APTF VIZAG: తగిన పత్రాలు లేకుంటే వాహనదారులకు జరిమానాలే

తగిన పత్రాలు లేకుంటే వాహనదారులకు జరిమానాలే

ఇప్పటివరకు వాహనాల డ్రైవింగ్‌ లైసెన్సులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, పర్మిట్లు వంటివి గడువు ముగిసినా, లేకపోయినా అంతగా పట్టించుకోని రవాణాశాఖ.. ఇకపై వీటన్నింటిపైనా జరిమానాలు విధించేందుకు సన్నద్ధమైంది. తనిఖీలు ముమ్మరం చేయాలని, నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు వేయాలంటూ క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తనిఖీలు నిర్వహించి, జరిమానాల ద్వారా రూ.352 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రూ.70 కోట్ల వరకు వసూళ్లయ్యాయి. తనిఖీలు పెంచి మార్చి లోగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరాలని నిర్ణయించింది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today