APTF VIZAG: March 2021

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

సిబిఎస్ ఈ పై ఉపాధ్యాయులకు శిక్షణ.నిష్పత్తికి తగ్గట్టు సిబ్బంది ఉండాలి.విద్యాశాఖ సమీక్షలో సిఎం జగన్

సిబిఎస్ఇ సిలబస్ పై ఉపాధ్యాయులకు అవగాహన, శిక్షణ కల్పించాలని విద్యాశాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశించారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టు ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మంచి విద్య అందరికీ అందాలని, పేదపిల్లలు గొప్పగా చదువుకోవాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. 2021-22 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సిబిఎస్ ఇ గుర్తింపు ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు.2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు సిబిఎస్ బోర్డు నుంచే పరీక్షలు రాస్తారని తెలిపారు. 

రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని సిబిఎస్ఇ తెరవనుండని పేర్కొన్నారు. తనిఖీలు, పర్యవేక్షణ పటిష్టంగాఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇంగ్లీష్ లో బోధించడం, మాట్లాడటం అలవాటు చేయాలని చెప్పారు. ప్రీ ఫ్రైమరీ అంగన్ వాడీల్లోనూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రైమరీ పెడుతున్నామని తెలిపారు. నాడు-నేడు మొదటి దస క్రింద పూర్తయిన పనులను స్వయంసహాయక సంఘాల మహిళలతో పరిశీలన చేయించాలని ఆదేశించారు అభివృద్ధి చేసిన పాఠశాలలను ఏప్రిల్ 30నప్రజలకు అంకితం చేస్తామన్నారు. పాఠశాలలు ప్రారంభించేనాటికి విద్యాకానుక కిట్లు విద్యార్థులకు అందాలని ఆదేశించారు. గోరుముదం పై వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలన్నారు విద్యాకానుకలో అందించనున్న డెయిరీ, పాఠ్యపుస్తకాలు, బ్యాగులను సీఎం ఈ సందర్భంగా పరిశీలించారు మగురుదొడ్ల నిర్వహణ పై ఎస్ఒపితో కూడిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వి.రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడు, సమగ్ర కక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టరు వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి: సీఎం జగన్‌

అంగన్‌వాడీల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియంను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పాఠశాల విద్యాశాఖపై జరిగిన సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంగ్లీషులోనే బోధించాలని, వారితో ఇంగ్లీషు మాట్లాడించటం అలవాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీలతో సహా పీపీ-1లలో కూడా ఇంగ్లీష్‌ మీడియం విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. నాడు-నేడు కింద తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ఏప్రిల్‌ 30న ప్రజలకు అంకితం చేస్తామని వెల్లడించారు.

అలాగే, జగనన్న గోరుముద్దపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని.. పిల్లలకు నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను అందించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. జగనన్న విద్యాకానుకపై సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మళ్లీ స్కూల్స్‌ ప్రారంభమయ్యేనాటికి పిల్లలందరికీ విద్యాకానుక అందాలని ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్‌ఈపై టీచర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలని.. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు.

APPLICATION FOR TEACHERS WILLING TO WORK AT AP MODEL SCHOOLS ON DEPUTATION

AP మోడల్ స్కూల్ లలో ఖాళీ గా ఉన్న PGT, TGT పోస్టులను అర్హులైన ఉపాధ్యాయులచే డిప్యుటేషన్  పై నియమించుటకు మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ .PGT ఖాళీలు:  396,TGT ఖాళీలు:  144. డిప్యుటేషన్ పై పనిచేయాలనుకోనే టీచర్ లు ఏప్రిల్ 6 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు.

Click Here To APPLY ONLINE 

MPTC ZPTC ELECTION NOTIFICATION ISSUED MAY BE TOMORROW?

రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్....?

ఏప్రిల్ 8న ఎన్నికలు, 10న కౌంటింగ్ ఉండే అవకాశం

రేపు ఏపీ ఎస్ఈసిగా నీలం సాహ్ని ప్రమాణ స్వీకారం.వెంటనే పరిషత్ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం...?

నెేటి సాయంత్రం ఏపీ ఎస్ఈసి నిమ్మగడ్డ పదవి విరమణ.

SSC June 2021 Fee Payment due date extended upto 15-04-2021.Rc.No.149/J- 2/2021 Dated: 31-03-2021

AP 10 వ తరగతి జూన్ 2021 పబ్లిక్ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పెంపు తేదీలలతో ఉత్తర్వులు జారీ. 

Jagananna Ammavodi laptops given to students studying 9 to 12th class Important Instructions ESE02-28021/27/2020-PLG-CSE,

జగనన్న అమ్మ ఒడి పథకం లో భాగంగా 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు లాప్ టాప్ లను పంపిణీ చేయుటకు గాను మార్గదర్శకాలు విడుదల. 

SSA Proceedings For Shoe Size Measurement Taken By HM and Data online 7-4-2021

బూట్ల పంపిణీ కొరకు పాదాల కొలతలు నమోదు  పై  SSA AP వారి సూచనలు.రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ సెంటీ మీటర్ లలో తీసుకుని హెచ్ఎం లాగిన్లో 07.04.2021 వ తేదీ లోపు పొందుపరచాలి.

Click Here To LOGIN

పాఠశాల పనుల పరిశీలన బాధ్యత పొదుపు మహిళలకు.మేలో రైతు భరోసా, మత్స్యకార భరోసా, పంటల బీమా.స్పందన సమీక్షలో సీఎం జగన్‌

పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ తొలిదశ పనుల్ని స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు భరోసాతోపాటు సున్నా వడ్డీల జమ తేదీలను సీఎం ప్రకటించారు.

 పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ తొలిదశ పనుల్ని స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి చేసిన బడులకు వెంటనే రంగులు వేయించి, వాటిని ఏప్రిల్‌ ఆఖరున ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ‘స్పందన’ కార్యక్రమం అమలుపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. 17,715 పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించగా.. తృతీయపక్షం ద్వారా క్షేత్రస్థాయిలో పనుల్ని ఆడిటింగ్‌ చేయించాలని సూచించారు. ‘ఏప్రిల్‌ 1 నుంచి అర్బన్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలి. గ్రామ/వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకుని ప్రక్రియను ఉద్ధృతంగా చేపట్టాలి. గురువారం నేనూ టీకా తీసుకుంటున్నా’ అని తెలిపారు. ‘ఏపీ చిన్న రాష్ట్రమైనా.. ఉపాధి హామీ పథకం అమల్లో దేశంలోనే మూడోస్థానంలో ఉండటం గర్వకారణం. రూ.5,818 కోట్లను కూలీలకు ఇచ్చాం. ఏప్రిల్‌, మే, జూన్‌లో పనులు ముమ్మరంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. దీనిపై కలెక్టర్లు నాలుగైదు రోజులకోసారి సమీక్షించాలి’ అని సీఎం ఆదేశించారు.

పథకాల అమలు తేదీల ప్రకటన

రైతు భరోసాతోపాటు సున్నా వడ్డీల జమ తేదీలను సీఎం ప్రకటించారు. సంబంధిత సమాచారాన్ని బ్యాంకర్ల ద్వారా అప్‌లోడ్‌ చేయించేలా కలెక్టర్లు చూడాలని చెప్పారు. ఏప్రిల్‌ 13న వాలంటీర్లను సత్కరించనున్నట్లు వివరించారు. చేయూత పథకం కింద జూన్‌లో మహిళలకు ఆర్థికసాయం అందిస్తామన్నారు. మహిళలకు పాలవెల్లువ, జీవక్రాంతి యూనిట్లను ఏప్రిల్‌ 10లోగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలో 25 ఆహారశుద్ధి యూనిట్లను పెట్టబోతున్నట్లు చెప్పారు.

భవనాల్ని త్వరగా పూర్తిచేయాలి

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజి క్లినిక్‌ల భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని  జగన్‌ ఆదేశించారు. ‘వైఎస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా జులై 8న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తాం. కొవిడ్‌ తరహా మహమ్మారుల్ని ఎదుర్కొనేందుకు వీలుగా చేపట్టిన విలేజి క్లినిక్‌లను ఆగస్టు 15న ప్రారంభించాలి’ అని నిర్దేశించారు. ‘9,899 చోట్ల బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 3,841 చోట్ల పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట్ల వెంటనే ప్రారంభించాలి’ అని సూచించారు. ‘రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలుగా మార్చబోతున్నాం. ఇక్కడ ఆంగ్లమాధ్యమంలో బోధన ఉంటుంది. 16,681 చోట్ల నాడు-నేడు కింద అభివృద్ధి పనులు, 27,438 చోట్ల కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలి. 11,488 అంగన్‌వాడీల్లో నాడు-నేడు పనుల్ని ఏప్రిల్‌ మూడో వారంలో విద్యాశాఖ చేపడుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.

సరసమైన ధరలకు ఇళ్లస్థలాలు

మధ్యతరగతి ప్రజలకు(ఎంఐజీ).. సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు వీలుగా పట్టణాలు, నగరాల్లో కనీసం 100 నుంచి 150 ఎకరాలను సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘జగనన్న కాలనీల్లో.. ఒక్కో కాలనీకి ఒకటి చొప్పున నమూనా ఇళ్లను ఏప్రిల్‌ 15 కల్లా కట్టాలి. 8,682 కాలనీల్లో.. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మ్యాపింగ్‌, జియోట్యాగింగ్‌ ఇతర సన్నాహక పనులన్నింటినీ ఏప్రిల్‌ 10కి పూర్తి చేయాలి’ అని చెప్పారు.

స్పందన గడువు పెంచుతున్నాం

540 సేవలకు సంబంధించి స్పందన కింద స్వీకరించే అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని జగన్‌ ఆదేశించారు. ‘బియ్యం, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డులను 21 రోజులు, ఇంటి పట్టాను 90 రోజుల్లో అందించాలి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి. నిర్ణీత సమయంలో దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయా? అనే అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రతి గురువారమూ సమీక్షించాలి’ అని సూచించారు.

సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పూనం మాలకొండయ్య, వై.శ్రీలక్ష్మి, అజయ్‌జైన్‌, ఏఆర్‌ అనూరాధ, బుడితి రాజశేఖర్‌, కమిషనర్లు గిరిజాశంకర్‌, కోన శశిధర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ మల్లికార్జున తదితరులు హాజరయ్యారు.

Visakhapatnam Port Trust is seeking experienced Data Entry Operators to work in Visakhapatnam Port Trust for a period of One year on consolidated remuneration of Rs.20,000

విశాఖపట్నం పోర్ట్ లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ లు ఏప్రిల్ 3 ఆఖరు రోజు.అర్హత ఉన్నవారు అప్లై చేసుకోగలరు.

Essential:- (i) B.Sc. Computer Science / 

Bachelor of Computers from recognized 

University with minimum 70% of marks 

1) Skill test will be conducted. 

2) Required Typing speed of 45 words 

per minute 

3) 5 years experience in Data Entry 

Operator


School Education - Mana Badi Nadu -Nedu Phase II – Administrative approval for implementation of Mana Badi Nadu-Nedu Phase-II to improve Infrastructure facilities in 16,345 educational institutions with (10) components in the State for the FY 2021-22 with an amount of Rs.4,446 crores and guidelines for implementation of the Programme

మన బడి నాడు నేడు కార్యక్రమం లో భాగంగా రెండవ విడత 16345 ఇన్స్టిట్యూట్ లలో కార్యక్రమం అమలు చేయడానికి జీవో నెంబర్ విడుదల 

సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వోద్యోగులకు బంపరాఫర్ అందిస్తున్నది.లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను సిబ్బంది కోసం కొనుగోలు చేయనున్నది.

తాజాగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుక్కోవాలని ఆసక్తి చూపుతున్న ప్రభుత్వోద్యోగులకు జగన్ ప్రభుత్వం చేయూతనివ్వనున్నది.

ఈఈఎస్ఎల్‌తో ఏపీ సర్కార్ జట్టు.ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌)తో ఏపీ సర్కార్ జత కట్టింది.

భారీగా ఈవీ టూ వీలర్స్‌ను ప్రభుత్వోద్యోగులకు సరఫరా చేసేందుకు సంబంధిత మోటారు సైకిళ్లు-స్కూటర్ల తయారీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నది.

ఆకర్షణీయ వాయిదాల్లో ఇలా టూ వీలర్స్.పథకం కింద ఈవీ టూ వీలర్స్ పొందిన వారికి తక్కువ వడ్డీరేటుపై ఆకర్షణీయ రుణ వాయిదాల కింద రుణాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత బ్యాంకర్లతో సంప్రదిస్తున్నది.

 కేఎఫ్‌డబ్ల్యూ, జీఐజడ్ వంటి గ్లోబల్ సంస్థలతోనూ చర్చిస్తున్నది.

ప్రభుత్వోద్యోగులకు భారీగా విద్యుత్ టూ వీలర్స్ సరఫరా చేసేందుకు బిడ్లను ఆహ్వానించినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రమణారెడ్డి తెలిపారు.

భారీ సంఖ్యలో ఒక రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం ప్రపంచంలోనే ఇది తొలిసారని భావిస్తున్నారు

ఆగస్టు 15న విలేజ్‌ క్లినిక్‌లు ప్రారంభం: జగన్‌

మే నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయ, ఆర్బీకేలు, ఏప్రిల్‌, మే నెలలో అమలు చేయనున్న పథకాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పనులు చేపట్టినందుకు ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. కొవిడ్‌ వంటి మహమ్మారిని ఎదుర్కోవడానికే విలేజ్‌ క్లినిక్‌లు తీసుకొస్తున్నట్లు సీఎం చెప్పారు. యుద్ధప్రాతిపదికన వాటి నిర్మాణం పూర్తి చేసి ఆగస్టు 15న ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 9,899 చోట్ల బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ (బీఎంసీ) సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సెప్టెంబర్‌ నెలలో బీఎంసీలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 25 ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం భూములను గుర్తించాలని.. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక యూనిట్‌ చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అర్హులకు 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Jagananna Vidya Deevena and Jagananna Vasathi Deevena Selection List Released

జగనన్న విద్యా దీవన మరియు జగనన్న వసతి దీవెన ఎలిజిబుల్ స్టూడెంట్ లిస్టు విడుదల

Click Here To Download  Eligible List 

ఏప్రిల్ లోనే పరిషత్ ఫైట్. రెండో వారంలో ముహూర్తం.కొత్త ఎస్ఈసీ రాగానే కసరత్తు.ఆగిన చోట నుంచే పరిషత్ ఎన్నికల ప్రక్రియ షురూ.అదే సమయంలో మిగిలిన మున్సిపాలిటీలకూ ఎన్నికలు

రాష్ట్రంలో గతేడాది కరోనా కారణం గా వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిం చేందుకు వైసీపీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు నిర్వహిచేం దుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నించినా, ఆయన ఒప్పుకోక పోవడంతో ఈ నెలలో జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ మొదలు కాలేదు, దీంతో వచ్చే నెల 1వ తేదీన బాధ్యతలు చేపట్టనున్న కొత్త యెస్ ఈ సి నీలం సాహ్నీ ఆధ్వర్యంలో పరిషత్ పోరు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటితో పాటు రాష్ట్రంలో మిగిలిన 22 మున్సి పాలిటీ లు, మూడు కార్పొరేషన్లకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది. ఆ ప్రక్రియ కూడా ఊపందుకుంటోంది. ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక అనంతరం మే 2వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు ఈోలోపే పరిషత్ ఎన్నికలతో పాటు మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచా యతీలకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి వ్యాసి నేషన్ పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని ప్రభుత్వం బాని స్తోంది. అదే క్రమంలో పరిపాలనలో కూడా వేగాన్ని పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది.

గతేడాది వాయిదా పడిన పరిషత్ పోరును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు వైసీపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం త్వరలో కొత్త ఎస్ నే నీల్ల సాహ్నీ బాధ్యతలు చేపట్టగానే నోటిఫికేషన్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో గతంలో వాయిదా పడిన దగ్గరి నుంచే విర్వహిస్తారా లేక కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది, కాగా, ప్రభుత్వం మాత్రంవాయిదా పడిన దగ్గర నుండే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని, ఇదే క్రమంలో మిగిలిన మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరిషత్ పోరును సాధ్యమైనంత త్వరగా ముగించేస్తే ఆ తర్వాత పాలనపై దృష్టి పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ ఇస్తే రెండో వారానికి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంటుందని భావిస్తు ప్పారు. గతంలో ఆగిన బోటు మంచి నిర్వహిస్తే ఏకగ్రీవాలు మినహా మిగిలిన స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. ఆరా కాదని కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తే ఇంకాస్త ఆలస్యం కావొచ్చు. కాగా గతేడాది కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే అప్పటికే పలు స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి. వీటిలో ఏమైనా అక్రమాలు జరిగాయోమో అన్న అనుమానంతో విచారణకు ఆదేశించిన ఎన్మనీ నిమ్మగడ్డ రమేష్ ఏకగ్రీవమైన అభ్యర్థులకు ఫామ్ 10 ఇవ్వకుండా ఆపారు. కానీ హైకోర్టు ఆదేశాలతో ఫామ్ 10 ఇవ్వక తప్పలేదు, అంటే అప్పట్లో ఏకగ్రీవాలకు ఆమోదముద్ర పడినట్లే. అయితే ఎన్నికలు రద్దయి కొత్త కజిఫికేషన్ వస్తే మాత్రం ఈ విగ్రీవాలను కూడా రద్దు చేయాలి. విపక్షాలు కూడా ఇదే కోరుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆగిన చోట నుంచే ఎన్నికలకు మొగ్గు చూపుతోంది.

31 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్.హాల్ టికెట్ లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 31 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 వరకు ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. 

Click Here To Download Inter Hall Tickets

ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం.. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహిస్తారు. గదికి 10 మందిని మాత్రమే కేటాయించాలి. ఆదివారం సహా రోజుకు రెండు పూటలా పరీక్షలుంటాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 947 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3,58,474 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఎంపిసి విద్యార్థులు 2,60,012 మంది ఉండగా బైబిసి విద్యార్థులు 98,462 మంది ఉన్నారు. హాల్ టిక్కెట్లను ఇంటర్మీడియట్ బోర్డు వైబ్ సైట్ bie.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిసి కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షల పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్ అధికారులను నియమించామని, వీరి మొబైల్ నెంబర్లకు ఒటిపి నెంబర్ వచ్చిన తరువాతే డౌన్లోడ్ చేసుకున్న ప్రశ్నపత్రాలు తెరవాల్సివుంటుందని రామకృష్ణ ఆదేశించారు.

ఏపీ వ్యాప్తంగా మాస్క్ ధారణ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్. నిన్న ఒక్క రోజునే మాస్కులు ధరించని 18,565 మందికి ఫైన్లు వేసిన పోలీసులు.ఫైన్ల ద్వారా రూ. 17.34 లక్షలు వసూలు చేసిన పోలీసులు.

కరోనా మళ్లీ విస్తరిస్తుండడంతో ఏపీలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో  మాస్కులు పెట్టుకోవడంపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా బయటికి వస్తున్నవారికి జరిమానా వడ్డించారు. నిన్న ఒక్కరోజే 18,565 మందికి జరిమానాలు విధించడం ద్వారా రూ.17.34 లక్షలు వసూలు చేశారు.

అత్యధికంగా ప్రకాశం జిల్లా పోలీసులు రూ.2.10 లక్షలు జరిమానాల రూపంలో రాబట్టారు. అత్యల్పంగా రాజమండ్రి అర్బన్ పోలీసులు రూ,2,800 వసూలు చేశారు. కాగా, పలు చోట్ల పోలీసులే మాస్కులు పంచారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. మాస్కులు ధరించిన వారికి గులాబీ పూలు ఇచ్చి అభినందించారు.



ఏప్రిల్‌ నెలలో అమల్లోకి రాబోతున్న 12 కొత్త రూల్స్ మీ కోసం.

1.మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేశారా? లింక్ చేయకపోతే ఏప్రిల్ నుంచి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.మార్చి 31  పాన్, ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ.

2.ఇటివల ఎనిమిది  ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా  మార్చారు . దీంతో ఏప్రిల్ 1 నుంచి పాత బ్యాంకులకు చెందిన పాస్‌బుక్స్, చెక్ బుక్స్  పనిచేయవు.

3.ఇన్‍కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ ప్రకారం పన్నులు చెల్లించాలి.

