మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్ట్ తీర్పు.
పరిషత్ ఎన్నికలు నిలిపేయండి: హైకోర్టు
: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కోడ్ విధించలేదని హైకోర్టు ఆక్షేపించింది. కోడ్ విషయంలో నాలుగు వారాల గడువు నిబంధన పాటించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 8న ఎన్నికలు నిర్వహించేలా ఇటీవల ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment