APTF VIZAG: June 2022

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

RTC చార్జీలు పెంపు నేటి నుంచి అమల్లోకి

పల్లెవెలుగు

★పల్లెవెలుగులో 30 కి. మీ. వరకు పెంపు లేదు. 

★తర్వాత 35-60 కి.మీ. వరకు రూ.5 చొప్పున, 

65-70

కి.మీ.కు రూ.పది, 70-95 కి.మీ.కు రూ.15,

100-120

కి.మీ.కు రూ.20 చొప్పున పెంచారు.

అల్ట్రా పల్లెవెలుగు

★అల్ట్రా పల్లెవెలుగులో 25 కి.మీ. వరకు ప్రస్తుతఛార్జీయే ఉంటుంది.

 30-55 కి.మీ. దూరానికి రూ.5,

55-65 కి. మీ.కు రూ.10,65-100 కి. మీ.కు రూ. 15,

105-110 కి. మీ. కు రూ.20,115-120 కి.మీ.కు రూ. 25

చొప్పున పెరిగింది.


ఎక్స్ ప్రెస్

★ ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో 30 కి. మీ. వరకు పెరగలేదు.

ఆ తర్వాత 20-30 కి. మీ. చొప్పున దూరం పెరిగే కొద్దీ

రూ.5 చొప్పున పెంచుతూ... చివరగా 491-500 కి. మీ.

దూరానికి రూ.90 పెంచారు

అల్ట్రా డీలక్స్

 ★అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో 20 కి.మీ. వరకు ప్రస్తుత

ఛార్జీయే ఉంటుంది. ఆపై 15-30 కి. మీ. ణంగా పెంచారు. గరిష్ఠంగా 500 కి.మీ. వరకు దూరా

నికి రూ.140 చొప్పున పెరిగింది. ఈ ఏసీ సర్వీసులకు

మళ్లీ 5% జీఎస్టీ అదనంగా వసూలు చేయనున్నారు

Memo No. ESE02-27021/21/ 2022-MDM-CSE Dated:30/06/ 2022 SOP for staff of Village Secretariate/Ward Secretariate to visit the schools

 విలేజ్/ వార్డు సెక్రటరీ స్టాఫ్ పాఠశాలల మీద పర్యవేక్షణ కొరకు sop విడుదల. ఎవరెవరు ఏమేమి పర్యవేక్షిస్తారు Guidelines విడుదల చేయడం జరిగింది.

Click Here To Download Proceedings

FEED BACK ON PHYSICAL SCIENCE/BIOLOGICAL SCIENCE AND SOCIAL STUDIES NCERT TEXT BOOK ORIENTATION

ఫిజికల్ సైన్స్/బయోలాజికల్ సైన్స్ మరియు సోషల్ స్టడీస్ NCERT టెక్స్ట్ బుక్ పై జరిగిన ఓరియెంటేషన్‌ కార్యక్రమం ఫీడ్ బ్యాక్ ఫామ్

సాంకేతిక లోపమే కారణం.జిపిఎఫ్' నిధుల పై ప్రభుత్వ వివరణ

సాంకేతిక లోపం కారణంగానే ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాలో సమస్యలు ఏర్పడ్డాయని ప్రభుత్వం వివరించింది. ఈ మేకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత వివరణ ఇచ్చింది. ఈ వివరణ ప్రకారం ఉద్యోగులు జిపిఎఫ్ ఖాతాల్లో డిఎ బకాయిల నిధులు అసలు జమ కానే లేదు. డిఎ బకాయిల బిల్లులు సంబంధిత అధికారుల నుండి క్లియరెన్స్ కోసం సంబంధిత పేమెంట్ అప్లికేషన్ వద్దకు వెళ్లాయి. అక్కడ క్లియర్ కాకముందే సాంకేతిక సమస్యల వల్ల జిపిఎఫ్ ఖాతాల్లో తప్పుగా క్రెడిట్ అయ్యాయి. ఆ మేరకు మొత్తం ఖాతాల్లో కనిపించింది కానీ నిజానికి జమ కాలేదని ప్రభుత్వం తెలిపింది ట్రెజరీ నిబంధనల ప్రకారం మార్చి 31వ తేదిన పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను ట్రెజరీ ఆఫీసర్ క్యాన్సిల్ చేస్తారని. ఆ పని ఆయన చెయ్యడంతో తప్పుగా క్రెడిట్ అయిన మొత్తాన్నికూడా సిస్టమ్ సాఫ్ట్ వేర్ వెనక్కి తీసుకుందని పేర్కొంది. దీంతో డబ్బులు జమ చేసి వెనక్కి తీసుకున్నట్లుగా కనిపించిందని వివరించింది. ఈ డిఎ మొత్తం మినహా జిపిఎఫ్ ఖాతాలకు సంబంధించిన ఏ ఇతర మొత్తమూ ఆటో డెబిట్ కాకపోవడాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం సాంకేతిక లోపాన్ని సరిదిద్దుతామని, డిఎ బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లించి ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తామని పేర్కొంది.

Kgbv schools teachers transfers guidelines and shedule

కేజీబీవీ టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు.రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) పని చేస్తున్న బోధనా సిబ్బంది బదిలీలకు అనుమతి నిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.

Click Here TO Download Go 

 బదిలీలు ఆన్లైన్ విధానంలో, పునర్విభజనకు ముందున్న జిల్లా ప్రాతిపదికన నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపాల్, సీఆర్టీ, పీఈటీ, పీజీటీలు ఒకే చోట రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోరవచ్చు. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన ప్రిన్సిపాల్స్, ఎనిమిదేళ్ల సర్వీసున్న సీఆర్టీ, పీఈటీలు తప్పనిసరిగా బదిలీ కావాలి. బదిలీలన్నీ సంబంధిత జిల్లాలోనే చేపట్టాలి. మ్యూచువల్ ఆమోదం ఉంటేనే అంతర్ జిల్లా బదిలీకి అవకాశం కల్పిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆన్లైన్లో నిర్వహించే ఈ బదిలీల నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్ గా, డీఈవో సభ్యులుగా, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ మెంబర్ కన్వీనర్ గా, డైట్ ప్రిన్సిపాల్ సభ్యులుగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

SSC Advance Supplentary&Betterment July 2022 Exams Student &School wise Hall Tickets released

10వ తరగతి సప్లిమెంటరీ మరియు బెటర్మెంట్ పరీక్షలు జులై 2022 హాల్ టికెట్స్ విడుదల.

విద్యార్థులు సొంతంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే లింక్ మరియు పాఠశాల వారీగా అందరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే లింక్ క్రింది పేజీలో కలవు.

SCHOOL WISE DOWNLOAD


https://bse.ap.gov.in/SCHRESULTTWT/Account/Login.aspx


INDIVIDUAL WISE DOWNLOAD LINK


https://www.bse.ap.gov.in/apsscsschtno/HallTicketsSel.aspx

Proc.Rc.No.Spl.SCERT/2022 Dated: -06-2022 SCERT, AP – Quality Initiatives – Implementation of an Innovative Program “Learn A Word A Day(22 days) in all schools under all managements from 05-07- 2022 to 30-07-2022 – Action plan communicate

 జూలై 5వ తేదీ నుండి జూలై 30వ తేదీ వరకు LEARN A WORD a Day  కార్యక్రమం లో భాగంగా ప్రతీ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్.

Click here to download words list


APRJC & APRDC Results link

Ap residential junior college and degree College entrance exam result released
ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి
APRJC Intermediate Result 2022-23 download


APRDC Degree Result 2022-23 download

Training on 8th Physics textbook -youtube link (29/06/2022)

 8వ తరగతి భౌతిక శాస్త్రం సబ్జెక్ట్ పాఠ్య పుస్తకాలపై YouTube లైవ్ శిక్షణ లింక్ (11:00 నుండి 1:00 వరకు)

https://youtu.be/_humokZAJI4


ఉద్యోగుల జీపీఎఫ్ మాయం!ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎడా పెడా అప్పులు చేస్తుందనే విపక్షాల ఆరోపణ ల నేపథ్యంలో ప్రభుత్యోగుల జీపీఎఫ్ రూ.800 కోట్లు మాయం అయినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రేకెత్తించాయి. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్ ఖాతాల నుంచి వారి అనుమతి లేకుండా నగదు ఉపసంహ రించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్రిమినల్ కేసులు పెడతామని సూర్యనారాయణ హెచ్చరించడం కలకలం సృష్టిస్తోంది. గతంలో ఇదే తరహాలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తే తిరిగి డబ్బులను జమ చేశారన్నారు. తమ ఖాతాల్లో డబ్బులు ఉపసంహరించినట్లు గత రాత్రి ఉద్యోగులకు సందేశాలు వచ్చాయన్నారు. తన వ్యక్తిగత ఖాతా నుంచి 83 వేల రూపాయలు విత్ డ్రా చేసేశారన్నారు. తానొక్కడిదే కాదని రాష్ట్రంలోని 90 వేల మంది ఉద్యోగులకు చెందిన పీఎఫ్ ఖాతాల నుంచి రూ. 800 కోట్ల వరకు వెనక్కు తీసుకున్నారని తెలిపారు.

జీపీఎఫ్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకుని చూస్తే తమ ఖాతాల్లో నగదు ఉపసంహరించినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసేం దుకు వెళ్తే అధి కారులు అందుబాటులో లేరన్నారు. ఉద్యో గుల సమ్మతి లేకుండా వారి ఖాతాల నుంచిసొమ్ము విత్ డ్రా చేయడం నేరమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి తెలిసే జరి గాయా.. లేక అధికారుల తప్పిదమా తెలియదన్నారు.. ఏది ఏమైనా మా సమ్మతి లేకుండా మా ఖాతాల నుంచి విత్ డ్రా చేయడం నేరమని, విత్ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తమ ఖాతాల్లో ఉప సంహరించిన నగదు తిరిగి జమ జమ చేసినా క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరిం చారు. ఉద్యోగుల ఖాతాల నుం చి నగదు విత్ డ్రా చేసే సాంకేతికత ఉండటం చట్టబద్దమా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల కోసం ప్రభు త్వం కాళ్ళు పెట్టు కోవడమే తక్కువ యిందని సూర్య నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకా యిలు చెల్లించ మని ప్రభుత్వాన్ని అడిగితే డీఏ బకా యిలను కూడా ప్రభుత్వం డ్రా చేసిందనీ ఆరోపించారు. తమ అనుమతి లేకుం డా మా ఖాతాల నుంచి నగదు ఉప సంహరించే అధికారం ప్రభుత్వానికి ఎక్క డిదని ఆయన నిలదీసారు. ఈ విషయంపై ఏజీని కూడా ప్రస్నుస్తా మన్నారు. మార్చి నెలాఖరులో జరిగిన లావాదేవీలను ఇప్పటివరకు చెప్పకపోవడమూ తప్పిదమేనని సూర్య నారాయణ అన్నారు.

విద్యార్థులకు ట్యాబ్ లు, తర గతి గదుల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుపై జులై 15 కల్లా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశిం చారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు సెప్టెంబరులో ట్యాబ్ లు ఇస్తామని వెల్లడించారు. మంగళవారం 'నాడు-నేడు'పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లా డుతూ.. "విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లో బైజూస్ కంటెం ట్ను అప్లోడ్ చేయాలి. దీనికి తగినట్లు ట్యాబ్ స్పెసి ఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. టెండర్లు పిలిచేటప్పుడు నాణ్యతను దృష్టిలో ఉంచుకోవాలి. ఎనిమిదో తరగ తిలో ఇచ్చే ట్యాబ్ 9, 10 తరగతుల్లోనూ పని చేయాలి. మూడేళ్లపాటు ట్యాబ్ నాణ్యతతో పని చేయాలి.  ఏదైనా సమస్య వస్తే దానికి మరమ్మతులు చేసే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మంచి కంపెనీ లను పరిగణనలోకి తీసుకోవాలి" అని సూచించారు. "తరగతి గదిలో డిజిటల్ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొం దించాలి. తరగతి గదిలో డిజిటల్ స్క్రీన్, బ్లాక్ బోర్డుల అమరిక ఎలా ఉండాలన్న దానిపై ఆలోచించాలి. స్క్రీన్ మీద కంటెంట్ను హైలైట్ చేసుకునేలా.. బొమ్మ పరిమాణం పెంచుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుంది. డిజిటల్ స్క్రీన్లు, ప్యానెళ్ల భద్రత పైనా దృష్టి పెట్టాలి" అని వెల్లడించారు. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరి కొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాది స్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

Feedback Google Form to be submitted by all Biology Teachers who have attended YouTube Live on 8th Class New Text Books today is available at the following site

 ఈరోజు 8th Class New Text Books మీద యూట్యూబ్ లైవ్ కు అటెండ్ అయిన బయోలజీ టీచర్స్  అందరూ  సబ్మిట్ చేయాల్సిన Feed Back Google Form link

https://forms.gle/xn2EvhxK5wYjxhtF8


Rc.No.ESE02-33/12/2019-SECY-SGF-CSE Dated:27/06/2022- School Education – School Games Federation of Andhra Pradesh –Appointment of District level School Games Secretaries for the tenure of two (02) years i.e., 2022-2023 to 2023-2024

 నూతన జిల్లాల స్కూల్ గేమ్స్ కార్యదర్శుల నియామకం కోసం నోటిఫికేషన్. విధి విధానాలు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ.