4. ఇకపై  ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం ప్రీ-ఫిల్డ్ ఫామ్స్ రానున్నాయి. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు సులువుగా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.

5.మార్చి 31న ఎల్‌టీసీ స్కీమ్‌లో ఇచ్చిన మినహాయింపులు ముగుస్తాయి. ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు.

6.ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారు టీడీఎస్‌పై ఎక్కువ రేట్ వసూలు చేయనున్నారు.

7.ఏప్రిల్ 1 తర్వాత 75 ఏళ్ల పైన ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు.  ప్రభుత్వం వారికి పన్నులను బ్యాంకులనే నేరుగా డిడక్ట్ చేస్తుంది.

8.కొత్త వేతన కోడ్ ఏప్రిల్ 1న అమల్లోకి రానుంది.మొత్తంగా ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీ తగ్గుతుంది.

9.ఒక కంపెనీలో ఐదేళ్లు వరుసగా సేవలు అందించిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లభిస్తుంది.

10.ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్స్ పెరగనున్నాయి.

11.టూరిజంను ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్‌ను అందిస్తోంది.

12.ఏప్రిల్ 1న టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీల ధరలు పెరగనున్నాయి. విడిభాగాల కొరతతో పాటు ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచడం లాంటి కారణాలతో వీటి ధరలు పెరగనున్నాయి.

Census 2021 Postponed Due To COVID

కోవిడ్ వల్ల జనగణన-2021 వాయిదా

కోవిడ్-19 వల్ల జనగణన-2021 సంబంధిత పనులు వాయిదా పడ్డాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జనరల్ కార్యాలయం తెలిపింది. రాష్ట్రాలవారీగా జనగణన 2021 ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియజేయాలంటూ విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి సమాధానమిచ్చిన రిజిస్ట్రార్ జనరల్ కార్యా లయం జనగణనకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. కొత్త తేదీలను నిర్ణయిం చలేదని వివరించింది.

జనగణన-2021 కోసం 2010 జనవరి 1 నుంచి 2019 డిసెం బర్ 31 వరకు ఉన్న మ్యాపింగ్ ను, సరిహద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అయితే కోవిడ్-19 వల్ల జనగణన వాయిదా పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2021 వరకు ఈ తేదీ ని పొడిగించామని జనగణన పూర్తయ్యే వరకు మ్యాపింగ్ సరిహద్దుల్లో మార్పులు చేయొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించిందని తెలిపింది.

KVS Admission 2021 కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో అడ్మిషన్లు.Kendriya Vidyalaya Sangathan Admission into 1st Class

కేంద్రియ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

1వ తరగతిలో అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ల కోసం కేంద్రీయ విద్యాలయ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తేదీల వివరాలను సైతం వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2021-22లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ 1l ఉదయం 10 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఏప్రిల్ 19వ తేదీ సాయంత్రం 7 గంటల నాటికి ముగుస్తుందని కేంద్రియ విద్యాలయ సంఘటన్‌ వెల్లడించింది.

ప్రవేశ వివరాలను అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.in ద్వారా KVS Android మొబైల్ యాప్‌ ద్వారా పొందవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

కాగా.. 2 లేదా అంతకంటే ఎక్కువ తరగతుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్ 8 ఉదయం 8గంటల నుంచి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 4 గంటల మధ్య జరగనుంది. అయితే 1వ తరగతి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్‌లో.. 2వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ తరగతుల అడ్మిషన్ల ప్రక్రియను ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

అయితే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఆయా చోట్ల ఉన్న ఖాళీ సీట్లను బట్టి 2 లేదా అంతకంటే ఎక్కువ తరగతులకు ప్రవేశం ఉంటుంది.

దీంతోపాటు 2021-2022 విద్యాసంవత్సరంలో.. 11వ తరగతిలో ప్రవేశం కోసం కేంద్రీయ విద్యాలయం సూచించిన ప్రకారం.. కేవీఎస్‌ (హెచ్‌క్యూ) వెబ్‌సైట్ – kvsangathan.nic.in నుంచి రిజిస్ట్రేషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రవేశానికి సంబంధించిన సమాచారం కోసం స్థానికంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలను సందర్శించవద్దని ఆన్‌లైన్‌లోనే పూర్తిచేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది.

ఒకటో తరగతిలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత.. కేవీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో మొదటి ప్రవేశ జాబితాను విడుదల చేస్తుంది.

మొదటి జాబితా తరువాత సీట్లు ఖాళీగా ఉంటే రెండు, మూడు నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది.

ఈ జాబితాలను కేంద్రీయ విద్యాలయాలు తమ తమ అధికారిక వెబ్‌సైట్లలో విడుదల చేస్తాయి.

ప్రస్తుతం, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఆధ్వర్యంలో మొత్తం 1,247 విద్యాలయాలు ఉన్నాయి.

Employee Pay Slip is enabled under Employee Services, to all the Employees in CFMS.Employee & Pensioner Services - Employee Services -My Pay Slip. OTP required.

మన Pay slip అధికారికంగా CFMS ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.మన ఫోన్ కు OTP వస్తుంది.ఎంటర్ చేసిన తర్వాత మన pay slip డౌన్లోడ్ అవుతుంది.2019 నుండి 2021 మార్చి వరకు pay slips డౌన్లోడ్ అవుతున్నాయి.ఇందులో మన PF, CPS, APGLI, PAN BANK DETAILS అన్నీ వస్తున్నాయి. మీ పే స్లిప్ ను డౌన్లోడ్ చేసుకుని సరిచూసుకోగలరు. 

Click Here To Download Your PAY SLIP 


మొదట  మీ treasury ID ఇచ్చి get details click ఇవ్వండి.

send OTP

SELECT MONTH,SELECT YEAR,GET PAY SLIP

గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు మరియు పాఠశాల విద్యా కమిషనర్ తేది 27/03/21, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తెలియజేసిన విషయాలు.

1.సింగల్ సెక్షన్ స్కూల్ తేదీ 1/04/21నుండి 31/05/21 వరకు నిర్వహించాలి.     

2.టైమ్ 7.45AM- 12.30 PM 

3.ప్రతిరోజూ విద్యార్థులకు  విధిగా  ధర్మల్ స్క్రీనింగ్ చేసి హ్యాండ్ శానిటైజేషన్, మాస్క్ లు ధరించేటట్టు చూడాలి.

4.పాఠశాలలో జగనన్న గోరుముద్ద (MDM) కి విద్యార్థులను  తరగతి వారీగా పంపించాలి.

5.పాఠశాలలో విద్యార్థులు  సామజిక  దూరం పాటించేటట్టు చూడాలి

6.పాఠశాల ముగిసిన తరువాత విద్యార్థులు బయట తిరగకుండా ఇంటికి వెళ్లేటట్టు ప్రధానోపాధ్యాయులు చర్య తీసుకోవాలి.

7.ముఖ్యంగా ఉపాధ్యాయులు విధిగా ఇన్ టైంలో  బయోమెట్రిక్ అటెండెన్స్ వేసేటట్టు చూడాలి.

8.ఉపాధ్యాయుల బయోమెట్రిక్ అటెండన్స్ రిపోర్ట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ గారు & జిల్లా విద్యాశాఖ అధికారి గారు   ప్రతి రోజు మోనటరింగ్ చేసి  వారం లో ఒక పాఠశాల బయోమెట్రిక్ అటెండన్స్ రిపోర్ట్ పరిశీలించి సంబంధిత పాఠశాల పై రివ్యూ నిర్వహిస్తారని తెలియజేయడం జరిగింది.

కరోనా వచ్చిన విద్యా సంస్థలు వెంటనే మూసివేయాలి : మంత్రి సురేశ్‌

కరోనా కేసులు నమోదైన విద్యాసంస్థలు వెంటనే మూసివేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆదేశించారు.

 రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో అకడమిక్‌ క్యాలెండర్‌ గాడిలో పెట్టామని చెప్పారు. పెద్ద ఎత్తున కరోనా సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుందని, దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే చేశామని పేర్కొన్నారు. కరోనా మళ్లీ పుంజుకుంటోందని, రెండు నెలలు జాగ్రత్త అవసరమని తెలిపారు.

రాజమహేంద్రవరంలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకిందని, కరోనా సోకినవారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతామని, ఆదివారాలు కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

JVK Kit Not Distributed children Details in visakhapatnam

విశాఖపట్నం జిల్లా లో  JVK kits  2020-21 విద్యా సంవత్సరములో సరఫరా చేసిన యూనిఫాం క్లాత్ నకు సంబంధించి దిగువ పంపిన Excel Sheet లో వున్న విద్యార్ధులకు యూనిఫాం క్లాత్ అందినదా లేదా Yes/No అని నమోదు చేసి మీమీ మండలముల వారీగా dpepvis@yahoo.co.in ఈ మెయిల్ కు మధ్యాహ్నం 2.00 గం.ల లోపు పంపగలరని కోరడమైనది.

Click Here To DOWNLOAD LIST

అంబేద్కర్ వర్సిటీ పరీక్షలు వాయిదా

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వ త్రిక విశ్వవిద్యాలయం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ ఇన్ ఛార్జి రిజిస్ట్రార్ డా. జి.లక్ష్మారెడ్డి ఒక ప్రకట నలో తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పూర్తి వివ రాలలు www.braouonline.in లేదా 040-23680241 ఫోన్ నెంబ ర్లో పొందవచ్చని తెలిపారు.

New AP State Election Commissioner Is Smt Neelam Sahani EX CS From 1.4.2021

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నీలం సాహ్నీ.నీలంసాహ్నీ పేరును ఆమోదించిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

ప్రభుత్వం పంపిన  ముగ్గురు అధికారుల నుంచి నీలం సాహ్నీ పేరు ఖరారు చేసిన గవర్నర్.ఈ నెల  31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

General Administration (Cabinet) Department- Amendments to the Second Schedule of the Andhra Pradesh Government Business Rules, 2018- Orders-G.O.MS.No.35 Dated: 25-03-2021

ఉన్నత విద్య (వర్సిటీల) పరిధిలో.. B.Ed., M.Ed., B.P.Ed., M.P.Ed. లను చేర్చుతూ ఉత్తర్వులు జారీ.



