరంతరం స్కూళ్లను పర్యవేక్షించాలన్న సీఎం

గోరుముద్ద నాణ్యత పరిశీలన కొనసాగాలన్న సీఎం

వసతుల్లో, నిర్వహణలో లోపాలు ఉంటే వెంటనే నమోదుచేసి వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం

గోరుముద్ద కింద ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం

మన ఇంట్లో మనం తినే తిండి ఎంత శుచిగా ఉండాలనుకుంటామో, టాయిలెట్లు ఎంత పరిశుభ్రంగా ఉండాలనుకుంటామో... స్కూళ్లలో వండే ఆహారం అంతే నాణ్యతగా ఉండాలని, టాయిలెట్లు కూడా అంతే పరిశుభ్రతతో ఉండాలన్న ముఖ్యమంత్రి

ప్రభుత్వ పాఠశాల అనేది అందరిదీ అనే భావన రావాలన్న సీఎం

అంగన్‌వాడీలుపైనా సమీక్ష.

అంగన్‌వాడీలు, స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్‌ క్లినిక్స్‌ దృష్టిపెట్టాలి

ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు నిర్వహించాలి

రక్తహీనత లాంటి సమస్యల నివారణకు ఇది ఉపయోగపడుతుంది

పీహెచ్‌సీ డాక్టర్లకు అనుసంధానం చేస్తే వారు తగిన చికిత్సను అందిస్తారు : అధికారులకు సీఎం నిర్దేశం. 

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ,ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (మిడ్‌ డే మీల్స్‌) డైరెక్టర్‌ బీ ఎం దివాన్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళీ, సర్వశిక్షాఅభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెట్రిసెల్వి, ఏపీఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ వి రాములు, కనెక్ట్‌ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బి ప్రతాప్‌ రెడ్డి, ఇతరఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today