APTF VIZAG: 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఉద్యోగులకు బోనస్

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఉద్యోగులకు బోనస్

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు తాత్కాలిక బోనసు మంజూరుచేసింది. కేంద్ర పారామిలటరీ బలగాలు, సాయుధ బలగాలకూ ఈ బోనస్ ను మంజూరుచేసినట్లు కేంద్ర ఖర్చుల వ్యవహారాల విభాగం పేర్కొం ది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉద్యోగంలో ఉన్నవారు, 2020-21 కాలంలో మధ్యలో ఎలాంటి విరామంలేని ఆరునెలల కనిష్ట సర్వీస్ కాలం ఉన్నవారు ఈ బోసస్ పొందేందుకు అర్హులు. ఉత్పత్తి ఆధారిత బోనస్ పథకాలతో లబ్దిపొందని గ్రూప్-బి నాన్ గెజిటెడ్ ఉద్యో గులు, గ్రూప్-సీ ఉద్యోగులకు ఈ తాత్కాలిక బోనసు ఇవ్వనున్నారు. ఈ బోనస్ ను లెక్కించేటపుడు గరిష్టంగా రూ.7,000 వేతనాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. 30 రోజుల వేతనాన్ని బోనస్ గా చెల్లిస్తారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4