ఉగాదికి విద్యాశాఖ పోస్టుల భర్తీకి క్యాలెండర్.ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజులు చెల్లింపు.సీఎం ఆదేశాల మేరకు విద్యావ్యవస్థలో సమూల మార్పులు. అటానమస్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా చర్యలు .రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

విద్యా శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ ను రానున్న ఉగాదికి క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.  వచ్చే నెల 9వ తేదీన జగనన్న విద్యా దీవెన కింద ఫీజులు చెల్లిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు సచివాలయం నాలుగో బ్లాక్ లో మంత్రి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా విద్యా బోధన చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

అక్రమాలకు పాల్పడే అటానమస్ కాలేజీల తీరు మార్చకోకుంటే తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అటానమస్ కళాశాలలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 109 అటానమస్ కాలేజీలు పలు యూనివర్శిటీల పరిధిలో ఉన్నాయన్నారు. తమ పరిధిలోని అటానమస్ కాలేజీలకు ఆయా యూనివర్శీటీలే సిలబస్ మొదలుకుని ప్రశ్న పత్రాల రూపకల్పన, మూల్యాంకనం వంటివి చేపడతున్నాయని అన్నారు. అటానమస్ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందడంలేదని గుర్తించామన్నారు. అటానమస్ స్టేటస్ అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతుండడంతో పాటు ప్రభుత్వమిచ్చే రాయితీలను పొంది కొన్ని అటానమస్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అటానమస్ కాలేజీల విషయమై యూజీసీతో కూడా సంప్రదింపులు జరుపుతామన్నారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉందని కేంద్రమే కాదు రాష్ట్రమూ చట్టాలు చేయొచ్చునని మంత్రి పేర్కొన్నారు. 

యూజీసీ ఆమోదం ఉంది తమ జోలికి ఎవరూ రావద్దంటే కుదరదని మంత్రి స్పష్టం చేశారు. కాలేజీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయన్నారు. ఏవైనా కళాశాలలు కోర్టులకు వెళ్తామనుకుంటే భావిస్తే వెళ్లొచ్చునన్నారు.అటానమస్ కాలేజీల్లో అకడమిక్ ఆడిట్.

డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశ్యంతో అటానమస్ కాలేజీల్లో ఆడిట్ చేపట్టి, పరీక్ష విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. ఇకపై అటానమాస్ కాలేజీలు సొంతంగా ప్రశ్న పత్రాలు రూపొందించడం కుదరదని మంత్రి వెల్లడించారు. నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వలన ఉద్యోగాలు రావడం లేదని మంత్రి సురేష్ పేర్కొన్నారు. నైపుణ్యం లేని విద్య అక్కరకు రాదనేది ప్రభుత్వ భావన అని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి డిగ్రీ తరగతులకూ అప్రంటీస్ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యా విధానం పరిశీలించిన తర్వాతే ఈ మార్పులు చేపట్టామని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర యూనివర్శిటీ, ఎస్వీ యూనివర్శిటీ, ఆర్జీయూకేటీ, జేఎన్టీయూ-కాకినాడ, అనంతపురం విషయంలో అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సిఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి సురేష్ వివరించారు.

వచ్చే నెల 9న జగనన్న విద్యా దీవెన.

ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజులు చెల్లిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగన్న విద్యా దీవెన నగదు జమచేయనున్నట్లు వెల్లడించారు. 10లక్షల మందికి పైగా విద్యార్ధులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెనతో పేద విద్యార్థుల చదువులకు ఇబ్బంది రాదనే భరోసా కలిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7 లక్షల వరకు పెరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.

ఉగాదికి పోస్టుల భర్తీకి క్యాలెండర్ విద్యా శాఖలో ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టుల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ ను ఉగాది రోజున విడుదల చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్యాలెండర్  విడుదల చేయునున్నట్లు తెలిపారు. ఒంగోలు,శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు వీలైంనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ఆర్ధిక శాఖను ముఖ్యమంతి ఆదేశించినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు.

AP SCERT 1 TO 6TH CLASS ALL SEMESTER TEXT BOOKS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుండి 6 వరకు సెమిస్టర్ విధానంలో పాఠ్య పుస్తకాలు.  AP SCERT వారి అన్ని పాఠ్య పుస్తకాల PDF link ను మీకు అందుబాటులో

Click Here To SCERT - Academic Books (1st - 6th)  New Text Books PDF



Visakhapatnam Distict Work Adjustment Orders

విశాఖపట్నం జిల్లా కు సంబంధించి వర్క్ అడ్జస్ట్ మెంట్ ఆర్డర్ లు జిల్లా విద్యాశాఖాధికారి వారు విడుదల చేయడం జరిగింది. 

Revised Orders Issued by DEO 



10th Class Exams Fee Last Date April 5th

టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 5

 పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ అభ్య ర్థులు, అలాగే గతంలో ఫెయిలైన విద్యార్థులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రూ.50 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఏప్రిల్ 9న విద్యాదీవెన ఫీజుల చెల్లింపు

ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు చెల్లింపులు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై సమీక్ష సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 9న రీయింబర్స్ మెంట్, ఏప్రిల్ 27న వసతిదీవెన విడుదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు వేస్తున్నామని తెలిపారు. దీనిద్వారా దాదాపు 10 లక్షలమందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుందన్నారు. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50వేల వరకూ పెరుగుదల వచ్చిందని అధికారులు ఈ సందర్భంగా సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఒం గోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖమంత్రి ఆదిమూ లపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విద్యారంగంలో ఏపీ సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్‌ కళాశాలల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జేఎన్‌టీయూ తయారుచేసిన ప్రశ్నాపత్రాలు ఆయా కళాశాల్లో వినియోగించాలని సూచించారు.

నాన్‌ అటానమస్‌ కళాశాలలకూ ఇవే ప్రశ్నాపత్రాలు ఉంటాయన్నారు. పేపర్‌ వాల్యుయేషన్‌ కూడా జేఎన్‌టీయూకే అప్పగించాలని సీఎం నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థి డిగ్రీ సాధించాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని.. నైపుణ్యం లేకుంటే ముఖాముఖి పరీక్ష కూడా ఎదుర్కోలేమని చెప్పారు

గ్రామ పంచాయతీ, సచివాలయ ఉద్యోగుల విధులకు సంబంధించి కీలక మార్పులు చేస్తూ G.O.MS.No. 2 Dated: 25-03-2021 విడుదల.

పంచాయతీ సెక్రటరీ (I to V) తనకు మరియు Existing గ్రామ పంచాయతీ ఉద్యోగులకు DDO గా వ్యవహరిస్తారు.VRO సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు  వ్యవహరిస్తారు.సచివాలయ ఉద్యోగులు తమ CL ను VRO ద్వారా HOD నుంచి అప్రూవ్ చేయించుకోవాలి.పంచాయతీ సెక్రటరీకి (I to V) మరియు Existing గ్రామ పంచాయతీ ఉద్యోగులకు CL మంజూరు చేసే అధికారం సర్పంచ్ కి ఉంటుంది.

DEPARTMENTAL TESTS ::NOVEMBER 2020 SESSION NOTIFICATION

Applications  are  invited  ON-LINE  from  26.03.2021  to  15.04.2021  for  the  Departmental  Tests NOVEMBER,  2020  Session to  be  held  from  29/05/2021  to      03/06/2021.

డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Click Here TO Apply Online Application For Departmental Test


డిపార్టుమెంటల్ టెస్టు నోటిఫికేషన్ నెంబరు : 04/2021( NOV 2020 SESSION) ముఖ్యమైన సమాచారం 
ఆన్ లైన్ లో అప్లై చేయుట : 26.03.2021 నుండి 15.04.2021 వరకు
ఫీజు చెల్లించుట : 26.03.2021 నుండి 15.04.2021 వరకు
ఫీజు వివరాలు :(ప్రతి పేపర్ కి 500/- రూ.విడివిడిగా వ్రాస్తే ఈ విధంగా exam fees తో పాటుగా ప్రతి పేపర్ కి 500/-ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలి) G.O.Test : 1500/- E.O.Test : 1000/-
Spl.Language Test : 1000/-
 పరీక్షల తేదీలు: 
G.O Test (Paper Code - 88) : 31.05.2021 @ 10 AM to 12 Noon
G.O Test (Paper Code - 97) : 31.05.2021 @ 3 PM to 5 PM
E.O Test (Paper Code - 141) : 01.06.2021 @ 10 AM to 12 Noon
Spl.Language Test (Paper Code - 37) : 01.06.2021 @ 3 PM to 6 PM
పాస్ మార్కులు :ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి.(గత నోటిఫికేషన్ లో 35 మార్కులు ఉండేవి) 
నెగెటివ్ మార్కులు :లేవు

వేత‌న జీవుల‌కు రిలీఫ్‌: పీఎఫ్ వ‌డ్డీపై ప‌న్ను లిమిట్ పెంపు!

వివిధ సంస్థ‌లు, ఫ్యాక్ట‌రీల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల వార్షిక ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్‌) వ‌డ్డీపై పన్ను లిమిట్‌ను పెంచారు. ఈ మేర‌కు ఉద్యోగుల పీఎఫ్ రూ.5 ల‌క్ష‌లు కంటే ఎక్కువ జ‌మ అయిన‌ మొత్తాల‌పై వ‌డ్డీ మీద మాత్ర‌మే ప‌న్ను విధించ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. 2021 ఆర్థిక బిల్లుపై జ‌రిగిన చ‌ర్చ‌కు లోక్‌స‌భ‌లో మంగ‌ళ‌వారం ఆమె స‌మాధానం ఇచ్చారు.

బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో నిర్మ‌ల‌మ్మ ఇలా

గ‌త నెల ఒక‌టో తేదీన వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పిస్తూ నిర్మ‌లా సీతారామ‌న్‌.. ఉద్యోగుల పీఎఫ్ రూ.2.5 ల‌క్ష‌లు, అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటే, దానిపై వ‌చ్చే వ‌డ్డీ మీద ప‌న్ను వ‌డ్డించ‌నున్న‌ట్లు ప్ర‌తిపాదించారు. ఇది 2021 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని తెలిపారు. అలాగే పీఎఫ్ కంట్రిబ్యూష‌న్ పై కేవ‌లం ఒక్క‌శాతం ప‌న్ను మాత్ర‌మే వ‌సూలు చేస్తామ‌ని చెప్పారు.