Click Here To Download proceedings 

Training on 8th Text books- Biology subject-YouTube link (11:00 to 1:00)

8వ తరగతి జీవశాస్త్రం సబ్జెక్ట్  పాఠ్య పుస్తకాలపై YouTube శిక్షణ లింక్ (11:00 నుండి 1:00 వరకు)

https://youtu.be/LJ3ab9cMv24




Assessment on Library capacity building orientation organized ( YouTube live) on 23 June 2022 by Room to Read.

 ఆన్ని జిల్లాల ఉపాధ్యాయులు 23 జూన్ 2022న జరిగిన రూమ్ టు రీడ్ ద్వారా లైబ్రరీ కెపాసిటీ బిల్డింగ్ ఓరియంటేషన్‌పై అసెస్‌మెంట్ ను క్రింది గూగుల్ ఫారం లో సబ్మిట్ చేయగలరు.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdLX_qhG6LGbXKebAyiSr2zLz8_pe4-QnomJudkjHjclulfkA/viewform

Capacity building training for all High School HMS on AP academic and administrative reforms

రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికి జిల్లా స్థాయిలో  AP అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలు 2022 మరియు వాటి అమలు పై రెండు రోజుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ నిర్వహించుటకు ఉత్తర్వులు Rc.No.  ESE02/440/2022-SCERT తేదీ: 25.06.2022 విడుదల.



Hon'ble Chief Minister of Andhra Pradesh Sri Y.S. Jagan Mohan Reddy will be Depositing Annual Financial Assistance into the Accounts of Mothers of Children studying from classes 1 to Intermediate, under "Jagananna Amma Vodi" and Addressing the Public at Kodi Rammurthy Stadium Srikakulam on 27-06-2022 Monday at 10:55 AM

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు పిల్లల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి సహాయాన్ని  జమ చేయనున్నారు. దీనికి సంబంధంచిన live వీడియో కార్యక్రమం.

 https://youtu.be/Kqek3NSuiBM



Foundation, foundation plus,pre High School,High School academic calander 2022-23 Released by SCERT

ఫౌండేషన్ , ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ మరియు హైస్కూల్లో 2022 - 23 విద్యాసంవత్సరాలకు అకడమిక్ క్యాలెండర్లను విడుదల చేయడం జరిగింది.

రోజు వారీ, నెల వారీ నిర్వహించవలసిన కార్యక్రమాలను పొందుపరచడం జరిగింది.

Click Here TO Download ACADEMIC CALENDAR


GSWS Secretaries Probation Declaration GO 5 Release

 PROBATION DECELERATION OF AP గ్రామ/వార్డ సచివాలయం Employees from 1-7-2022 with new Pay scales.

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల


గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జి ఓ ఎమ్ ఎస్ నెంబర్ 5 ద్వారా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

Click Here To Download Go



Jagananna Ammavodi Programme 2021-22- Financial Assistant of Rs.15,000/- per annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to Schools/Colleges i.e., from Classes I to XII (Intermediate Education)- Guidelines on launch of the programme on 27-06-2022 at Srikakulam District by Hon'ble Chief Minister for the academic year 2021-2022

గౌరవ ముఖ్యమంత్రి గారిచే జగనన్న అమ్మ ఒడి 2021- 2002 ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి మండల, జిల్లా స్థాయి కార్యక్రమం ల లో అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఉత్తర్వులు విడుదల.

Ap cabinet meeting decissions


ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

42 అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్

కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు

ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్

వైద్యారోగ్య పోస్టుల భర్తీకి  కేబినెట్ ఆమోదం

ఈ నెల 27న  అమ్మ  ఒడి నిధులకు ఆమోదం

జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర,  కాపు నేస్తం పథకాలకు  కేబినెట్ ఆమోదం

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఆదానీ గ్రీన్  ఎనర్జీ ప్రాజెక్టు

దేవాలయాల కౌలు భూముల పరిరక్షణ చర్యలపై కేబినెట్ ఆమోదం

వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.216 కోట్లు మంజూరు

అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

జగనన్న ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి పాలసీకి కేబినెట్ ఆమోదం

AGRI POLYCET-2022 hall tickes released Download Hall Tickets

ఏపీ అగ్రి పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది.


https://angrauagripolycet.aptonline.in/hallticket.php

DSC 1998 Qualified candidates for taking them into service on MTS basis on par with DSC 2008 qualified teachers Expression of Interest-Called for-Reg.

DSC 1998 క్వాలిఫైడ్ వారిని ఎస్జీటీ లు గా మినిమమ్ టైమ్ స్కేలు లేదా సీఆర్పీ లుగా లేదా ఏ పి మాడెల్ స్కూల్స్ లో గెస్ట్ టీచర్ లుగా పనిచేయుటకు ఆసక్తి ఉన్న వారి వివరాలు సేకరించాలని కమిషనర్ వారికి అనుమతి 



Issuance of latest order requiring all teachers in private aided / unaided schools to pass the TET.

ప్రైవేట్ ఎయిడెడ్/అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరు తప్పక టెట్(TET) ఉత్తీర్ణత కావాలంటూ తాజా ఉత్తర్వు విడుదల.

Online Capacity Building Programme to all Teachers on School Library

లైబ్రరీ నిర్వహణపై అందరు  ఉపాధ్యాయులు online Training on School Library కు క్రింది లింక్ ద్వారా   ఇవ్వబడిన  Attendance Link నందు హాజరు submit చేయవలెను.

Link to submit attendance
https://zfrmz.com/eSowwJeC1F5ag9VROzSE

రేషనలైజేషన్ పూర్తి చేయుటకు జిల్లాల వారీగా టైమ్‌లైన్ షెడ్యూల్ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.24,25 తేదీల లోపు వివరాలు అందజేయాలి


రాష్ట్రంలోని అందరూ పాఠశాల విద్య ప్రత్యేక అధికారులు మరియు అన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల కు తెలియ జేయునది పైన చదివిన 2వ సూచనలో , ప్రభుత్వ ఉత్తర్వులు మరియు మార్గదర్శకాల ప్రకారం పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని మరియు వాటి వివరాలు సమర్పించడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. పాఠశాలల వారీగా కన్వర్షన్ పోస్టుల జాబితా మరియు 16.06.2022న లేదా అంతకు ముందు నిర్ణీత ప్రొఫార్మాలో పాఠశాలల్లో అప్‌గ్రేడ్ చేయాల్సిన సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితాసమర్పిచాలి.కానీ నేటికీ ఈ కార్యాలయానికి ఎలాంటి నివేదిక అందలేదు. కావున, పాఠశాల విద్య యొక్క అందరు ప్రత్యేక అధికారులు, రాష్ట్రంలోని జిల్లా విద్యా అధికారులు మరియు సంబంధిత జిల్లాల ASOలు/APOలు ముందుగా కోరిన విధంగా వారు ధృవీకరించిన అన్ని వివరాలతో పాఠశాల విద్య, AP, అమరావతి యొక్క O/o కమీషనర్‌  కార్యాలయం కు నివేదికలు అందజేయాలని అభ్యర్థించారు. షెడ్యూల్ చేయబడిన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి


SI.No. జిల్లా తేదీ పేరు


1 శ్రీకాకుళం 24.06.2022 ఉదయం సెషన్


2 విజయనగరం 24.06.2022 ఉదయం సెషన్


3 విశాఖపట్నం 24.06.2022 ఉదయం సెషన్


4 తూర్పు గోదావరి 24.06.2022 మధ్యాహ్నం సెషన్


5 పశ్చిమ గోదావరి 24.06.2022 మధ్యాహ్నం సెషన్


6 కృష్ణా 24.06.2022 మధ్యాహ్నం సెషన్


7 గుంటూరు 24.06.2022 మధ్యాహ్నం సెషన్



8 ప్రకాశం 25.06.2022 ఉదయం సెషన్


9 నెల్లూరు 25.06.2022 ఉదయం సెషన్


10 చిత్తూరు 25.06.2022 ఉదయం సెషన్


11 కడప 25.06.2022 మధ్యాహ్నం సెషన్


12 కర్నూల్ 25.06.2022 మధ్యాహ్నం సెషన్


13 అనంతపురం 25.06.2022 మధ్యాహ్నం సెషన్

U DISE PLUS 2021-22 certify option enabled

 U DISE PLUS 2021-22 లో Certify ఆప్షన్ Enable అయ్యింది.Udise Data Cerity చేసి MEO ఆఫీస్ కి స్కూల్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలి.

CLICK HERE TO U DISE+ WEBSITE

https://udiseplus.gov.in/ud/home?loginId=1


 Udise Data Cerity చేసే పూర్తి విధానం మరియు Certify చేసిన తర్వాత MEO ఆఫీస్ కి అందించవలసిన School Certificate (Status: Certified గా ఉన్న) డౌన్లోడ్ చేసుకునే విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

నోట్: అన్ని పాఠశాలల వారు సరిగా UDISE + DATA 2021-22 CERTIFY చేయాలి.

AP SSC Supplementary Exams Fee 2022 Exempted Rc.No. GE-EXAMOSSC(REFM)/ 3/2022-DGE Dated: 22-06-2022

10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జులై 2022 కు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి పరీక్ష రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

పాఠశాల వారు ఎటువంటి నామినల్ రోల్స్ సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు.

 Fail అయిన అందరు విద్యార్థులకు Hall టికెట్స్ ఆటోమేటిక్ గా Generate అవతాయి.



అమ్మఒడి’కి లక్ష మంది దూరం

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది.

 🔹పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. 

🔸అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

 🔹ఈ పథకంలో ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మందికిపైగా కోత పెట్టింది.

 🔸పాఠశాలలకు గైర్హాజరు కావడంతో 51 వేల మందిని ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది.

🔹 వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది.

It is proposed to conduct Aadhaar special camp in all secretariats with Aadhaar enrolment kits (AEK) on 29th June 2022. Hence it is requested communiacate the same to all the concerned MPDOs/MCs to plan in advance to involve school students and citizens for smooth execution of Aadhaar camp.

 29 జూన్ 2022న ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కిట్‌లతో (AEK) అన్ని సెక్రటేరియట్‌లలో ఆధార్ ప్రత్యేక  శిబిరాన్ని నిర్వహించాలని ప్రతిపాదించబడింది. అందువల్ల  సంబంధిత MPDOలు/MCలందరికీ  కమ్యూనికేట్ చేయాలని అభ్యర్థించబడింది.


ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గం-విద్యా శాఖ మంత్రి

ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించామని అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. 884 హై స్కూల్స్‌ను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. వాటిల్లో ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు  తీసుకుంటున్నామన్నారు. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజ్ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

MEOs are requested to inform all the teachers in your jurisdiction to attend the online meeting on 23.06.2022 through virtual mode on "Capacity building of Teachers by Room to Read in Govt Schools - Strengthening of school Libraries and effective utilization of Library resources along with reading activities" by You Tube Link. Link will be given soon.

పాఠశాల లైబ్రరీలను బలోపేతం చేయడం మరియు పఠన కార్యకలాపాలతో పాటు, లైబ్రరీ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడంపై ఉపాధ్యాయులందరికీ ఒకరోజు కెపాసిటీ బిల్డింగ్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ.. సూచనలతో తాజాగా ఉత్తర్వులు.




