APTF VIZAG: ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేష్

ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేష్

టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకు ఏర్పాట్లు అన్నీ జరిగాయని  విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ నెలాఖరు వరకూ విద్యార్థులకు సెలువు ఇచ్చామని జూన్ 1 నుండి ఉపాధ్యాయుల్ని స్కూల్స్‌కు రమ్మని చెప్పామని అన్నారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. 

పరీక్షల నిర్వహణకు ఇంకా మూడు వారాల సమయం ఉందన్నారు. పదో తరగతిలో గ్రేడింగ్ లేకపోతే విద్యార్థులకు నష్టం వాటిళ్లుతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారన్నారు. ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results