ఇలా పీఎఫ్ ఖాతాల్లో న‌గ‌దు జ‌మ

అయితే, దేశంలోని ప్ర‌భుత్వ, ప్రైవేటు రంగాల్లో ప‌నిచేసేవారు ప్ర‌తి నెలా తాము సంపాదించిన మొత్తంలో కొంత సొమ్మును భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ఈపీఎఫ్ ఖాతాల్లో జ‌మ చేస్తుంటారు. ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం ఆ సొమ్మును త‌మ అవ‌స‌రాల‌కో, పిల్ల‌ల పెండ్లిండ్ల‌‌కో, చ‌దువుల‌కో వినియోగిస్తుంటారు.

వేత‌నాన్ని బ‌ట్టి పీఎఫ్ ఖ‌రారు

ఈ పీఎఫ్ సొమ్ము అనేది వ్య‌క్తి పొందే వేత‌నం, స‌ర్వీసును బ‌ట్టి ఒక్కక్క‌రికి ఒక్కోలా ఉంటుంది. అందువ‌ల్ల రిటైర్మెంట్ త‌ర్వాత కొంద‌రికి రెండు మూడు ల‌క్ష‌లు వ‌స్తే, మ‌రికొందరికి రూ.20, రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌స్తాయి. కానీ, మ‌న దేశంలోని ఒక వ్య‌క్తి పీఎఫ్ ఖాతాలో మాత్రం ఏకంగా రూ.103 కోట్లు జ‌మ అయ్యాయి.

ఇద్ద‌రి ఖాతాల్లో రూ.86 కోట్ల చొప్పున జ‌మ

రెండో స్థానంలో ఉన్న మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల పీఎఫ్ ఖాతాల్లో కూడా ఒక్కొక్కరి ఖాతాలో రూ.86 కోట్ల చొప్పున జ‌మ అయ్యాయి. దాంతో కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం ముగ్గ‌రు వ్య‌క్తులకే పీఎఫ్‌పై వ‌డ్డీ రూపంలో కొన్ని కోట్ల రూపాయ‌లు చెల్లించాల్సి వ‌స్తుంద‌ని గ‌మ‌నించింది.

టాప్‌-100 జ‌మ రూ.2000 కోట్లు

అత్య‌ధికంగా పీఎఫ్ సొమ్ము జ‌మ‌చేసిన టాప్‌-20 మంది సొమ్ము రూ.825 కోట్లు, టాప్‌-100 మంది సొమ్ము రూ.2000 కోట్లు ఉంద‌ని కూడా ప్ర‌భుత్వం లెక్క‌లు చూసింది. అయితే, త‌మ పీఎఫ్ ఖాతాల్లో అత్య‌ధిక సొమ్ము జ‌మ‌చేసిన వారి పేర్ల‌ను మాత్రం ప్ర‌భుత్వం వెల్ల‌డించలేదు.

భారీ స్వ‌చ్ఛంద సొమ్ము జ‌మ‌కు ప‌న్ను మిన‌హాయింపా?

అందుకే అంత పెద్ద మొత్తంలో డ‌బ్బును పొదుపు చేస్తున్న వారికి కూడా వ‌డ్డీపై ప‌న్ను మినహాయింపు ఇవ్వ‌డం క‌రెక్టు కాద‌ని కేంద్రం భావించింది. బ్యాంకుల్లో, పోస్టాఫీస్ ఖాతాల్లో అధిక మొత్తం జ‌మ‌చేసే వారి నుంచి వ‌డ్డీపై ప‌న్ను వ‌సూలు చేస్తూ, పీఎఫ్ ఖా‌తాలో భారీ న‌గ‌దు జ‌మ‌చేసే వారికి మాత్రం ప‌న్ను మిన‌హాయింపునివ్వ‌డం స‌మంజ‌సం కాద‌ని నిర్ణ‌యించింది.

స్వ‌చ్ఛంద డిపాజిట‌ర్ల కోసం ప్ర‌త్యేక నిధి

పీఎఫ్‌లో స్వ‌చ్ఛందంగా న‌గ‌దు డిపాజిట్ చేసేవారి కోసం ప్ర‌త్యేకించి ఒక నిధిని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు కూడా కేంద్రం ప్ర‌క‌టించింది. ఉద్యోగ భ‌విష్య‌నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో స్వ‌చ్ఛందంగా చేరే కొత్త స‌బ్‌స్క్రైబ‌ర్ల కోసం ఈపీఎఫ్‌వో ఆధ్వ‌ర్యంలోనే ప్ర‌త్యేక నిధిని కేంద్రం ఏర్పాటు చేయ‌నున్న‌ది.

పీఎఫ్ వ‌డ్డీరేట్ల‌లో తేడాలు.

అందుకే వివిధ సంస్థ‌ల్లో ప‌నిచేస్తూ ఈపీఎఫ్‌వోలో స‌భ్యులుగా చేరిన వారికి, స్వ‌చ్ఛంద స‌భ్యులు జ‌మ చేసిన మొత్తం నిధికి ఒకే వ‌డ్డీరేటు వ‌ర్తించ‌బోదు. స్వ‌చ్ఛంద స‌భ్యుల కోసం ఈపీఎఫ్‌వో ప్ర‌త్యేక నిధిని త్వ‌ర‌లో ప్రారంభించే తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని కేంద్ర అధికార వ‌ర్గాలు తెలిపాయి.

Salary bills for March.2021 will be created from tomorrow i.e.,25.03.2021 onwards with bill id starting from 2021

మార్చి నెల జీతం బిల్లులు రేపటి నుంచి సబ్మిట్ చేయబడతాయి. 

Declaring single session schools from 1st April 2021 to 31st May 2021 in case of classes I to IX and till 15.06.2021 in case of Class X (including exams) Memo No. 1182072/Prog. II/A1/2021 Dated:24/03/2021

ఒంటిపూట బడుల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల.

SCERT - AYU SAMVAD campaign to make people aware about Ayurveda for Covid - 19 pandemic

కరోనా మీద అవగాహన కార్యక్రమాలలో పాల్గొనాలని కమీషనర్ వారి ఉత్తర్వులు



PD account BILLS ADMISSION FOR THE FY.2020.21 IS CLOSED NOW.

స్కూల్ గ్రాంట్ లకు సంబంధించి ప్రస్తుతానికి PD అకౌంట్లు ద్వారా బిల్లులు సబ్మిట్ చేయడానికి వీలు లేదు. తర్వాత అవకాశం ఉండవచ్చు.


EHS smart Health cards issued for employees and Pensioners

త్వరలో ఉద్యోగులకు మరియు Pensioners కు QR కోడ్ తో ఉన్న EHS స్మార్ట్ హెల్త్ కార్డ్స్ ను STO ల ద్వారా ఇవ్వనున్నారు.



CFMS Password Reset OTP Issue Solved.OTP ఇప్పుడు వస్తున్నాయి.

ఎట్టకేలకు సి.ఎఫ్.ఎం.ఎస్ పాస్వర్డ్ రీసెట్ ఓటీపీ లు టెక్నికల్ అంశాలను సరిచేసిన ఏపిసిఎఫ్ ఎస్ ఎస్ సిబ్బంది.

Click Here To Reset Your Password 

APOSS-SSC & INTER TIME TABLE,JUNE 2021

ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ 10వ తరగతి, ఇంటర్ మీడియేట్ పరీక్ష లకు సంబంధించి టైమ్ టేబుల్ ను విడుదల చేయడం జరిగింది. 

కరోనా ఉద్ధృతి.. కేంద్రం నూతన మార్గదర్శకాలు

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి మళ్లీ కొనసాగుతున్న వేళ కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు, ట్రేసింగ్‌, చికిత్సపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నూతన మార్గదర్శకాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్‌ 30 వరకు ఇవి వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది. 

కేంద్రం మార్గదర్శకాలివే..

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలి. పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించాలి. ఆ తర్వాత వారు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్‌ చేపట్టాలి. 

పాజిటివ్‌ కేసులను బట్టి కంటోన్మెంట్‌జోన్‌లను ప్రకటించాలి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో పొందుపర్చాలి. కంటోన్మెంట్‌ జోన్‌లలో ఇంటింటి సర్వే చేపట్టి పరీక్షలు చేయాలి.

బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రద్దీప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు చేపట్టాలి. మాస్క్‌లు, సామాజికదూరం పాటించేలా చూడాలి. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిపై అవసరమైతే జరిమానా వంటి చర్యలు కూడా తీసుకోవచ్చు.

స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించుకోవచ్చు. 

అయితే రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. వ్యక్తులు, సరకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు అవసరం లేదు. 

కంటోన్మెంట్‌ జోన్‌ వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంది. అయితే ప్రయాణికుల రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, స్కూళ్లు, విద్యాసంస్థలు, హోటళ్లు, రెస్టారంట్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్‌ సెంటర్లు తదితర వాటిల్లో మాత్రం నిర్దేశిత ప్రమాణాలు(ఎస్‌ఓపీలు) అమల్లో ఉంటాయి. వీటికి లోబడే కార్యకలాపాలు నిర్వహించేలా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. 

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను భారత్‌ ప్రారంభించింది. అయితే ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి చైన్‌ను విడగొట్టాలంటే టీకానే ఆధారం. అందువల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టిపెట్టాలి. అర్హులైన వారందరూ టీకా వేయించుకునేలా చూడాలి.

PUBLIC SERVICE - MA&UD Dept. – Certain Inter-management Transfers of teachers working under ZPP/MPP Management transfer to Urban Local Bodies concerned in the State G.O.RT.No. 123 Dated: 23-03-2021

రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఉపాధ్యాయులను మండల, జిల్లా పరిషత్ యాజమాన్యం నుండి మున్సిపాలిటీలకు మరియు కార్పొరేషన్ పాఠశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల. బదిలీ పొందిన ఉపాధ్యాయుల జాబితా.

Schedule for Running of schools from 1st April to 16th June'2021 released by SCERT, Andhra Pradesh,Amaravathi.

Ap లో పాఠశాల లు  1 నుండి 9వ తరగతి వరకు మే 15 వరకు, 10వ తరగతి వారికి జూన్ 16 వరకు నిర్వహణ 



Half Day School Time Table Primary School,Upper Primary ,High Schools in AP

ఏప్రిల్ 1 నుండి రాష్ట్రం లోని పాఠశాలలో Single Session Time Table.

