ఇ-పాస్ విధానం
★ ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ సవాంగ్ హెచ్చరించారు.
★ అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ షరతులు కొనసాగుతాయన్నారు.
★ అత్యవసర ప్రయాణికుల కోసం రేపట్నుంచి ఇ-పాస్ విధానం అమలు చేయనున్నాం. ఇ-పాస్ పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి.
★ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదు.
★ శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి.
★ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఉల్లంఘనలపై డయల్ 100, 112నెంబర్లకు సమాచారం అందించాలి’’ అని డీజీపీ అన్నారు.
★ ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు విజృంభణలో సర్కారు పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నెల 18 వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు.
No comments:
Post a Comment