APTF VIZAG: JEE Mains Exams Postponed Due to COVID

JEE Mains Exams Postponed Due to COVID

జేఈఈ మెయిన్

★ దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా జేఈఈ మెయిన్‌ (మే సెషన్) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

★ విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ వెల్లడించారు.

★ మే 24 నుంచి 28వరకు మే సెషన్‌ జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉంది.  తదుపరి అప్‌డేట్స్‌ కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యార్థులకు పోఖ్రియాల్‌ విజ్ఞప్తి చేశారు.  

★ ఇప్పటికే రెండు విడతలు ఫిబ్రవరి (23 నుంచి 26 వరకు); మార్చి 16 నుంచి 18 తేదీల్లో పరీక్షలు పూర్తయ్యాయి.  

★ మూడో విడత పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ ఉద్ధృతి వేళ వాటినీ ఇటీవల వాయిదా పడ్డాయి. దీంతో ఏప్రిల్‌, మే సెషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను రీషెడ్యూల్‌ చేయనున్నారు. 

★ మరోవైపు, ఎన్‌టీఏ అభ్యాస్‌ యాప్‌ ద్వారా ఈ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ కావొచ్చని సూచించింది. 

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4