APTF VIZAG: పత్రికా ప్రకటన: అక్టోబరు 5నాటికి 'జగనన్న విద్యా కానుక' వాయిదా

పత్రికా ప్రకటన: అక్టోబరు 5నాటికి 'జగనన్న విద్యా కానుక' వాయిదా



ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య సంచాలకులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు (ఐ.ఎ.ఎస్) గారు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జగనన్న విద్యాకానుక' కార్యక్రమాన్ని సెప్టెంబరు5వ తేదీన ప్రభుత్వం నిర్వహించాలనుకున్న విషయం విదితమే.
అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ - 19 అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు 30 దాకా పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించడం వలన ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5వ తేదీ నాటికి వాయిదా వేస్తున్నట్లు తాత్కాలికంగా నిర్ణయించడమైనదని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today