Ammavodi amount credited parents on June 27th

అమ్మఒడి సాయం 27న.అమ్మఒడి పథకం మూడో విడత సాయాన్ని ఈనెల 27న తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి శ్రీకాకుళంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 43,19,090 మంది తల్లుల జాబితాను గ్రామ, వార్డు సచివాల యాలకు పంపించారు. ఇందులో 41,70203 మంది తల్లుల ఈ కేవైసీ పూర్త . అర్హత కోల్పోయిన వారి జాబితాలను మాత్రం సచివాలయాలకు పంపించలేదు. దీంతో లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని తల్లులు సచివాలయం అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏ కారణంతో తాము అర్హత కోల్పోయామో చెప్పాలని నిలదీస్తున్నారు. తల్లుల నుంచి ఒత్తిడి పెరగడంతో సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 2021 జనవరి 11న 44,48,865 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమ చేశారు. మరు గుదొడ్ల నిర్వహణ కోసం రూ. వెయ్యి చొప్పున మినహాయించి, మిగతా రూ.14 వేలు మాత్రమే ఇచ్చారు. ఈసారి పాఠశాలల నిర్వహణకు రూ.2 వేలు మిన హాయించనున్నారు. మిగతా రూ.13 వేలను తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.

జీవో 117కు సవరణలు? విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని మార్చాలని సంఘాలు డిమాండ్‌. త్వరలో చెబుతానన్న మంత్రి బొత్స . ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘ చర్చ

 ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌కు సంబంధించి వస్తున్న ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సర్కారు ఇచ్చిన జీవో 117లో కొన్ని సవరణలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే, కీలకమైన వాటి మీద సవరణలు ఉంటాయా? లేదాదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవో 117పై వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో మంగళవారం సమావేశమయ్యారు. యూటీఎఫ్‌, ఎస్‌టీయూ, ఏపీటీఎఫ్‌, ఏపీటీఫ్‌(1938), ప్రధానోపాధ్యాయుల సంఘం, ఆప్టా తదితర సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. జీవో 117లో ఉన్న లోపాలు, సమస్యలను సంఘాల నాయకులు మంత్రికి వివరించారు. సదరు జీవోను అమలుచేస్తే విద్యాశాఖ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానంగా నాలుగు అంశాలపై సంఘాలు తమ వాదన వినిపించాయి. ప్రాథమిక పాఠశాలల్లో గతంలో విద్యార్థులు:ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20గా ఉండేదని, జీవో 117లో దాన్ని 1:30గా మార్చడం తగదన్నారు.

ఇప్పటికే పలు ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయని, ఈ జీవోను అమలుచేస్తే ప్రాథమిక పాఠశాలల్లో సగం ఏకోపాధ్యాయగా మారిపోతాయన్నారు. అదే సమయంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రఽధానోపాధ్యాయులు, పీఈటీలను తీసేస్తామని చెప్పడం, ఉన్నత పాఠశాలల్లో నిర్దిష్ట సంఖ్యలో కంటే తక్కువ విద్యార్థులుంటే ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు ఉండబోరని చెప్పడం సరికాదన్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు:ఉపాధ్యాయుల నిష్పత్తిని పెంచడం వల్ల ఒక్కో ఉపాధ్యాయుడు వారానికి 42 తరగతులు తీసుకోవాల్సి వస్తుందని, ఇది తీవ్రభారం అవుతుందని అన్నారు. ఇప్పటివరకు వారానికి 32 తరగతులు తీసుకుంటుండగా.. దీన్ని 42 తరగతులకు పెంచడం, ఒక్కోసారి 48 తరగతులు కూడా తీసుకోవాల్సి రావడం సరికాదన్నారు. దీనివల్ల విద్యానాణ్యత దెబ్బతింటుందన్నారు. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో కేవలం ఆంగ్లమీడియం మాత్రమే పెట్టడం సరికాదని, తెలుగుమీడియం కూడా ఉండాలన్నారు. ఆయా అంశాలపై స్పందించిన మంత్రి బొత్స కొన్నింటిని మార్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిసింది. ముఖ్యంగా హెచ్‌ఎంలు, పీఈటీల అంశంలో సవరణలు చేస్తామని, వారిని ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు:ఉపాధ్యాయుల నిష్పత్తిపైనా ఆలోచిస్తామన్నారు. అయితే, ఉపాధ్యాయులకు వారానికి 42 తరగతులు పడవని, 36కు మించి తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పినట్టు తెలిసింది. యూటీఎఫ్‌ రాష్ట్ర ఽఅధ్యక్షుడు ఎన్‌. వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, ఎస్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిశ్రీనివాస్‌, తిమ్మన్న, ఏపీపీటీఏ నేతలు కాకి ప్రకాశ్‌రావు, వైసీపీ టీచర్స్‌ అసోసియేషన్‌, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గిరిప్రసాద్‌, మల్లు శ్రీధ ర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు

రాష్ట్రంలో టీచర్ల బదిలీలను త్వరలోనే చేస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. దీనిపై సంఘాల నుంచి అభిప్రాయాలు కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాకే బదిలీలపై మార్గదర్శకాలు ఇస్తామని చెప్నిట్టు సమాచారం. దివ్యాంగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కొన్ని సంఘాలు విజ్ఞప్తిచేసినట్టు తెలిసింది.

Ap intermediate exams results released

 ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదల...


https://examresults.ap.nic.in

www.bie.ap.gov.in

*🔹రికార్డ్ స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు ప్రకటన*


*🔹ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల*


*🔹ఫస్టియర్, సెంబర్ ఇయర్ కలిపి పరీక్షలు రాసిన 10 లక్షల మంది విద్యార్థులు*


*🔹ఫస్టీయర్‌లో 54 శాతం ఉత్తీర్ణత*


*🔹సెకండ్ ఇయర్‌లో 61 శాతం మంది పాస్*


*🔹ఫస్టీయర్ లో  బాలురు 49 శాతం ,  బాలికలు 60  శాతం పాస్*


*🔹సెకండర్ ఇయర్‌లో బాలికలు 68 శాతం పాస్*


*🔹ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయి*

ఏపీలో ఒక రోజు ఆల‌స్యంగా పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. కార‌ణ‌మేంటంటే?

జూలై 4న పునఃప్రారంభం కానున్న పాఠ‌శాల‌లు

అదే రోజున రాష్ట్ర పర్య‌ట‌న‌కు వ‌స్తున్న ప్ర‌ధాని మోదీ

మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని

ప్ర‌ధాని టూర్ నేప‌థ్యంలోనే ఒక రోజు ఆల‌స్యంగా పాఠ‌శాల‌ల పునఃప్రారంభం

ఏపీలో వేస‌వి సెల‌వుల త‌ర్వాత‌ పాఠ‌శాల‌లు జూలై 4న పునఃప్రారంభం కానున్న‌ట్లు గ‌తంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే జూలై 4న కాకుండా జూలై 5న పాఠ‌శాల‌ల‌ను పునఃప్రారంభించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వెర‌సి ముందుగా ప్ర‌క‌టించిన తేదీ కంటే ఒక రోజు ఆల‌స్యంగా ఏపీలో పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయ‌న్న మాట‌.

పాఠ‌శాల‌ల‌ను ఒక రోజు ఆల‌స్యంగా తెరిచేందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా ప్రభుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. జూలై 4న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌గిరి ప‌రిధిలో కొత్త‌గా నిర్మించిన ఎయిమ్స్‌ను ప్ర‌ధాని ప్రారంభించ‌నున్నారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలోనే పాఠ‌శాల‌ల పునఃప్రారంభాన్ని ఒక రోజు వాయిదా వేసిన‌ట్లుగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి

INDIAN POSTAL DEPARTMENT Shortlisted candidates for Document Verificaiton by the respective divisional head in connection with GDS Online Engagement Cycle IV - Andhra Pradesh Circle

 Results for Postal Jobs: పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో  ఆంధ్రప్రదేశ్‌-1716 మంది ఫలితాలు విడుదల.

The listed candidates should get their documents verified by the mentioned divisional head before 05.07.2022.

The candidate should go along with all the relevant original documents for verificaiton

Click Here To Download results

సచివాలయ ఉద్యోగులకు పాఠశాల యాప్ (స్కూల్ సుందర్ యాప్ కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్ అనే ఎస్ఓఎస్) బాధ్యత

పాఠశాలల్లో నిర్వహిస్తున్న యాప్లకు సంబంధించి సమాచారాన్ని మానిటరింగ్ చేసే బాధ్యతలను గ్రామ , వార్డ్ సచివా లయ సిబ్బందికి అప్పగిస్తూ గ్రామ , వార్డ్ సచివాలయ శాఖ ఆదేశాలిచ్చింది .

పాఠశాలల్లో వివిధ కార్యక్రమా లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం స్కూల్ సుందర్ యాప్ కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్ అనే ఎస్ఓఎస్ ను రూపొందించిందని , ప్రతివారం సచివాలయ సిబ్బంది పాఠశాలలను సందర్శించి డేటా సేకరించి పర్యవేక్షించాలని సచివాలయశాఖ ఇప్పటికే సూచించింది.

Ap polytechnic entrance exam result released

నేడు పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు

ఏపి పాలిసెట్ -2022 ఫలితాలను జూన్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ ఫలితాలను శనివారం ఉదయం 9.15 గంటలకు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విజయవాడలోని గేట్వే హోటల్లో విడుదల చేయనున్నారు.

ఈ ఫలితాలను విడుదల చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది . రిజిస్ట్రేషన్ వివరాలు , పుట్టిన తేదీన నమోదు చేసుకొని ఈ ఫలితాలను పొందవచ్చును.

ఫలితాల కోసం

http://sbtetap.gov.in/Screens/Mainhome.aspx


https://polycetap.nic.in/Default.aspx

G.O.No.117 పై ఈ రోజు సాయంత్రం 6.30గం.ల నుండి రాత్రి 9.20 గం.ల వరకు JD Services Sri.M.రామలింగం గారితో సుధీర్ఘ చర్చలు FAPTO జరిపినది. ముఖ్యాంశాలు.

1.LFL HM post Conversion తర్వాత మిగిలిన వారిని Descending Order లో 120 సంఖ్య కన్నా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు కూడా కేటాయిస్తారు.

2. హైస్కూల్ల లో ఈ ఒక్క ఉపాధ్యాయునికి (S.A.) 36 పీరియడ్ లకు మించి ఉండవని హామి.

3. As per G.O.117  Ratio PS,UPS,HS 1:30,,1:45 ,1:60, 

FAPTO demand 1:20,1:35,1:35.

4.6000 SGT లకు SA లుగా పదోన్నతి అవకాశం.(SGT upgradation)

5.3000మంది SA లకు PGT పదోన్నతి అవకాశం.

6.రేషనలైజేషన్ cut of date 05-05-2022 రోలు ఆధారం.

7. హైస్కూల్ల కు ప్రతి HM కు ఒక DTP operator cum clerk,

8.SA subject Conversion -  జిల్లాలో ఉన్న Surplus Teachers(any subject) ఆ జిల్లాలో ఉండే NEED ఆధారంగా as per Seniority అవకాశం.

9. ఏ ఒక్క స్కూలు మూత పడదు.

10.Reapportionment Data ఉపాధ్యాయ సంఘాల కు అందిస్తారు.

11.FAPTO ఆందోళన కొనసాగుతుందని, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తెలియజేయాలని చెప్పాం.వారు దాదాపు రెడు గంటలు చర్చించి FAPTO అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని హామి ఇచ్చారు.

School Education SCERT, AP – Training on VIII Class new textbooks (NCERT) from 27-06-2022 to 01-07-2022 in virtual mode Participation of teachers Certain instructions issued. 8Th Class

బోధిస్తున్న ఉపాధ్యాయులందరికి జూన్27th నుండి జులై1st వరకు Subjects వారీగా 8TH క్లాస్ New Text బుక్స్ మీద ఆన్లైన్ లో Virtual ట్రైనింగ్ కలదు, ట్రైనింగ్ షెడ్యూల్, ఉత్తర్వులు, SRP లిస్ట్ క్రింది సైట్ లో కలదు.

Proc.No.ESE02/187/2022SCERT Dated:16/06/2022

SSC BETTERMENT APPLY SCHOOL LOGIN LINK

 SSC బెటర్‌మెంట్ కు అప్లై చేయడం కోసం దరఖాస్తులను స్కూల్ లాగిన్  నందు పెట్టడం జరిగింది.

https://bse.ap.gov.in/SCHRESULTTWT/Account/Login.aspx

Instructions regarding SSC Betterment exams -2022

పదవ తరగతి లో 50 మార్కుల కంటే తక్కువ మార్కులు పొందిన ఏవైనా రెండు సబ్జెక్టుల్లో బెటర్మెంట్ పరీక్ష రాసు కోవడానికి అనుమతి.

