స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన - రాష్ట్ర ఎన్నికల కమిషనర్.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ శనివారం ఉదయం విడుదల చేశారు.
👉తొలి దశ ప్రక్రియ ఇలా..
👉మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికతో ముగుస్తుంది.
జనవరి 23: నోటిఫికేషన్ జారీ
👉25: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ
👉 27: నామినేషన్ల దాఖలుకు తుది గడువు
👉 28: నామినేషన్ల పరిశీలన
👉 29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
👉30: ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం
👉 31: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు)
అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
👉ఫిబ్రవరి 5: పోలింగ్ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్)
👉 పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
No comments:
Post a Comment