ఒంటిపూట బడులు పాఠశాల వేళలు:ఉదయం 7.45 గం. నుండి మధ్యాహ్నం 12.30గం.లవరకు

కాలనిర్ణయ పట్టిక

మొదటి గంట 7.45 am

స్కూల్ అసెంబ్లీ : 7.50-8.00

మొదటి పీరియడ్ :8-00 to 8.45 am

రెండవ పీరియడ్ :8-45 to 9.25 am

మంచినీటి విరామం : 9.25 to 9.30 am

మూడవ పీరియడ్ : 9.30 to10.10 am

స్వల్ప విరామం : 10.10 to 10.25 am

నాల్గవ పీరియడ్ :10.25 to 11.05 am

ఐదవ పీరియడ్ :11.05 to11.45 am

మంచినీటి విరామం : 11.45 to 11.50 am

ఆరవ పీరియడ్ :11.50 to 12.30 Pm.                            భోజన విరామం : 12.30 pm


Single Session Schools From April 1st

 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి ప్రకటన

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు.1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు.

ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం.

పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలి.

ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం.

పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు.

విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి సురేష్.

CFMS HELPDESK PHONE NUMBERS FOR RESET PASSWORD

ఈ క్రింది  ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి మన cfmsno password కోసం రిక్వెస్ట్ చేసుకోగలరు

1Dhanunjay 

Cell.6309037001     Srikakulam

2K.Chaitanya

Cell.6309037008.       Guntur

3 Harish 

Cell.6309037004        Eastgodari

4  Vijaya Bhaskar 

Cell.6309037005.      Westgodari

5 Md.Mb Shareef 

Cell.6309037006.         Krishna

6 Kartheek 

Cell.6309037003.          Vaijag

7Gopi Tumma 

Cell.6309037009      Prakasam

8 Phani Jeedigunta 

Cell.6309037010.          Nellor

9 Mahendra Reddy

Cell.6309037011.         Karnul

10 CRavindra Reddy

Cell.6309037013.       Anantapur

11 Dwarakanath 

Cell.6309037014.          Chittor

12 Murali Ponna        kadapa

Cell.6309037012

13 Ravi Teja 

Cell.6309037002     vijaynagarm

45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో త్వరలో కేంద్ర సర్కారు నిర్ణయం 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు.

దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం సాధారణ ప్రజల్లో 60 ఏళ్లు పైబడినవారికి, 45-59 ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే కొవిడ్‌ టీకాలను ఇస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతమున్న పరిమితిని సడలించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. 
ఇటీవల ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన దృశ్య మాధ్యమ సమీక్షలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకొచ్చాయి. కరోనా వైరస్‌ రెండోదశ దేశమంతటా విస్తరించకముందే.. ముందస్తు చర్యల్లో భాగంగా తాజా ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తొలిడోసు పొందిన వృద్ధులు 2,41,948 మంది రాష్ట్ర సర్కారు సమాచారం ప్రకారం ఈనెల 18న.. 60 ఏళ్లు పైబడినవారు 19,524 మంది తొలిడోసు పొందగా.. 45-59 ఏళ్ల మధ్యవయస్కుల్లో రోగులు 9,981 మంది టీకాలను స్వీకరించారు. వృద్ధులు 2,41,948 మంది తొలిడోసు పొందారు. తాజాగా మరో 936 మంది వైద్యసిబ్బంది, 817 మంది పోలీసులు, రెవెన్యూ ఇతర ఉద్యోగులు తొలిడోసు టీకాను పొందగా.. మొత్తంగా ఇప్పటి వరకూ తొలిడోసు పొందినవారిలో 2,12,162 మంది వైద్య, 1,06,240 మంది రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో వైద్యసిబ్బంది, పోలీసులు, ఇతర ఉద్యోగులు కలుపుకొని సుమారు 6 లక్షల మంది ఉంటారని అంచనా. 60 ఏళ్లు పైబడినవారు సుమారు 54 లక్షల మంది, 45-59 ఏళ్లు పైబడినవారు 40 లక్షల మంది ఉంటారని వైద్యశాఖ లెక్క చెబుతోంది.

రాష్ట్రం లో నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో వడగా ల్పులు తీవ్రంగా వీచే అవకాశముందని విపత్తుల నిర్వ హణ శాఖ హెచ్చరించింది. 62 మండలాల్లో 42.5-43,5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. భా రత వాతావరణ శాఖ ఈ మేరకు వెల్లడించినట్టు పే ర్కొంది. శ్రీకాకుళం జిల్లా భామిని, తూర్పుగోదావరి జి ల్లా అడ్డతీగల, రాజవొమ్మంగి, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయ ని తెలిపింది.

కోస్తా లోని మరో 58 మండలాల్లో 39-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. వడ గాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ముందు జా గ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూ చించింది. కాగా రాష్ట్రం మీదుగా ఈశాన్య, తూర్పు గా లులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో అక్కడ క్కడ వర్షం లేకుండా ఉరుములు, మెరుపులు రావచ్చ ని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. శుక్రవారం రాయలసీమ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు 36-37 డిగ్రీలు కోస్తాంధ్రలో 33-35 డిగ్రీలు, మిగిలిన ప్రాంతాల్లో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

MEDICAL REIMBURSEMENT FACILITY EXTENDED UP TO JULY 2021

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  మెడికల్ రియంబర్స్ మెంట్ సౌకర్యాన్ని జూలై 2021 వరకు పెంచుతూ జీవో విడుదల చేసింది. 

Visakhapatnam District - Baseline Assessment levels entry for all Primary, Upper Primary, High School

విశాఖపట్నం జిల్లా లో మార్చి 16, 2021 వ తేదీ నుండి We Love Reading లో భాగంగా గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్వహించిన Baseline assessment survey యొక్క వివరాలను కింద ఇచ్చిన గూగుల్ ఫారం లలో నమోదు చేయవలసిందిగా తెలియచేస్తున్నారు.

High schools కు, Upper  Primary  schools  కు మరియు Primary  schools  కు వేరువేరు గా లింక్ లు ఇవ్వబడినవి అని గమనించగలరు. 

Baseline Assessment levels entry links for Visakhapatnam District:

High schools - Baseline Assessment Report in Visakhapatnam District

Upper Primary schools - Baseline Assessment Report in Visakhapatnam District

Primary schools - Baseline Assessment Report in Visakhapatnam District

వివరాలు నమోదు చేసినప్పుడు గతసారి 9 వ తరగతికి నిర్వహించిన విద్యార్థుల వివరాలు కూడా కలిపి ఇవ్వగలరు. 

Upper  Primary  పాఠశాలలో 8  వ తరగతి లేకపోయినచో ఆ వివరాలు "౦" (సున్నా గా ) చూపించగలరు.

Last date for submission of Visakhapatnam Google forms in the above links is 21.03.2021

గమనిక: ప్రతీ తరగతికి సంబందించిన పిల్లల స్థాయిలను CSE website లో తప్పనిసరిగా నమోదు చేయాలి.

Baseline Assessment కు సంబంధించి విద్యార్థుల సామర్థ్యాల స్థాయి నమోదు వెబ్ సైట్ లింక్..

https://schooledu.ap.gov.in/SIMSSERVICES21/baselineAssessmentService08022021.htm

Last date for submission of student wise assessment details in CSE site is 20.03.2021 only

 UP Schools Baseline Assessment link:

https://forms.gle/MZcwCQWE8HAZn5fQ6

[19/03 3:35 pm] Crp Revidi: Primary Schools Baseline Assessment link:-

https://forms.gle/JbzFmcjywFvprovZ6

కోవిడ్ నిబంధనలు.. ఏపీ సర్కార్ కొత్త ఆదేశాలు

భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కోవిడ్ పెరుగుతూ వస్తున్నాయి.దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరోసారి కోవిడ్ నిబంధనలు అమలు చేసే విషయంపై సీరియస్‌గా దృష్టిసారించింది.ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని అమలు చేయాలని మరోమారు ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్.కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకాశం ఉన్నంత మేర వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరో మారు అవలంభించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిశ్రమలు, దుకాణ సముదాయాలు, ఫ్యాక్టరీల్లో నియంత్రణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

రవాణా వాహనాలు, యంత్రాలు, ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు వైరస్ రహితంగా చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం శానిటైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టాల్సిందిగా స్పష్టం చేసింది. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, దుకాణాల్లోకి ప్రవేశించే సమయంలో థర్మల్ స్కానింగ్ చేయాల్సిందిగా సూచనలు చేసింది. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం విధిగా పాటించేలా చూడాలని స్పష్టంగా తెలిపింది. డైనింగ్ హాళ్లు, క్యాంటీన్లలో ప్రతీ రెండు గంటలకూ శానిటేషన్ చేయాల్సిందిగా ఆదేశించిన సర్కార్. ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించేందుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.

Gr 2 HM Transfers Orders Released

ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిన టువంటి గ్రేడ్ II ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఉత్తర్వులు జనరేట్ అవుతున్నాయి.

Click Here To DOWNLOAD Transfers Orders Gr 2 HM 

మొట్టమొదటగా అనంతపురం జిల్లాలో ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వరుసగా మిగిలిన జిల్లాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి జిల్లాల్లో కోడ్ ముగిసిన తర్వాత బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడతాయి..

UPDATED DIKSHA APP Latest Android App 3.7.736

Updated దీక్షా యాప్  version 3.7.736 అప్డేట్ వచ్చినది. కావున  ఉపాధ్యాయులు అందరూ మీయొక్క దీక్ష యాప్ అప్డేట్ చేసుకోండి.

Click Here To Download Latest Updated DIKSHA APP

❖ అప్డేటెడ్ డేట్ ::- April 20

❖ అప్డేట్ వెర్షన్ ::- 3.7.736

న్యూ వెర్షన్ లో బ్లాంక్ సర్టిఫికేట్ ప్రాబ్లం పరిష్కరించబడింది.

అలాగే దీక్ష యాప్ లో నిష్ట ట్రైనింగ్ కి సంబంధించిన కోర్సు లను వెతకడము కోసం క్రింది వివరాలు చూడండి. 



Ap Teacher Eligibility Test (TET) Guidelines Released

టెట్ మార్గదర్శకాలు విడుదల .

రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ టెట్) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవు తోంది. అందుకోసం టెట్ మార్గదర్శకాలతో కూడి న ఉత్తర్వులను బుధవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ విడుదల చేశారు ఈ పరీక్ష పూర్తి కంప్యూటర్ బేస్ గా ఉండనుందని జీవోలో స్పష్టం చేశారు.

1 నుంచి 5వ తరగతులకు (పేపర్- 1), 6 నుంచి 8 తరగతులకు(పేపర్- 2) విడివిడిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెట్ కు సంబంధించిన అర్హత మార్గదర్శకాలను పేపర్ల వారీగా విడివిడిగా వివరించారు. పేపర్-1ఎ, 1బి పేపర్- 2ఏ, 2బి 150 మార్కుల చొప్పున ఉంటా యని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ పరీక్షలు ఇంగ్లి ష్, అభ్యర్థులు ఎంచుకున్న లాంగ్వేజ్-1 భాషల్లో ఉండనున్నాయి. జనరల్ అభ్యర్థులు కనీసం 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ విభిన్నప్రతిభావంతులు, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు

టెట్ కమిటీ ఏర్పాటు

టెట్ నిర్వహణ కోసం ఐదుగురితో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్ గా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, మెంబర్ కన్వీనర్ గా టెట్ జాయింట్ డైరెక్టర్, మెంబర్లుగా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, ప్రభుత్వ పరీక్షల సంచాల కులు, జాయింట్ డైరెక్టర్(సర్వీసెస్) వ్యవహరించ నున్నారు. అలాగే టెట్ సెల్ లో టెట్ కన్వీనర్, డిప్యూ టీ కమిషనర్‌ స్థాయి అధికారి, అసిస్టెంట్ కమిషనర్ లేదా డైరెక్టర్ స్థాయి అధికారి, సూపరింటెండెంట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉంటారని, కమిటీ సూచనల మేరకు ఈ సెల్ పని చేయాలని సూచిం చారు. ఆరు నెలలలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: సీఎంల సమావేశంలో మోదీ సంచలన వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సీఎంలకు ప్రధాని కీలక సూచనలు చేశారు. అందరూ మరోసారి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో, అవసరమైన ప్రతి చోట మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలను భయాందోళనలకు గురి చేయవద్దని చెప్పారు. జనాలు భయపడే వాతావరణాన్ని సృష్టించవద్దని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు, మరికొన్ని చర్యలు తీసుకుందామని చెప్పారు.

కరోనా సెకండ్ వేవ్ ను అనేక దేశాలు చూస్తున్నాయని... మన దేశం కూడా ఆ జాబితాలోకే వస్తుందని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కేసులు పెరిగిపోయాయని... పలు రాష్ట్రాల సీఎంలు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని అసహనం వ్యక్తం చేశారు. సుపరిపాలన అందించడానికి మనందరికీ ఇదే సరైన సమయమని అన్నారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుదామని... ఇదే సమయంలో అతి ఆత్మవిశ్వాసం పనికిరాదని చెప్పారు.

ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్న జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. దేశ వ్యాప్తంగా 70 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. మనం అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా మరోసారి పంజా విసురుతుందని హెచ్చరించారు. త్వరితగతిన అన్ని చర్యలను చేపట్టాలని సూచించారు.

CSE wrote to letter To govt for permission to implement Notional Seniority From 1.11.2002 to Teachers SGTs who lost promotions in 2002 due to merit basis seniority lists .

2002 ప్రమోషన్ లో నష్టపోయిన వారికి నోషనల్ సీనియారిటీ ని వర్తింపచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన CSE

Visakhapatnam Distict DEO sir Issued Transfers Orders for Court Case teachers

విశాఖపట్నం జిల్లా లో జీవీఎంసీ లోకోర్టుకు వెళ్లిన ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు.

ESR Verification at sub Treasury Officers

ESR సబ్ ట్రెజరీ స్థాయిలు వెరిఫికేషన్ చేసే సమయంలో ఈ క్రింది అంశాలు చెక్ చేస్తారు.కావున ఉపాధ్యాయులు ఉద్యోగులు వీటిని పరిశీలించుకుంటే మంచిది.

1. ఉద్యోగి పేరు ఎస్ ఆర్ నందు ఏ విధంగా నమోదు కాబడి ఉన్నది.

2. ఉద్యోగి పుట్టిన తేదీ

3. సర్వీసులో చేరిన తేదీ

4. ఉద్యోగి కులము

5. ఉద్యోగి విభిన్న ప్రతిభావంతుల తరగతులకు చెందిన వాడా

6. ఉద్యోగి ఆఖరు మూల వేతనం ఫ్లై లీఫ్ ఆధారంగా క్రాస్ చెక్ చేస్తారు

7. ఉద్యోగి ఎస్ ఆర్ అప్లోడ్ చేసే నాటికి అతని ఖాతాలో ఉన్న సంపాదిత సెలవు మొత్తం ఎంత అనేది పరిశీలిస్తారు

8. అర్ధ వేతన సెలవు అప్లోడ్ చేసే నాటికి అతని ఖాతాలో ఉన్న మొత్తమును పరిశీలిస్తారు.

ఆ వివరాలన్నీ యు ట్రెజరీ అధికారి పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత అతను బయోమెట్రిక్ ఆధారంగా ధృవీకరించారు అప్పుడు మాత్రమే ఉద్యోగులకు సంబంధించిన వివరాలు HCM ప్యాకేజీ లోకి మారతాయి

Some Banks Passbook and Check Books are not Acceptable

ఏప్రిల్ నుంచి ఈ బ్యాంకుల పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు చెల్లవు.

 కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం(ఏప్రిల్ 1) నుంచి బ్యాంకుల విషయంలో పలు అంశాలు మారబోతున్నాయి. ఈ క్రమంలో... ఆయా బ్యాంకుల పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు పని చేయవు. ఇంకా కొన్ని అంశాలు కూడా మారబోతున్నాయి.

ఇక ఏయే బ్యాంకులకు సంబంధించిన నిబంధనలు మారతాయంటే.

యునైటెడ్ బ్యాంక్, విజయా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్,  ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్ వంటివి విలీనమయ్యాయి. ఈ బ్యాంకులకు సంబంధించిన  పాస్‌బుక్స్, చెక్‌బుక్స్ ఏప్రిల్ నుంచి పని చేయబోవు.

ఇక చెక్ బుక్స్, పాస్‌బుక్స్ మాత్రమే కాకుండా ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కూడా మారనున్నాయి. కాగా... ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాక్ వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. 

కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వంటివి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి. ఇక అలహాబాద్ బ్యాంక్... ది ఇండియన్ బ్యాంక్‌లో విలీనమైంది. బ్యాంకులు వాటి కస్టమర్లకు ఈ విషయాన్ని ఇప్పటికే సమాచారమిచ్చాయి.

Ap 10th Class Annual Exams Time Table Released

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) :

జూన్‌ 7(సోమవారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 8( మంగళవారం): సెకండ్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 9(బుధవారం): ఇంగ్లీష్‌

జూన్‌ 10(గురువారం): గణితం

జూన్‌ 11(శుక్రవారం): ఫిజికల్‌ సైన్స్‌

జూన్‌ 12 (శనివారం): బయోలాజికల్‌ సైన్స్‌

జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్

Navodaya Entrance exam postponed from April 10th to May 16th 2021

నవోదయ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను మార్చడం జరిగింది. ఏప్రిల్ 10 న జరగవలసిన పరీక్ష ను మే 16 కు మార్పు చేయడమైనది. 

Teachers are Not Meet any Political Party Leaders and Higher Authority Officers

ఉపాధ్యాయులు నేరుగా రాజకీయ నాయకులను, ఉన్నతాధికారులను అప్రోచ్ అవ్వకూడదు.ఈ ఆదేశాలు తూచా తప్పకుండా తమ పరిధిలోని ఉపాధ్యాయులు పాటించేలా చూడాలని సి.ఎస్.ఈ ఆదేశాలు.


All India SAINIK School Examinations Result

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు 2021 ను విడుదల చేయడం జరిగింది .

Baseline Test for students Studying Class 3rd to 9th Upload Students Levels in cse Website

అన్ని పాఠశాలల చదవడం మాకిష్టం కార్యక్రమం లో చేయవలసిన కార్యక్రమం ల పూర్తి వివరాలు.  ప్రారంభ  పరీక్ష అయిన తరువాత విద్యార్థులు యొక్క  స్థాయిలను కింది లింక్ లో అప్లోడ్ చేయవలసి ఉంది.

Click Here To Upload Students Levels 







Guidelines issued for AYA Appointment in schools Engaging of Sanitary workers in the Government Schools / Junior Colleges G.O.MS.No. 22 Dated: 12-03-2021

స్కూల్స్ లో ఆయాల నియామకానికి మార్గదర్శకాలు G.O.MS.No.22 , Dt : 12.03.2021 విడుదల.

➪ 60 ఏళ్ళు దాటిన వారికి నో చాన్స్

➪ నెలకు 6000 వేలు చొప్పున 10 నెలల పాటు గౌరవ వేతనం

➪ మిగిలిన రెండు నెలలకు 3000 చొప్పున గౌరవ వేతనం

➪ మొదటి ప్రాధాన్యత స్కూల్లో చదివే విద్యార్థి తల్లికే

Second Saturday is working Day for MUNCIPAL Elections Schools

రెండవ శనివారం పని దినం - ఉత్తర్వులు విడుదల 13.03.2021 2nd Saturday is a Working Day. ఇది మునిసిపల్ ఎన్నికల రోజు స్థానిక సెలవు ఇచ్చిన వారికి మాత్రమే.

Foundational reading Literacy skills - Communication of the format in Google Link to obtain the list of suitable library books for students & teachers -Orders-Issued

ప్రతి పాఠశాల కు అవసరమైన లైబ్రరీ పుస్తకాలు కొరకు వివరాలు గూగుల్ పామ్ లో అప్లోడ్ చేయాలి. 

Department of School Education, Andhra Pradesh has taken initiation for the strengthening of school libraries with suitable books for students and teachers. For this purpose, we need to obtain the list of suggestive library books from the stakeholders in the given google form.

