APTF VIZAG: AP గిరిజన గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

AP గిరిజన గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

ఏపీ ఏకలవ్య గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్లలో ప్రవేశానికి 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది.

2020-21 విద్యాసంవత్సరంలో ఐదో తరగతిని ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న గిరిజన విద్యార్థులు ఆరో తరగతిలో చేరేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

జూన్ 16 లోపు దరఖాస్తులు పంపాలి.

సీబీఎస్ఈ బోర్డు విద్యా ప్రణాళికను అనుసరించి విద్యా ప్రణాళిక అమలు చేస్తారు

గమనిక:

1. వార్షిక ఆదాయం Rs.1,00,000 (ఒక లక్ష) కంటే తక్కువ ఉండాలి.

2. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వవలెను. మునుముందు ఈ ఫోన్ నెంబర్ కి మాత్రమే, అడ్మిషన్ కి సంబంధించిన వివరాలు వస్తాయి.

3. ఈ దరఖాస్తు లో నమోదు చేయబడిన వివరాలు మార్పు చేయడానికి తదుపరి అభ్యర్ధనలు ఉండవు.

APPLICATION START DATE : 26-05-2021

APPLICATION END DATE : 16-06-2021

APPLICATION Form  For EMRS Admission for 6th class and Backlog Admission for 7th and 8th classes

https://apgpcet.apcfss.in/TWSixthForm.aprjdc

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today