పది, ఇంటర్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.
★ విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
★ జులై 31 లోపు ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది.
★ ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుంది.
★ సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం.
★ మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతాం
★ ఫలితాల కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తాం.
★ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదు.
★ విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాం’’ అని మంత్రి వెల్లడించారు.
No comments:
Post a Comment