ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయితి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక షెడ్యూల్ ని విడుదల చేయగా ఏపీ సర్కార్ హైకోర్ట్ కి వెళ్ళింది. దీన్ని సింగిల్ జడ్జి ధర్మాసనం విచారించి… ఎన్నికల షెడ్యూల్ ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఎన్నికల ప్రక్రియ అనేది కరోనా వ్యాక్సినేషన్ కు అడ్డు రావొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ కి వెళ్ళగా దానిపై విచారణ జరిపిన హైకోర్ట్ రెండు రోజుల క్రితం తీర్పు రిజర్వు చేసింది. దీనిపై హైకోర్ట్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అంటూ అందరూ కూడా ఆసక్తికరంగా చూసారు.
No comments:
Post a Comment