ఈ సంవత్సరం పదవ తరగతి పాసయిన విద్యార్థులకు తెలియజేయు ముఖ్య విషయం ఏమనగా

 గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసంవత్సరం Department of school Education వారు పాసయిన విద్యార్థులకు BETTERMENT వ్రాసుకునే అవకాశం కల్పించారు.

Betterment కట్టడానికి నియమాలు:

1.50 మార్కులు కంటే తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టు మాత్రమే betterment వ్రాయడానికి అవుతుంది.

2.గరిష్టంగా రెండు సబ్జెక్టులు మాత్రమే Betterment వ్రాయడానికి అవుతుంది.

3.Bettterment కట్టడానికి ఒక్కొక్క సబ్జెక్టు కు ఫీజు 500 రూపాయలు

4.ఇంతకుముందే ప్రకటించిన supplementry exams తేదీల ప్రకారమే ఈ betterment exams కూడా జరుగుతాయి.

SSC Betterment Govt memoGEXM0DGE dt15.6.2022 ప్రకారము SSC Advance supplementary Exams లో Betterment కు అవకాశము ఇవ్వబడినది

50 మార్కుల కంటె తక్కువ వచ్చిన రెండు Subjects కు మాత్రమే Betterment అనుమతించబడును

ప్రతి సబ్జెక్టుకు రు 500 ల చొప్పున  Registration fee

Science  రెండు పేపర్లు కలిపి Betterment fee Rs 500

ఈ Betterment సౌలభ్యము కేవలం  కేవలం 2022 పరీక్షలకే

Fees  చెల్లింపు Challan & ఇతర వివరాలు కొద్దిసేపట్లో bse.ap.gov.in లో చూడగలరు

పాఠశాల HM ద్వారా online Fee &Registration

మొదటి సారి Betterment సౌలభ్యము

'ఆర్జీయూకేటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయలేదు'

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధి లోని 4 ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎలాంటి నోటిఫికేషన్ ను జారీ చేయలేదని బుధవారం ఓ ప్రకటనలో చాన్స్లర్ ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు.

ఆర్జీయూకేటీ పేరుతో సోషల్ మీడి యాల్లో సర్క్యులేట్ అవుతోన్న నకిలీ అడ్మిషన్ నోటిఫికేషన్లను పట్టించుకోవద్దని సూచించారు

వర్సిటీ నిర్ణీత సమయంలో అడ్మిషన్ నోటిఫికేషన్ ను జారీచేస్తుందని , ఆర్జీయూకేటీ వర్సిటీ వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలను అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు

పుట్టిన చిన్నారికి ఆటోమేటిగ్గా తాత్కాలిక ఆధార్..!

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్ ను ఒక వ్యక్తి పుట్టుక నుంచి, మరణం వరకు అన్నింటికీ అనుసంధానించే ప్రణాళికతో ఉంది. పుట్టిన వెంటనే శిశువుల పేరుతో ఆటోమేటిగ్గా తాత్కాలిక ఆధార్ జారీ అవుతుంది. వారు మేజర్లు అయిన తర్వాత వేలిముద్రలతో అప్ డేట్ చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు త్వరలోనే రెండు పైలట్ కార్యక్రమాలను ఆరంభించనుంది. ఈ వివరాలను యూఐడీఏఐకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

2010లో ఆధార్ ఆవిష్కరించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా పెద్దలు అందరికీ ఆధార్ జారీ అయింది. ఇక మీదట జన్మించిన దగ్గర్నుంచి, మరణించే వరకు వ్యక్తులకు సంబంధించి అన్ని ముఖ్యమైన వాటికి ఆధార్ ను తప్పనిసరి చేసే యోచనతో యూఐడీఏఐ ఉంది. మరణ రికార్డులతోనూ ఆధార్ డేటాను అనుసంధానించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందే విషయంలో దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది ఉద్దేశ్యం. 

"పిల్లలకు కనీసం ఐదేళ్లు ఉంటేనే వేలిముద్రలు తీసుకుంటారు. ఐదేళ్లు నిండిన పిల్లల ఇంటికి మా బృందాలే వెళ్లి వేలిముద్రలు తీసుకుని శాశ్వత ఆధార్ నంబర్ జారీ చేస్తాయి. 18 ఏళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్స్ మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలి’’ అని ఓ అధికారి తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించి మరణించిన వారి వివరాలు వెంటనే ఆధార్ డేటా బేస్ లోకి చేరేలా యూఐడీఏఐ చర్యలు తీసుకోనుంది. ‘‘ఇటీవల మరణించిన వారి ఆధార్ యాక్టివ్ గా ఉండడంతో వారి పేరిట పెన్షన్ ను ఇంకా ఉపసంహరించకుండా ఆటోమేటిగ్గా జమ అవుతోంది’’ అని సదరు అధికారి తెలిపారు. అలాగే, ఒకే వ్యక్తికి ఒక ఆధార్ మాత్రమే ఉండేలా యూఐడీఏఐ చర్యలు తీసుకోనుంది.

Update DIKSHA Android App Latest Version: (4.9.1004.119)

దీక్షా యాప్ ను వెర్షన్ 4.9.1004.119 కు అప్డేట్ చేయడం జరిగింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి యాప్ ను ఇన్స్టాల్ చేసుకోగలరు.

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_app

Download JAGANANNA VIDHYA KANUKA JVK APP Latest Version 1.1.6 for all

 జగనన్న విద్యాకనుక అప్లికేషన్ ను ఈరోజు (14.6.2022) న లేటెస్ట్ వెర్షన్ 1.1.6 కి అప్డేట్ చేయడం జరిగింది.

MEOs, Complex HMs మరియు అన్ని పాఠశాలల వారు ఈ అప్డేటెడ్ వెర్షన్ ని Instal చేసుకోవలసి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు.

Download JAGANANNA VIDHYA KANUKA JVK APP Latest Version 1.1.6

DAPPSC epartmental Test haltickets download link

APPSC డిపార్ట్మెంటల్ పరీక్షల హాల్ టికెట్ లను విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ ద్వారా మీ హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

https://psc.ap.gov.in/(S(ervjqfl140nxvnrbw10dcpmh))/UI/CandidateLoginPages/LoginNew.aspx


Rc.No.ESE02-13/90/2021-EST 3-CSE-Part(7) Date:13/06/2022 School Education – Mapping of Primary and Upper primary schools with High schools, 2020 - Norms for re-apportionment of teaching staff under various managements viz., Government, Zilla Parishad/ Mandal Praja Parishad Schools – instructions

G.O.Ms.No. 117 ప్రకారం ఉపాధ్యాయుల రేషనలైజేషన్ -2022 మార్గదర్శకాలతో తాజాగా ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్

రేషనలైజేషన్ నిబంధనలు తాజా ఉత్తర్వులు.

నం.ESE02-13/90/2021-EST 3-CSE-పార్ట్(7)

తేదీ: 13/06/2022

Click Here To Download 

 స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ కమీషనర్ ప్రొసీడింగ్స్ :: అమరావతి ప్రెజెంట్ శ్రీ S సురేష్ కుమార్, I.A.S.,

 స్కూల్ ఎడ్యుకేషన్ - హైస్కూల్స్‌తో కూడిన ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మ్యాపింగ్, 2020 - ప్రభుత్వం, జిల్లా పరిషత్/మండల్ ప్రజా పరిషత్ పాఠశాలలు వివిధ మేనేజ్‌మెంట్‌ల క్రింద బోధనా సిబ్బందిని పునర్విభజన కోసం నిబంధనలు - సూచనలు - జారీ చేయబడ్డాయి. G.O.Ms.No.117, పాఠశాల విద్యాశాఖ (Ser.II)

  రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రభుత్వం, జిల్లా పరిషత్/ సిబ్బంది జారీ చేసిన మార్గదర్శకాల పునర్విభజనకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వానికి సూచించడం జరిగింది.

 ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు దశల్లో మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. 

 తొలి దశ:I : అవసరం / లోటు / మిగులు పోస్టులను గుర్తించడం:

 1. సబ్జెక్ట్ టీచర్లను అందించడానికి ప్రాథమిక పాఠశాలల 3,4,5 తరగతులు మరియు ప్రీ-హై స్కూల్‌ల 6,7,8 తరగతులు మ్యాప్ చేయబడిన ఉన్నత పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

 గమనిక: 

53 మంది నమోదు తర్వాత 6 నుండి 8 తరగతులకు అదనపు విభాగం కేటాయించబడుతుంది.  

60 మంది నమోదు తర్వాత 9వ & 10వ తరగతులకు అదనపు విభాగం కేటాయించబడుతుంది.

 II. 195 మంది నమోదు చేసుకున్న ప్రీ-హైస్కూళ్లను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి మరియు అప్‌గ్రేడ్ చేసిన ఈ హైస్కూళ్లకు సబ్జెక్ట్ టీచర్లను కేటాయించడానికి ప్రతిపాదనలు అందించడం.

III. 98 మంది నమోదు చేసుకున్న ప్రీ-హై స్కూల్‌లకు సబ్జెక్ట్ టీచర్లను కేటాయించడం.

 IV. ప్రీ-హై స్కూల్స్‌లో నమోదు 98 కంటే ఎక్కువగా ఉంటే G.O ప్రకారం SGT పోస్టులు కేటాయించబడతాయి.

 SGT/తత్సమాన కేడర్‌కు వ్యతిరేకంగా DEO పూల్‌లో పనిచేస్తున్న వారు

V. LPలు 98 కంటే తక్కువ బలం ఉన్న నిరుపేద ప్రీ-హైస్కూల్‌కు కేటాయించబడాలి.

 గమనిక: DEO పూల్‌లో పనిచేస్తున్న LPలు/తత్సమానమైన కేడర్‌ల కోసం పోస్ట్ కేటగిరీ పేర్లను మార్చడానికి దిగువ సంతకం చేసిన వారికి పంపాలి, అంటే SGT పోస్ట్ LPగా మార్చబడుతుంది .

 ఉదాహరణ: పాఠశాలలో 98 కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే నిబంధనల ప్రకారం 4 SGT పోస్టులు అవసరం, వీటిలో ఒక పోస్టులో పనిచేస్తున్న తెలుగు & హిందీ భాషా పండిట్ ఉపాధ్యాయుల పోస్టులు ఫౌండేషన్ పాఠశాలలకు కేటాయించిన SGTల మేరకు కేటాయించబడతాయి.

 VI. G.O. VII ప్రకారం G.O. పాఠశాలల ప్రకారం. వీరికి SGTలను కేటాయించడం

 దశ II: కేటాయింపు (మార్పిడి / అప్‌గ్రేడేషన్ ):

 1. మిగులు సబ్జెక్ట్ పోస్టులను గుర్తించడం మరియు నిర్దిష్ట కేటగిరీ పోస్ట్‌లోని మిగులు మేరకు మరొక సబ్జెక్టు కోసం మారడానికి సిద్ధంగా ఉన్న అర్హతగల సబ్జెక్ట్ ఉపాధ్యాయుల నుండి సుముఖత పొందడం.

 ఉదాహరణ: SA(PS) యొక్క 50 పోస్ట్‌లలో మిగులు కనుగొనబడింది మరియు SA(Maths) యొక్క 40 పోస్ట్‌లు అవసరమైతే. అప్పుడు, పేర్కొన్న కేటగిరీ SA(PS)లో అర్హత మరియు సీనియారిటీకి లోబడి మాత్రమే 40 పోస్టుల మేరకు మార్పిడిని అనుమతించాలి.

 II. దీని ప్రకారం, మిగిలిన సబ్జెక్టులలో మార్పిడి ప్రక్రియ తీసుకోబడుతుంది>

నిబంధనల ప్రకారం LFL ప్రధానోపాధ్యాయులతో సహా.  

III. సబ్జెక్టు మార్పిడికి సిద్ధపడితే సీనియారిటీకి రక్షణ ఉంటుంది.

 దశ:III: ఉన్నత పాఠశాలలు, అప్‌గ్రేడ్ చేసిన ఉన్నత పాఠశాలలు & ప్రీ-హై స్కూల్‌లలోని పోస్ట్‌ల వర్గాన్ని గుర్తించండి:

 1. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, సబ్జెక్ట్ టీచర్లు ఇంకా అవసరమైతే, మిగులు సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయవచ్చు.

 II. రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులందరూ పై సూచనలను ఎలాంటి విచక్షణతో ఖచ్చితంగా పాటించాలని మరియు ఈ కార్యాలయానికి దిగువన అనుబంధంగా ఉన్న అనుబంధంలో కన్వర్షన్/అప్-గ్రేడేషన్ కోసం పోస్టుల వివరాలను అందించాలని ఆదేశించడం జరిగింది.

 మిగులు ఉపాధ్యాయుల అవరోహణ క్రమంలో III కావచ్చు. ఉన్నత పాఠశాలలు అప్‌గ్రేడ్ చేయబడిన పాఠశాలలు & ప్రీ-హై స్కూల్‌లకు కేటాయించబడిన పై ఎక్సర్సైజ్ పూర్తయిన తర్వాత కాబట్టి, పైన పేర్కొన్న ప్రభుత్వ ఉత్తర్వులు మరియు మార్గదర్శకాల ప్రకారం పునర్విభజన ప్రక్రియను చేపట్టి, పాఠశాల వారీగా జాబితాతో పాటు 16.06.2022 లోపు లేదా ఆ పనిని పూర్తి చేయాలని రాష్ట్రంలోని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖాధికారులకు సూచించబడింది. కన్వర్షన్ పోస్టులు మరియు పాఠశాలల్లో అప్‌గ్రేడ్ చేయాల్సిన సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితా కింద సంతకం చేసిన వారికి అమలులో తేడా ఉంటే క్రమశిక్షణ తీవ్రంగా పరిగణించబడుతుంది. APCS(CCA)రూల్స్, 1991 ప్రకారం. చర్యలుంటాయి.

మండలానికొకటి!బాలికల జూనియర్‌ కళాశాల మంజూరు..ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు.ఉన్నత పాఠశాలల్లోనే గదుల కేటాయింపు

విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు

ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగు తోంది. బాలికల కోసం ప్రత్యేకంగా మండలానికో జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు తుది దశకు చేరుకున్నాయి. జిల్లాలో 25 మండలాలుండగా, అన్నింటిలో జూని యర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపారు. కేజీబీవీలు ఉన్న మండలాలను మినహాయించి మిగిలిన అన్నింటిలో కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది. మన జిల్లాలో కేజీబీవీలు లేవు. మచిలీపట్నంలో లేడియాంప్తిల్‌ జూనియర్‌ కళాశాల ఉంది. దీనికి అనుబంధంగా 15 కిలోమీటర్ల దూరంలోని తాళ్ల పాలెంలో బాలికల కోసం జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు.

పరిశీలన  బాధ్యతలు డీవైఈవోలకు.

జూనియర్‌ కళాశాల ఏర్పాటు కోసం ఆయా ఉన్నత పాఠశా లల్లోని సౌకర్యాలను పరిశీ లించే బాధ్యతలను డీవైఈవోలకు అప్పగించారు. మచిలీపట్నం డీవైఈవో, గుడివాడ డివిజన్‌కు సంబంధించి అంగలూరు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో 200, అంతకుమించి విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కళాశాలలను బాలికల కోసం ఏర్పాటు చేయనున్నారు.  కళాశాలలు ఏర్పాటుచేసే ఉన్నత పాఠశాలల్లో తరగతుల నిర్వహణ కోసం రెండు గదులు, ల్యాబ్‌ నిర్వహణ కోసం మరో రెండు గదులు, స్టాఫ్‌రూమ్‌లు అందుబాటులో ఉన్నదీ, లేనిదీ డీవైఈవోలు పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఏదైనా మండలంలో ఎయిడెడ్‌ సంస్థలకు చెందిన జూనియర్‌ కళాశాలలున్నా పరిగణనలోకి తీసుకోరు. అక్కడ కూడా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన బాలికలను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయబోయే జూనియర్‌ కళాశాలల్లోనే చేర్చే కార్యక్రమంలో భాగంగా టీసీలు ఇవ్వొద్దన్న ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయని జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు తెలిపారు. 

టీచర్లకు పదోన్నతులు..లెక్చరర్లుగా నియామకం

మండలానికో బాలికల జూనియర్‌ కళాశాలను ఏర్పాటుచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఉన్న అర్హతలను బట్టి లెక్చరర్లుగా నియమించనున్నారు. కాగా, ఈ విద్యా సంవత్సరం నుంచే బాలికల జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు.

AP residential schools 5th Class entrance lattery results 2022-23 released

APRS 2022-23

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 5 వ తరగతి (EM) ప్రవేశం  (లాటరీ పద్ధతిన) ఫలితాలు విడుదల

Candidate ID మరియు Date of Birth ఉపయోగించి తెలుసుకోవచ్చు

Download Results

https://aprs.apcfss.in/APRSFifthResult.do

School Education – National Education Policy, 2020 - Norms for reapportionment of teaching staff under various managements viz., Government, Zilla Parishad/ Mandal Praja Parishad Schools – Orders

 ఉపాధ్యాయుల  రేషనలైజేషన్ NEP 2020 ప్రకారం (reapportionment of teaching staff) జి.ఒ  117 విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి.

CLICK HERE TO DOWNLOAD GO 117

NEP 2022 స్టాఫ్ పాటర్న్

(G.O.Ms.No.117కి, పాఠశాల విద్య (Ser.II) విభాగం, ఎస్ జి టి ఎఫ్ Dt.10.06.2022)

టీచింగ్ స్టాఫ్ యొక్క పునర్విభజన కోసం నిబంధనలు

I.(ఎ) ఫౌండేషన్ పాఠశాలలు

(PP1, PP2, 1వ మరియు 2వ తరగతులు): 1. RTE చట్టం, 2009 ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి (TPR) 1:30 ఉండాలి

ప్రాథమిక స్థాయిలో

2. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసీ (FLN)ని నిర్ధారించడం కోసం

1 & 2 తరగతుల విద్యార్థులు, TPR 1:30కి ఉండాలి.

3. 1 & 2 తరగతులకు 30 నమోదు వరకు ఒక SGT అందించబడుతుంది.

4. 1 & 2 తరగతుల 31 నమోదుల నుండి రెండవ SGT ఇవ్వబడుతుంది.

5. ప్రతి 30 అదనపు నమోదులకు, మరొక SGT అందించబడుతుంది. 6. ఫౌండేషన్ పాఠశాలలో (క్లాస్ 1 మరియు 2) నమోదు 10 కంటే తక్కువ ఉంటే, అప్పుడు ప్రతిపాదనను పాఠశాల కమిషనర్‌కు సమర్పించవచ్చు.

7. పాఠశాలల పునర్నిర్మాణం / మ్యాపింగ్ కారణంగా ఏ పాఠశాల కూడా మూసివేయబడలేదని నిర్ధారించుకోవాలి.

(బి) ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు

(PP1, PP2, 1-5 తరగతులు): 1. ప్రతి 30 మంది నమోదుకు ఒక SGT అందించబడుతుంది.

2. రెండవ SGT తరగతుల 31 నమోదుల నుండి ఇవ్వబడుతుంది. 3. ప్రతి 30 మంది అదనపు నమోదుకు, మరొక SGT అందించబడుతుంది.

4. 121 నమోదు తర్వాత, ఒక ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్ట్ కేటాయించబడుతుంది.

5. ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో (1వ తరగతి నుండి 5వ తరగతి వరకు) నమోదు 10 కంటే తక్కువ ఉంటే, పాఠశాల విద్య, అటువంటి సందర్భాలలో ఏదైనా తదుపరి చర్య కోసం AP పాటశాల విద్య కమిష నర్ కు సమర్పించ వచ్చు.

Ap Tenth class exams Marks memos Released

వెబ్‌సైటులో టెన్త్ మార్క్స్ మెమోలు ను అందుబాటులో ఉంచడం జరిగింది. https://bse.ap.gov.in/RESULTSTWT/

AP TET (Teacher Elegible Test) detailed notification and information bulliten

 AP TET  (AUG ) – 2022 కు సంబంధించిన నోటిఫికేషన్ ది. 10.06 .2022 న విడుదల చేయబడును .TET ఆన్ లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా నోటిఫికేషన్ , ఇన్ఫర్మేషన్ బులెటిన్ ,సిలబస్ ,పరీక్షల తేదీలు , పరీక్ష రుసుము , ఆన్ లైన్ పరీక్ష సూచనలు అన్నియు AP TET website http://aptet.apcfss.in/ నందు అందుబాటులో ఉంచబడును,అభ్యర్ధులు సమాచారమును ది  10.06 .2022 ఉదయం 10.30 నిమిషాల నుంచి పై వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోగలరు.

AP TET 2022 NOTIFICATION RELEASED

Link for official website https://aptet.apcfss.in/

  https://aptet.apcfss.in/Documents/aptet_syllabus_2021.pdf

Link to download Syllabus 

https://aptet.apcfss.in/Documents/aptet_2022_information_bulletin.pdf 

Link to download information bulletin 

https://aptet.apcfss.in/Documents/aptet_2022_schedule.pdf

Link to download schedule

 https://aptet.apcfss.in/Documents/aptet_2022_notification.pdf

Link to download official notification

AP TET (Teacher Elegible Test)

👉ఆగస్టు 6 నుంచి 21 వరకు TET పరీక్షలు

👉June 16 నుంచి Online Application's Start

👉 Tomorrow TET Notification Release చేయనున్నారు

👉10,000 పోస్టుల భర్తీకి ఛాన్స్

Mpl Teachers Transfers info:

 మున్సిపల్ ఉపాధ్యాయులు ట్రాన్స్ ఫర్ షెడ్యూల్ విడుదల చేసిన కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ ప్రవీణ్ కుమార్.

► G.O No 116 ప్రకారమే మున్సిపల్ టీచర్లబదిలీల షెడ్యూల్ విడుదల? 


► Zero సర్వీసు, Maximum 5 years.


► G.O 116. లోని నిబంధనలే.


► రేషన్లైజేషన్ కసరత్తు jun 9 to 10


► Vacancies and seniority lists: jun 11 to 12


► Online దరఖాస్తులు: jun 13 to 14


► Scrutiny: jun 15


► Councling & Orders : Jun16 to17

Click Here To Download proceedings 

Rc.No. ESE02-13028/9/2021-EST 3-CSE date:08/06/2022 School Education – Updation of details of SGTs/ School Assistants and equivalent cadres working in the state in Teacher Information System

బదిలీలు పదోన్నతుల కొరకు టీచర్ లు తమ వివరాలు రేపటిలోగా TIS నందు తమ Treasury ID తో లాగిన్ అయి UPDATE చెయ్యమని , HM మరియు DDO లు 13 లోగా వివరాలు కంఫర్మ్ చెయ్యమని ఆదేశాలు విడుదల

SSC Advanced Supplementary Examinations , July - 2022 Conduct Special Coaching Classes for the students who are appearing for the SSC Advanced Supplementary Examinations . July - 2022 - Orders - Issued

SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, జూలై-2022 రాస్తున్న విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించాలని కమీషనర్ ఉత్తర్వులు.

Rc.No: GE-EXAMOSSC(INST)/8/2022-DGE

SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నారు. జూలై-2022-ఆర్డర్లు జారీ చేయబడ్డాయి - రెగ్. సూచన:- 1. 0/0 DGE SSC పబ్లిక్ పరీక్షలు, ఏప్రిల్/మే-2022ఫలితాలు ప్రెస్ నోట్ Rc.No.30/J-1/2022, తేదీ:06-06-2022.

SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఏప్రిల్/మే-2022 06-06-2022న విడుదలయ్యాయి మరియు పరీక్షలకు హాజరైన 6.15,908 మంది విద్యార్థులలో 2,01,627 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. SSC పబ్లిక్ పరీక్షల విశ్లేషణ, ఏప్రిల్/మే-2022 ఫలితాల విశ్లేషణ తర్వాత, గత రెండేళ్లలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి కారణంగా చాలా మంది విద్యార్థులు నేర్చుకోలేకపోయిన కారణంగా పరీక్షలో విఫలమయ్యారని కనుగొనబడింది.

పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, జూలై 2022లో షెడ్యూల్ చేయబడిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలో విఫలమైన విద్యార్థులందరినీ మేము ప్రోత్సహించాలి. ప్రత్యేక కోచింగ్ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అన్ని RJDSES మరియు జిల్లా విద్యా అధికారులను ఇందుమూలంగా ఆదేశించడం జరిగింది. ఏప్రిల్/మే-2022, SSC పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అన్ని ఉన్నత పాఠశాలల్లో (పరిహార తరగతులు). 13-06-2022 నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, జూలై-2022 పూర్తయ్యే వరకు రోజుకు కనీసం "2" సబ్జెక్టుల కోసం రెమెడియల్ కోచింగ్‌ను ప్లాన్ చేయండి. విద్యార్థులకు సబ్జెక్ట్/టాపిక్ స్పెసిఫిక్ కోచింగ్ ఇవ్వాలి మరియు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో బాగా రాణించేందుకు వారిని సిద్ధం చేయాలి. సబ్జెక్ట్‌లను రివైజ్ చేయడానికి అందుబాటులో ఉన్న టోమ్‌ను ఉపయోగించమని మరియు సప్లిమెంటరీ పరీక్షలను కాన్ఫ్లోడెన్స్‌తో రాయడానికి విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం మరియు సలహా ఇవ్వాలి. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కోచింగ్‌ తరగతులను ఏర్పాటు చేశారు.

జిల్లా విద్యాశాఖ అధికారులు తదనుగుణంగా అవసరమైన సూచనలను జారీ చేయాలి మరియు రెమిడియల్ తరగతులు అవసరమైన అన్ని ఉన్నత పాఠశాలల్లో తగినంత మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు డ్రాఫ్ట్ చేయబడి ఉండేలా చూసుకోవాలి. పాఠశాల వారీగా ప్రణాళికతో పాటు టైమ్ టేబుల్ మరియు దాని కోసం రూపొందించిన ఉపాధ్యాయుల జాబితాను రూపొందించి, 12.06.22 నాటికి DGEకి తెలియజేయాలి.

School Education – Establishment – Human Resources – Transfer and postings of Employees – Guidelines/Instructions

స్కూల్ ఎడ్యుకేషన్ లో బదిలీల కు గ్రీన్ సిగ్నల్. జనరల్ ట్రాన్స్ఫెర్స్ జి.ఒ 116 ను అన్ని డి.యి.ఒ లకు కమ్మునికేట్ చేసిన CSE



Individual Pay slip download by login Payroll.herb using CFMS ID and password

DDO గారి లాగిన్ లేకుండా  మన పే స్లీప్ మనమే సొంతం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం STEP BY STEP ప్రోసెస్ వివరించడం జరిగింది.

గతం లో ఎలాగైతే మనకు cfms లో ఇండివిడ్యుల్ లాగి న్ ఉండేదో ఇప్పుడు మనకి పే రోల్ లో కూడా ఇండివిడ్యుల్ లోగిన అవకాశం ఇచ్చారు.

ముందుగా

 https://payroll.herb.apcfss.in 

సైట్ ఓపెన్ చేయాలి..

తరువాత

మన cfms id తో లాగిన్ అవ్వాలి . User Name CFMS ID,  పాస్వర్డ్ defult గా అందరికి cfss@123 గా ఇచ్చారు.

లాగిన్ అయిన తరువాత కింద చూపబడిన లింక్ ను క్లిక్ చేయండి.

https://payroll.herb.apcfss.in/jddetailsReport

తరువాత, హోమ్ పేజ్ లో మనకి కావాల్సిన మంత్ అండ్ ఇయర్ cfms ID సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మన వివరాలు వస్తాయి. పక్కన పెన్ సింబల్ పై క్లిక్ చేస్తే పే స్లిప్ PDF లో  డౌన్లోడ్ అవుతుంది.

ఏపీ పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందంటే... సజ్జల గారు చెప్పిన కారణాలు ఇవిగో!

ఏపీలో పదో తరగతి ఫలితాలు వెలువడగా, రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవడం ప్రభుత్వ వైఫల్యమేనంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టెన్త్ క్లాస్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకున్నామని, ఉత్తీర్ణత శాతం తగ్గడానికి అది కూడా ఓ కారణం అయ్యుంటుందని అన్నారు. పరీక్షలు పారదర్శకంగా జరిపామా? లేదా? అన్నది తమకు ముఖ్యమని పేర్కొన్నారు.  

అంతేకాకుండా, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం కూడా ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపి ఉంటుందని సజ్జల అభిప్రాయపడ్డారు. ఆంగ్ల మాధ్యమం తొలిసారి ప్రవేశపెట్టినందున కొన్ని ఇబ్బందులు సహజమేనని, అందువల్ల కూడా ఉత్తీర్ణత శాతం తగ్గి ఉంటుందని వివరించారు. 

కరోనా సంక్షోభం వల్ల గత రెండేళ్లుగా విద్యాసంస్థలు సరిగా నడవలేదని, విద్యార్థుల్లో పోటీతత్వం తగ్గి ఉంటుందని తాము భావిస్తున్నామని వివరించారు. 

విమర్శలను తాము పట్టించుకోబోమని సజ్జల స్పష్టం చేశారు. గతంలో 90 శాతం మంది పాస్ అయితే, అంతమంది ఎలా పాస్ అయ్యారంటూ విమర్శించేవారని, ఆ విధంగా విమర్శలు చేసిన వారు ఇప్పుడు మాట్లాడాలని అన్నారు

Transfers and Postings of Employees – Guidelines/Instructions - Orders – Issued.FINANCE (HR.I-PLG. & POLICY) DEPARTMENT G.O.Ms.No.116 Dated:07-06-2022

ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు.

 General Transfers G.O 116 info:

► జూన్ 7నుండి17 వరకు Employees బదిలీలపై బ్యాన్ ఎత్తివేత మరియు బదిలీలకు మార్గదర్శకాలు విడుదల

► Request మరియు Administratie Ground బదిలీలు

► ఒకే station లో అన్నికేడర్ల లో కలిపి 5 ఏళ్ళ సర్వీసు నిండిన వారికి Compulsory బదిలీ.

► 40% Ph ,Mentally challenged children ఉన్నవారికి, Dread ful diseases ఉన్నవారికి/Spouse/Dependents /Parents ,Compassionate Grounds పై నియమించబడిన widows, one of Spouse Employees కు ప్రాధాన్యత ఇవ్వబడును.

► క్రొత్త జిల్లాలకు Order to serve పై నియమించబడిన వారికి ప్రస్తుత బదిలీల నుండి మినహాయింపు ఇవ్వబడినది.

► Higher education "Medical &Health ,APVVS వారికీ బదిలీల నుండి మినహాయింపు ఇవ్వబడినది.

► Place s opt చేసుకొంటారు కనుక ఈ బదిలీలు Request Transfer లాగొ పరిగణించి TTA ఇవ్వ బడదు.

► Visually Handicapped వారికి కూడా కోరుకుంటే తప్ప బదిలీల నుండి మినహాయింపు ఇవ్వబడినది.

► Recognised union Office Bearers కు బదిలీలలో  ఇచ్చే మినహాయింపు సంప్రదాయము కొనసాగింపు.

Ap 10th Class re counting and re verification instructions

SSC రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్‌పై సూచనలు:

ఎ. "రీకౌంటింగ్" కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి సబ్జెక్టుకు రూ. 500 / - CFMS సిటిజన్ చలాన్ (www.cfms.ap.gov.in) ద్వారా 20-06-2022 లోపు చెల్లించాలి. 

బి .  "రివెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ది ఆన్సర్ స్క్రిప్ట్‌ల ఫోటోకాపీ" కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 20-06-2022 న లేదా అంతకు ముందు CFMS (www.cfms.ap.gov.in) ద్వారా ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 సిటిజన్ చలాన్‌ను చెల్లించాలి.  

 సి .  ఒక నిర్దిష్ట సబ్జెక్ట్ యొక్క "రివెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్" కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆ సబ్జెక్ట్ యొక్క "రీకౌంటింగ్" కోసం మాత్రమే దరఖాస్తు చేయనవసరం లేదు.  

డి .  నగదు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు వంటి మరే ఇతర మోడ్‌లో చేసిన చెల్లింపులు ఆమోదించబడవు.  CFMS సిటిజన్ చలాన్‌లు మాత్రమే ఆమోదించబడతాయి. 

ప్రతి అభ్యర్థికి ప్రత్యేక చలాన్ తీసుకోబడుతుంది. 

 ఇ .  CFMS చలాన్ ద్వారా అవసరమైన రుసుమును చెల్లించిన అభ్యర్థులు ఈ క్రింది పత్రాలను పూర్వపు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఉన్న జిల్లా విద్యా అధికారి యొక్క సంబంధిత జిల్లా కార్యాలయంలో సమర్పించాలి 

 1. www.bse.ap.gov.in  లో అందుబాటులో ఉండే ఫారమ్.  దరఖాస్తు ఫారమ్ సంబంధిత పూర్వ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోని O / o DEO లోని కౌంటర్లలో కూడా అందుబాటులో ఉంది.  

ii  సంబంధిత HM ద్వారా తగిన విధంగా కౌంటర్ సంతకం చేయబడిన హాల్ టిక్కెట్ ఫోటోకాపీ.  

iii  అభ్యర్థి పేరుపై పొందిన అవసరమైన మొత్తానికి CFMS సిటిజన్ చలాన్.  

ఎఫ్ .  పైన పేర్కొన్న పత్రాలతో పాటు పూరించిన దరఖాస్తు ఫారమ్‌లు పూర్వపు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని O / o DEO లలో మాత్రమే నియమించబడిన కౌంటర్లలో ఆమోదించబడతాయి.  & O/o DGE, A.P (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, A.P.)కి పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించబడవు. 

 h  మార్కులు మరియు మొత్తం మారిన సందర్భాల్లో మాత్రమే సవరించిన మెమోరాండం ఆఫ్

 మార్కులు జారీ చేయబడతాయి.

 Reverification యొక్క నిబంధన కింది వాటిని కలిగి ఉంటుంది:

 i .  ఇచ్చిన మార్కులను తిరిగి లెక్కించడం. 

 ii  వ్రాసిన సమాధానాలన్నింటికీ మార్కులు ఇవ్వబడ్డాయా లేదా అని ధృవీకరించడం. 

 iii  ముందుగా మార్కులు ఇవ్వని వ్రాతపూర్వక సమాధానాల మూల్యాంకనం. 

 iv  "పునః-ధృవీకరణ" అనేది "పునః దిద్దుబాటు"ని సూచించదు మరియు జవాబు స్క్రిప్ట్‌లు లేదా నిర్దిష్ట సమాధానాల పునః దిద్దుబాటుకు సంబంధించిన అప్పీల్‌లు పరిగణించబడవు.  

సంబంధిత HM లాగిన్‌లో ఫలితాలు ప్రకటించిన రెండు (2) రోజుల తర్వాత సబ్జెక్ట్ వారీగా మార్కుల మెమోరాండం www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో  ఉంచబడుతుంది.  

హెడ్ ​​మాస్టర్ సంబంధిత స్కూల్ లాగిన్ నుండి స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం మరియు వ్యక్తిగత చిన్న మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

వ్యక్తిగతంగా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.results.bse.ap.gov.in నుండి నేరుగా మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

మైగ్రేషన్ సర్టిఫికేట్: పరీక్ష దరఖాస్తు మరియు ఫీజులను సమర్పించే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.govలో హోస్ట్ చేయబడే డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్‌ను పొందేందుకు సంబంధిత HMని సంప్రదించవచ్చు. 

హెడ్ ​​మాస్టర్ డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్‌ను కలర్ PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ సబ్జెక్ట్ వారీగా మార్క్స్ మెమోరాండమ్‌తో పాటు దానిని తప్పకుండా అందజేస్తారు.  

సబ్జెక్ట్ వారీగా మార్కులతో కూడిన ఒరిజినల్ SSC పాస్ సర్టిఫికెట్లు నిర్ణీత సమయంలో అన్ని పాఠశాలలకు పంపబడతాయి. 

సంబంధిత HM సర్టిఫికేట్‌పై వారి సంతకాన్ని సరిగ్గా అతికించడం ద్వారా విద్యార్థికి అసలు SSC సర్టిఫికేట్‌ను అందజేస్తారు.

Director of government examinations, Andhra Pradesh, Amaravathi Press note SSC public examinations, April -2022

పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స.వచ్చేనెల 6 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత

పదవ తరగతి ఫలితాల పూర్తి ప్రెస్ నోట్  వివరాలు

పదో తరగతిలో 4.14 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత

పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఫలితాల్లో ప్రకాశం ప్రథమ స్థానం, అనంతపురం ఆఖరిస్థానం

ఫలితాల్లో 78.3 శాతంతో ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా

ఫలితాల్లో 49.7 శాతంతో ఆఖరిస్థానంలో అనంతపురం జిల్లా

Click Here To Download press note


AP 10th Class Examinations results Released

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. 

పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ రోజు ఉదయం   12 గంటలకు  విడుదల  చేయడం జరిగింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ తో ఫలితాలను చూసుకోవచ్చు .

క్రింది లింక్ ఓపెన్ చెయ్యండి

http://www.manabadi.info/2022/Andhra-Pradesh-10th-Class-Exam-AP-SSC-Results-2022-03062022.htm


https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2022.html

www.results.bse.ap.gov.in

Click Here To Download Results


For 10th Results

నేడు మ.12 గంటలకు పది ఫలితాలు

https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2022.html


 http://results.eenadu.net/tenth-results-2022/ap-10th-ssc-results-2022.aspx


 https://www.bse.ap.gov.in/


https://www.examresults.net/ap-board-result/ssc/

http://www.manabadi.co.in/boards/ap-ssc-results-andhra-pradesh-10th-class-results-ssc-results.asp

http://www.schools9.com/Articles/andhra-pradesh-ssc-class-10th-results-ap-ssc-10-result.aspx#

📽️ *పదో తరగతి పరీక్షా ఫలితాలు 11గం.లకు విడుదల చేయడం జరుగుతుంది. ఫలితాలను ఏవిధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలో వీడియోలో వివరించడం జరిగింది*👇

https://youtu.be/5_gwUmQCoWg

Please subscribe 

❖ 2022 విద్యార్థులు ఫలితాల కోసం సైట్‌లో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. 

❖ షార్ట్‌ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది.

❖ ఫలితాలను www.bse.ap.gov.in ద్వారా పొందొచ్చు.

It is hereby informed that the Individual results & School-wise results of the Candidates who have appeared for the SSC Public Examinations, April-2022 will be released by Sri. Botsa Satyanarayana Garu, Hon'ble Minister for Education, Government of Andhra Pradesh and officials on 06-06-2022(Monday) at 12:00 Noon

రేపు మధ్యాహ్నం 12 గంటలకు 10th పరీక్షా ఫలితాలు.. అధికారిక ప్రకటన విడుదల

ఏప్రిల్-2022, SSC పబ్లిక్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల వ్యక్తిగత ఫలితాలు & పాఠశాలల వారీ ఫలితాలను శ్రీ బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని ఇందుమూలంగా తెలియజేయబడింది.

It is hereby informed that the Individual results & School-wise results of the Candidates who have appeared for the SSC Public Examinations, April-2022 will be released by Sri. Botsa Satyanarayana Garu, Hon'ble Minister for Education, Government of Andhra Pradesh and officials on 06-06-2022(Monday) at 12:00 Noon at Gateway Hotel (Vivanta), MG Road, www.aptfvizag.com Vijayawada

Consequent on the release of results, the students can check their individual results from the official website www.results.bse.ap.gov.in

Teacher Information system TIS Pending or completed

మీ treasury ID ఎంటర్ చేసి మీ యొక్క TIS డేటా సబ్మిట్ అయ్యిందో లేదా ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.

https://ebadi.in/tis-pending-list/

2022 - 23 విద్యా సంవత్సరం నుండి పాఠశాలలో అమలు చేయవలసిన ముఖ్య అంశాలు

ప్రతి ఉపాధ్యాయుడు లెసన్ ప్లాన్, డైరి తప్పనిసరిగా     వ్రాయాలి. 

👉లెసన్ ప్లాన్ వ్రాసే  సందర్భంలో లెర్నింగ్ ఔట్ కమ్స్ , లెర్నింగ్ ఆజ్బెక్టివ్స్ స్పష్టంగా వ్రాయాలి. 

👉ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యుయేషన్ లేకుండా ఎట్టి పరిస్థితులలో ఆన్సర్ స్క్రిప్ట్స్ వావాల్యుయేషన్ చేయరాదు. 

👉 తరగతిలో బోధన జరుగుతున్న సమయంలో ప్రతి ఉపాధ్యాయుని పనితీరును వారానికి ఒక సారి ప్రధానోపాధ్యాయుడు,/ డైట్ ఫాకల్టీ / ఎస్ సి ఇ ఆర్ టి ఫాకల్టీ పరిశీలించడం జరుగుతుంది. 

👉అకడమిక్ కేలండర్ నందు పొందుపరచిన ప్రతి కార్య క్రమాన్ని తప్పనిసరిగా పాఠశాలలలో అమలుచేయాలి. 

👉కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా  పాఠశాలలో జరిగే ప్రతి క్రార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి నుండి పర్యవేక్షించడం జరుగుతుంది. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

👉మొబైల్ ఫోన్ ద్వారా ఉపాధ్యాయుల 

ఫేసియల్ అటెండాన్స్ సేకరించడం జరుగుతుంది. 

👉ఉపాధ్యాయుల కదలికలను కూడా ఈ అటెండాన్స్ ద్వారా సేకరించడం జరుగుతుంది. 

👉స్కూల్ సేఫ్టీ ప్లెడ్జి ప్రతి పాఠశాలలో ప్రదర్శించాలి. 

👉ఉయ్ లవ్ రీడింగ్ ప్రోగ్రాము ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా నిర్వహించాలి 

👉పాఠశాలలలో జరిగే పరీక్షలను కూడా చాలా పకడ్బందీగా నిర్వహించాలి. 

👉ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ప్రతి నెల మొదటి  

శనివారం, 6-8 వ తరగతుల విద్యార్థులకు మూడవ శనివారం నో బాగ్ డే నిర్వహించాలి.

 👉పాఠశాల ప్రారంభ సమయానికి కనీసం 15 నిమిషాల ముందే ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కావాలి. 

👉ఫౌండేషనల్ లిటరసీ అండ్ నుమెరసీ స్కిల్స్ ప్రతి విద్యార్థి లో పెంపొందించాలి. 

👉కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాము నిర్వహించాలి. 

👉అన్ని రకాల రిజిస్టర్లు నిర్వహించాలి. భద్ర పరచాలి. 

👉స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ తన పరిధిలోని అన్ని పాఠశాలలను ప్రతి మాసం విజిట్ చేయాలి. 

గుర్తించిన లోపాలను ఉన్నతాధికారులకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి.

👉ప్రతి పదిహేను రోజులకు తప్పనిసరిగా ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం నిర్వహించాలి. 

👉అకడమిక్ కేలండర్ విత్ మోడల్ ఇన్స్టిట్యూషనల్ అండ్ లెసన్ ప్లాన్స్  SCERT వారి నుండి అందించబడుతుంది. 

👉విద్యార్థుల డ్రెస్ కోడ్, హెయిర్b స్టైల్ హుందాగా ఉండాలి. 

👉స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా ప్రతి పాఠశాలలో రోజు వారీ నిర్వహించవలసిన కార్యక్రమాల వివరాలు ఇవ్వడం జరుగుతుంది.

త్వరలో 2022 - 23 అకడమిక్ క్యాలెండర్ విడుదల అవుతుంది.

Mahatma jyothibapule MJPBC RESIDENTIAL INTER ADMISSIONS 2022-23

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 02-06-22

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 16-06-22

ఆన్లైన్ లో అప్లై చేయుట కొరకు

https://apgpcet.apcfss.in/BCIntermediateForm.aprjdc

10 Class results will be announced on Monday


టెన్త్ పరీక్షా ఫలితాలు వాయిదా 

సోమవారం విడుదలచేయనున్న AP ఫ్రభుత్వం .

ఏపీ టెన్త్ పరీక్ష ఫలితాలు నేడు విడుదల.. ర్యాంకులు ప్రకటించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు.

ఆంధ్రప్రదేశ్‌లో  పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా, కరోనా కారణంగా రాష్ట్రంలో రెండేళ్లపాటు పదో తరగతి పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే.  

ఈసారి పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్ని ఎత్తేశారు. గతంలో మాదిరిగా మార్కులనే వెల్లడిస్తారు. విద్యాశాఖ కూడా ఎలాంటి ర్యాంకులను ప్రకటించదు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు కనుక ర్యాంకులు ప్రకటిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ఫలానా ర్యాంకులు తెచ్చుకున్నారని ప్రచారం చేయడం నేరమని, అలా చేస్తే కనీసం మూడేళ్ల జైలు శిక్ష తప్పదని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది

The cabinet has given green signal to the New Education Policy. After 34 years, there has been a change in the education policy. The notable features of the new education policy are as follows:

 నూతన విద్యా విధానానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 34 ఏళ్ల తర్వాత విద్యా విధానంలో మార్పు వచ్చింది. కొత్త విద్యా విధానంలో గుర్తించదగిన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:


5 Years Fundamental

 1. Nursery @4 Years

 2. Jr KG @5 Years

 3. Sr KG @6 Years

 4. Std 1st @7 Years

 5. Std 2nd @8 Years


3 Years Preparatory

 6. Std 3rd @9 Years

 7. Std 4th @10 Years

 8. Std 5th @11 Years


3 Years Middle

 9. Std 6th @12 ​​Years

 10.Std 7th @13 Years

 11.Std 8th @14 Years


4 Years Secondary

 12.Std 9th @15 Years

 13.Std SSC @16 Years

 14.Std FYJC @17Years

 15.STD SYJC @18 Years

Special and important things

 Board will be in 12th class only, MPhil will be closed, college degree of 4 year. 

 10th board is over, MPhil will also be closed,

Now students up to 5th standard will be taught in mother tongue, local language and national language only.  The rest of the subject, even if it is English, will be taught as a subject.

Now only 12th board exam will have to be given.  Whereas earlier it was mandatory to give 10th board exam, which will not happen now.

 Examination will be held in the semester from 9th to 12th class.  Schooling will be taught under the 5+3+3+4 formula.

 At the same time, the college degree will be of 3 and 4 years.  That is, certificate on the first year of graduation, diploma on the second year, degree in the third year.

3 year degree is for those students who do not want to take higher education.  Whereas students pursuing higher education will have to do a 4-year degree.  Students doing 4-year degree will be able to do MA in one year

Now students will not have to do MPhil.  Rather, MA students will now be able to do PhD directly.

There will be no board exam in 10th.

Students will be able to do other courses in between.  The gross enrollment ratio in higher education will be 50 percent by 2035.  At the same time, under the new education policy, if a student wants to do another course in the middle of a course, then he can do the second course by taking a break from the first course for a limited time.

 Many reforms have also been made in higher education.  The reforms include graded academic, administrative and financial autonomy etc.  Apart from this, e-courses will be started in regional languages.  Virtual Labs will be developed.  A National Educational Scientific Forum (NETF) will be started.  Please tell that there are 45 thousand colleges in the country.

There will be same rules for all institutions, government, private, deemed.

 (Honorable Education Minister, Government of India)

 https://nvshq.org/article/new-national-education-policy-nep-2020/


https://nvshq.org/article/new-national-education-policy-nep-2022/

copy of the minutes of meeting held on 24.05.2022 at 11.00 am to 12.30 pm regarding 'Consultative Meeting on CPS' at Conference Hall, 1st Floor, Finance Department, A.P. Secretariat, Velagapudi is herewith communicated for information.

Minutes of the CPS Meeting : 24వ తేదీన జరిగిన సి.పి.ఎస్ మీటింగ్ మినిట్స్ విడుదల.

24.05.2022న ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన సమావేశపు మినిట్స్ కాపీ, కాన్ఫరెన్స్ హాల్, 1వ అంతస్తు, ఆర్థిక శాఖ, ఎ.పి. సెక్రటేరియట్, వెలగపూడి 

Click here to download minutes 

AP Model school 6th class admission notification and AP Model school Intermediate admission notification

ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరములో 6 వ తరగతిలో ప్రవేశము కొరకు ప్రకటన

Link for apply AP Model school admissions 

https://apms.apcfss.in/

File No.ESE02-34/2/2022-AD-APMS

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2022-2023 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కొరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలలో బోధనా మాధ్యమము ఆంగ్లములో ఉండును ఈ పాఠశాలలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు .

1. వయస్సు: ఓ సి], బీసీ(OC, BC) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2010 మరియు 31 08-2012 మధ్య పుట్టి ఉండాలి! యస్ సి, ఎస్టీ (SC, ST) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09 2008 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి.. 2. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2020-2021

మరియు 2021-2022 విద్యా సంవత్సరములులో చదివి ఉండాలి 2021-2022 విద్యసంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి

3. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు : https://apms.ap.gov.in/apms/ చూడగలరు|

దరఖాస్తు చేయు విధానము: అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ 05.06.2022 నుండి 16.06.22 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ జనరల్ నెంబర ఆధారంగా https://apms.ap.gov.in/apms/ (online లో) లో దరఖాస్తు చేసుకొనవలయును!!

4. దరఖాస్తు చేయడానికి రుసుము : OC మరియు BC లకు రూ. 100/- (అక్షరములా వంద

రూపాయలు మాత్రమే ) SC మరియు ST లకు రూ.50/- (అక్షరములా ఏభై రూపాయలు మాత్రమే).

5. ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని

Circular Rc.No. 1744329 /MBNN/2022 , Dated.02/06/2022 Nadu-Nedu Phase-II Storage of Sand in view of ensuing rainy season and logistic issues – Identifcation of High Schools to use as Sand depots

నాడు - నేడు ఫేజ్ II ఇసుక నిల్వ / ఇసుక డిపోలుగా వర్షాకాలం మరియు రవాణా సమస్యల దృష్ట్యా ఉపయోగించడానికి ఉన్నత పాఠశాలలను గుర్తించుటకు సూచనలతో ఉత్తర్వులు విడుదల.

 ఇసుక డిపోలుగా ఎన్నిక చేయాల్సిన 26 జిల్లాల హై స్కూల్స్ లిస్ట్స్, ఉత్తర్వుల కాపీ

https://drive.google.com/drive/mobile/folders/14XL_-mB97CShtogKiaqB_biSYx9BYu7o?usp=sharing&sort=11&direction=d

అమ్మఒడి జాబితాలో మీ పేరు లేదా...అయితే ఇలా చేయండి.

మొదట అమ్మఒడి అనర్హత జాబితాలో ఉంటే... మీరు ఏ కారణం చేత పథకాన్ని నిలిపేశారో ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది.

విద్యుత్ వినియోగం 300 యూనిట్ల దాటితే అనర్హులవుతారు.

ఐతే మీరు అద్దె ఇంట్లో ఉంటూ.. ఆధార్ ఆధారంగా 300 యూనిట్ల వినియోగం మించినట్లు గుర్తిస్తే.. వెంటనే విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి.. ఆధార్ కార్డు, మీటర్ నెంబర్ తో పాటు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఈడీ బల్బులు తీసుకున్న ఆధారాలు చూపించాలి.

అలా అయితే మీకు, ఆ విద్యుత్ మీటర్ కు సంబంధం లేదంటూ ఓ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. దాన్ని గ్రామ, వార్డు సచివాలయంలో ఇచ్చి వివరాలను అప్ డేట్ చేయించుకోవాలి.

రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల పేరు మీద పట్టణాలలో ఐతే వెయ్యి చదరపు అడుగుల నివాసస్థలం, గ్రామాల్లో 700 చదరపు అడుగులు నివాసస్థలం ఉంటే అమ్మఒడికి అనర్హులు. విద్యార్థి కుటుంబ సభ్యులంతా ఒకే రేషన్ కార్డులో ఉండి వారిలో ఎవరి పేరుమీదైనా అర్హతకు మించిన స్థలముంటే అమ్మఒడి రాదు.

విద్యార్థి తాత,నానమ్మల పేరుతో ఆ స్థలముంటే వెంటనే తల్లిదండ్రులు మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించి రేషన్ కార్డులో సపరేట్ అవ్వాల్సి ఉంటుంది.

విద్యార్థి, అతడి తల్లి ఇద్దరూ ఒకే మ్యాపింగ్ లో ఉండేలా చూసుకోవాలి. అలా లేకుంటే వెంటనే వాలంటీర్ ను సంప్రదించి మ్యాపింగ్ చేయించుకోవాలి. ఒకవేళ స్టూడెంట్ పేరు రేషన్ కార్డులే లేకుంటే.. బర్త్ సర్టిఫికెట్ ను గ్రామ సచివాలయంలో సమర్పించి రేషన్ కార్డులో చేర్పించాలి.

పొరబాటున తల్లిదండ్రుల పేర్లు అధిక ఆదాయమున్న లిస్టులో ఉంటే.. వెంటనే వారికి ఎకౌంట్ ఉన్న బ్యాంక్ నుంచి ఫాప్-60ని పొంది గ్రామసచివాలయంలో సబ్ మిట్ చేయాలి. అలా చేయకుంటే అమ్మఒడి డబ్బులు రావు.

స్టూడెంట్ మదర్ బ్యాంకు అకౌంట్ కి మ్యాప్ అయిన ఆధార్ ఫోన్ నెంబర్ ఒకటే ఉండే విధంగా చూసుకోవాలి. బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందా లేదో చెక్ చేసుకొని కాకపోతే లింక్ చేయించుకోవాలి. ఒకవేళ IFSC Code మారిన బ్యాంక్ ఎకౌంట్లు ఉంటే.. వెంటనే కోడ్ ను అప్ డేట్ చేయించుకోవాలి.

నాడు – నేడు రెండో దశ పనులు త్వరితగతిన ప్రారంభించండి.పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపించాలి: మంత్రి బొత్స

నాడు – నేడు రెండో దశ పనులు నిర్ణీత కాలపరమితితో పనులన్నీ పూర్తి కావాలి. అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశం.కలెక్టర్లు, డిఇఒలతో వీడియో కాన్ఫరెన్సు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మన బడి నాడు- నేడు రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ అన్నారు. నిర్ణీత కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.

పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌తో కలిసి విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి గురువారం నాడు జిల్లా కలెక్టర్లు, జేసీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. నాడు నేడు రెండో దశలో భాగంగా 12 వేల పైచిలుకు పాఠశాలల్లో పనులు చేపట్టనున్నామని, వీటి కోసం నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పనుల నిమిత్తం ఈ పాటికే రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదలైనందున, పనులను ప్రారంభిచాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన ఇసుక,  సిమెంట్,  వంటి వాటిని కూడా అందుబాటులో ఉంచామన్నారు.

ఈ పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని, పనులు వేగవంతంగా జరగడంలో అధికారులు, ఆయా పాఠశాలల పేరెంట్స్ కమిటీలు కూడా పూర్తి సమన్వయంతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో గతానికి ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. ఈ పనులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు ఎదురైనా, వాటిని వెంటనే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

AP 10th class exams results released on June 4th

ఈ నెల 4 న టెన్త్ పలితాలు..మార్క్స్ రూపంలో వెల్లడి.

శనివారం (4-6-2022)ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ B. రాజ్ శేఖర్ గారు... వేదిక : మీడియా పాయింట్, R&B ఆఫీస్, ఎంజీ రోడ్. డి. దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్.

విలీన ప్రక్రియ అయ్యిన వెంటనే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం.ఉపాధ్యాయ బదిలీలు కూడా పాఠశాలల సెలవులు ముగిసే లోపే పూర్తి .స్కుాలు అసిస్టెంట్ లకు జుానియర్ లెక్చరర్స్ గా ప్రమోషన్స్.SCERT డైరెక్టర్ శ్రీ B ప్రతాపరెడ్డి గారు

SCERT డైరెక్టర్ శ్రీ B ప్రతాపరెడ్డి గారిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు  కలసి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించే ప్రక్రియ త్వరిత గతిన ప్రారంభం అయ్యేలా కృషి చేయాలని కోరడం జరిగింది. అందులకు వారు స్పందిస్తూ, జిల్లా పరిషత్ పాఠశాల లోనే జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయని, స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ హోదా,  SGT లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు త్వరలో రావడం ఖాయమని తెలిపారు.

ఒక కిలోమీటరు పరిధిలోని పాఠశాలలు  విలీన ప్రక్రియ  అయ్యిన వెంటనే పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది అని తెలిపారు.

అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలు కూడా పాఠశాలల సెలవులు ముగిసే లోపే పూర్తి అవుతాయని తెలియపరిచారు‌.

Head Masters to raise the indent before 05.00 pm on 03.06.2022 and if any student not received the JVK kit because of not raising the indent the concerned Head Master , CMO and APC are responsible and disciplinary action will be proposed against them as per rules



సమగ్ర శిక్ష , AP - జగనన్న విద్యా కానుక ' 2022-23 - JVK 2022కి సంబంధించి సమగ్ర శిక్షా APC లు & CMOS లకు కొన్ని సూచనలు


నేటి నుంచి డీఈఈసెట్ దరఖాస్తుల స్వీకరణ

 రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ విద్య శిక్షణ సంస్థలు, ప్రభుత్వేత ర ప్రాథమిక విద్య శిక్షణ సంస్థలలో డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈ సెట్-2022కు గురువారం నుంచి దరఖాస్తు లను స్వీకరించనున్నట్లు పాఠశాల విద్య శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు చెప్పారు. ఆసక్తిగల, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తులను జూన్ 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. దరఖాస్తులను https://cse.ap.gov.in

లేదా https://apdeecet.apcfss.in పోర్ట ల్ల ద్వారా ఆన్లైన్లో సమర్పించాలన్నారు.

Indian oil Corporation &cultural ministry combindly conducted quiz program for 13 years to 18 years students

13 నుంచి 18 సంవత్సరాల వయసు లోపు విద్యార్థులు ఒక్కొక్కరికి పది లక్షల స్కాలర్షిప్లు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ & సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లు కలిపి నిర్వహిస్తున్న క్విజ్ పోటీలలో గెలిచిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున... 55 లక్షల స్కాలర్ షిప్ గెలుచుకునే అవకాశం.

జూలై 10 2002 లాస్ట్ డేట్ అప్లై చేయడానికి, వివరాలకు క్రింద తెలిపిన ప్రొసీడింగ్స్ చూడండి.

Click Here To Download proceedings 

ప్రభుత్వ శాఖలో అవినీతిని రూపుమాపేందుకు కొత్త యాప్ ను ప్రారంభించిన AP ప్రభుత్వం - 𝐀𝐧𝐭𝐢 - 𝐂𝐨𝐫𝐫𝐮𝐩𝐭𝐢𝐨𝐧 𝐁𝐮𝐫𝐞𝐚𝐮 (𝐀𝐂𝐁) 14400 New 𝐀𝐩𝐩 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్

అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు.

ప్రభుత్వ శాఖలో అవినీతిని రూపుమాపేందుకు కొత్త యాప్ ను ప్రారంభించిన AP ప్రభుత్వం - 𝐀𝐧𝐭𝐢 - 𝐂𝐨𝐫𝐫𝐮𝐩𝐭𝐢𝐨𝐧 𝐁𝐮𝐫𝐞𝐚𝐮 (𝐀𝐂𝐁) 14400 new 𝐀𝐩𝐩 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

ACB 14400 తో ప్రజలు ఈ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చు

ఈ యాప్ ఫీచర్స్ & 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐀𝐧𝐭𝐢-𝐂𝐨𝐫𝐫𝐮𝐩𝐭𝐢𝐨𝐧 𝐁𝐮𝐫𝐞𝐚𝐮 (𝐀𝐂𝐁) 𝐚𝐩𝐩

https://play.google.com/store/apps/details?id=in.gov.ap.acb.citizen

 ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి... బటన్‌ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయండి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది

యాప్‌ ఎలా పనిచేస్తుందంటే.

♦పౌరులు నేరుగా యాప్‌ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం

♦గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌

♦యాప్‌ డౌన్లోడ్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ

♦ఓటీపీ రిజిస్టర్‌ చేయగానే వినియోగానికి యాప్‌ సిద్ధం

♦యాప్‌లో 2 కీలక ఫీచర్లు

♦యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను  నేరుగా లైవ్‌రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం

♦లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు  తనదగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం

♦ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు రిఫరెన్స్‌ నంబరు 

♦త్వరలో ఐఓఎస్‌ వెర్షన్‌లోనూ యాప్‌ను సిద్ధంచేస్తున్న ఏసీబీ


AP departmental test NOTIFICATION NO 05/2022, TIME TABLE & SCHEME

ఏపీ డిపార్ట్మెంట్ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ ను విడుదల చేయడం జరిగింది. పేపర్ కోడు పరీక్ష ఎప్పుడు అనే పూర్తి వివరాలు పొందుపరచడం జరిగింది.

Featured post

Ap open school 10th Class and intermediate results