Click Here To SUBMIT DATA IN State Google link: 

Dept of School Education and Samagra Shiksha,

2021-22 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించు జగనన్న విద్యా కానుక కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల విడుదల

జ‌గ‌న‌న్న విద్యా కానుక.ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి టెన్త్ విద్యార్థుల‌కు కిట్స్.2021-22 విద్యా సంవత్స‌రం ప్రారంభ రోజునే పంపిణీ. రూ 736 కోట్ల అంచ‌నా వ్య‌‌యానికి ఆమోదం . వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం 2021-22 ప్రారంభ రోజున వివిధ ప్రాథ‌మిక‌, మాధ్య‌మిక , ఉన్న‌త పాఠ‌శాల విద్యార్థుల‌కు ఉప‌యోగప‌డే కిట్స్‌తో పాటు  ఉన్న‌త పాఠ‌శాల విద్యార్థుల‌కు  డిక్ష‌న‌రీని అందించనున్నారు.

2. అందుకోసం రూ 736 కోట్ల మేర నిధుల‌ను  వెచ్చిస్తున్నారు. ఒక్కో కిట్‌లో మూడు జ‌త‌ల దుస్తులు., బెల్ట్‌, స్కూలు బ్యాగు, పాఠ్య పుస్త‌కాలు, నోటు పుస్త‌కాలు, రెండు జ‌త‌ల షూస్‌, రెండు జ‌త‌ల సాక్స్‌, బెల్టు, బ్యాగుంటాయి.

3. ఈ ప‌ర్యాయం  ఉన్న‌త పాఠ‌శాల  చ‌దువులు చ‌దివే విద్యార్థుల‌కు  ఒక డిక్ష‌న‌రీని కూడా అందించ‌నున్నారు. కిట్స్ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌గిన కాంట్రాక్టు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. 

4. కిట్స్‌ను ప్ర‌భుత్వ‌, ఎంపీపీ, మునిసిప‌ల్‌, రెసిడెన్షియ‌ల్‌, సంక్షేమ శాఖ ఆశ్ర‌మ  పాఠ‌శాల‌, ఎయిడెడ్, మోడ‌ల్ పాఠ‌శాల‌ల‌, కేజీవీవీ, రిజిస్ట‌ర్డు మ‌ద‌ర‌సాస్ విద్యార్థులంద‌రికీ  పంపిణీ చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. 

5. జ‌గ‌న‌న్న విద్యా కానుక ప‌‌థ‌కం కింద వీటి  పంపిణీకి కిట్స్ వ‌స్తువుల‌ను సేక‌రించాల‌ని ప్ర‌భుత్వం ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించింది.

Cse proceedings on Teachers Request Transfers

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ కొందరు DEO లు / ఉపాధ్యాయులు తాము బదిలీ కాబడిన స్థానం నుండి మరొక స్థానం నకు బదిలీ కోరుతూ  తన కార్యాలయమునకు ప్రతిపాదనలు పంపుచున్నారనియూ.

కావున ఇకపై అట్లు ఎవరైనా ఉపాధ్యాయులు తమను బదిలీ చేయవలసిందిగా సిఫార్సులు / ప్రతిపాదనలు పంపినట్లయితే... సదరు సిఫార్సులు /  ప్రతిపాదనలు తన కార్యాలయమునకు పంపవలదనీ.

2020-21 సంవత్సరానికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినందున (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కారణంగా ఆగిపోయిన బదిలీలు మినహా) వారిని బదిలీ చేయాజాలమని వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయవలసిందిగా అందరు RJD SE / DEO లను కోరుతూ DSE AP శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు మెమో జారీ చేసారు

Public Services-A.P. Fundamental Rules – Extension of five (5) days additional casual leave facility to all the Women employees working in the State Government – Orders

మహిళా ఉద్యోగులు అందరికీ సంవత్సరానికి 5 రోజుల స్పెషల్ CL మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.పూర్తి వివరాలు.

Examinations Fee Collect RC. No. 149/J/-2/2021 dt 10-3-2021 10th Class Annual Examinations conduct in June

10 వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు ను 20-3-2021నుంచి చెల్లించడానికి నోటిఫికేషన్ జారీ చేసిన విద్యాశాఖ.

EHAZAR APP in PlayStore

ఉపాద్యాయులకు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం కొత్త APP ను ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచారు. క్రింది లింకును క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు. 

Click Here To Download Update E-HAZAR in Play Store 

Base line Assessment for Classes III - IX - Certain instructions Issued

3 నుండి 9 వ తరగతి వరకు విద్యార్థులకు బేస్ లైన్ పరీక్ష ను నిర్వహిచాలని ఉత్తర్వులు. పరీక్ష నిర్వహణకు సంబంధించి సూచనలు. 

The Head Master shall take one copy of assessment tool and data capturing formats in printed form for each class. Data capturing formats are available in the given website. . The Head Master/ any nominated Teacher conduct the assessment of all Students of Class III-VUI of respective Schools. , The respective Class Teacher shall prepare the Student Assessment data sheet attached and thereafter fill up the same in consolidated school report card. . The captured class wise/ student wise assessment data shall be uploaded in the online platform by using school login at https //schooledu ap.gov.in/SlirSSERVlCES2l / . Visit the website login by entering school username and password, select services> select Baseline marks entry > enter child ID and start entering student assessment levels. . Necessary records of class wise/ student wise assessments shall be properly maintained.

Latest E Hazar Biometric App for Teachers

న్యూ వెర్షన్ బయోమెట్రిక్ SE EHAZAR app. దీని ద్వారా మాత్రమే టీచర్స్ బయోమెట్రిక్  నమోదు చేయవలెను. ఈ యాప్ ప్లే స్టోర్ లో లభించదు. క్రింది లింకును క్లిక్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకో వలెను.

Click Here To Download Latest Version E-HAZAR App 

Old version 

Click Here To Download Latest E Hazar App


JEE Main Result 2021 Released

JEE Mains(జేఈఈ మెయిన్)‌-2021 ఫలితాలను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) విడుదల చేసింది. 

Click Here To Download Score Card, Cutoff Marks & All India Rank Downlod

ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నాలుగు రోజులపాటు పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 6.61 లక్షల మంది జేఈఈ మెయిన్‌-2021కు హాజరయ్యారు. ఇందులో 6.20 లక్షల మంది వరకు పేపర్‌-1 రాశారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర మంది ఉన్నారు.

ఈసారి పరీక్ష రాసిన విద్యార్థులకు అడ్మిషన్‌ సమయంలో వెసులుబాటు కల్పించింది. జేఈఈ మెయిన్‌ -2021 క్వాలిఫై అయిన విద్యార్థులు మార్కులతో సంబంధం లేకుండా క్లాస్‌ 12 ఉత్తీర్ణులైన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. కరోనా కారణంగా కేవలం 2021-2022 సంవత్సరానికే ఇది వర్తిస్తుందని తెలిపింది. 


G.O.RT.No.97 Dt:06-03-2021 MA&UD Department - Ordinary Elections to Urban Local Bodies – Payment of remuneration to polling and counting personnel drafted on election duty to the Urban Local Bodies

మునిసిపల్ కి సంబంధించి ఎన్నికల సిబ్బందికి ఇచ్చే పారితోషకం యొక్క వివరాలను విడుదల చేయడమైనది. 

జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం.ప్రతి విద్యార్థికీ పుస్తకాలు అందిస్తాం.ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్

రాష్ట్రంలో జులై ఒకటో తేదీ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యాశాఖలపై ప్రత్యేక దృష్టిసారించి, అనేక పథకాలు ప్రారంభించడం వల్ల 2021- 21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు చేరారని వివరించారు. ఊయవాడలోని ఆర్ అండ్ బీభవన సముదాయంలో లదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజశేఖర్ పలు అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యమైందని, పది పదిహేను రోజుల్లో మిగిలిన విద్యార్థులకు కూడా అందజేస్తామని, ఎవరూ బయట కొనవద్దని సూచించారు. సాధారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్న విద్యార్థుల యూడైస్ డేటా ఆధారంగా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల ఇండెంటి ను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఆ ప్రకారం 2010- 211 నాటికి ఉన్న బక్షం 7 వేల 154 మంది విద్యార్థుల సంఖ్యకు " శాతం అదనంగా 10 లక్షల 12 వేల || మందికి పుస్తకాలు సిద్ధం చేశామని రాజశేఖర్ వివరించారు. ఏటా ఏప్రిల్ నాటికి పుస్తకాలు ముద్రించి, మే 11 నాటికి అన్ని జిల్లాల్లోని పుస్తకాల డిపోలకు చేర్చడం ఇరుగుతుందని, ఈసారి మాత్రమే జూన్ 12 నాటికి పాఠ్య పుస్తకాలు ముద్రించి అందుబాటులో ఉంచడం జరిగిందని, అయితే కరోనా కారణాల వల్ల నవంబరు 2 వరకు పాఠశాలలు ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. అక్టోబర్ 8న జగనన్న విద్యాభానుకలో భాగంగా పాఠ్య పుస్తకాలు, చర్క బుక్స్ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ మూడో తేదీ డేటా ప్రకారం పాఠశాలల్లో ముద్రించిన వస్తరాల సంఖ్య కన్నా 7 వేల 11 మంది విద్యార్థుల సంఖ్య అదనంగా ఉందని గుర్తించామని స్పష్టం చేశారు..

బడులు తెరిచాక కూడా చేరారు

2020 - 21 విద్యాసంవత్సరంలో జగనన్న అమ్మ ఒడి కోసం విద్యార్థుల వివరాలను ఆపడేట్ చేయగా డిసెంబర్ 19 నాటికి 43లగ్లం 88 వేల 952 మంది విద్యార్థులు చేరినట్లు గుర్తించామని, రాజశేఖర్ వివరించారు. గతేడాది డేటాకు అదనంగా 5 శాతం కలి పిన తర్వాత అదనంగా 2 లక్షల 97 వేల 138 మంది చేరారని, ఈ ఏ కాది మార్చి 1వ తేదీకి ఈ సంఖ్య మరింత పెరిగి 45 లక్షల వేల 4418 చేరుకుందని పేర్కొన్నారు.దీంతో ముద్రించిన పార్యపుస్తకాలనంఖ్యకన్నాశీ లక్షల! వేల 427 ఎక్కువగా తేలిందన్నారు. వీరిలో అత్యధిక శాతం మంది బడులు తెరిచిన తర్వాత ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు తరలి వచ్చినట్లు గుర్తించామని వివ రించారు. అదనంగా చేరిన విద్యార్థుల సంఖ్య సాధారణ అంచ నాలను దాటిపోవడం వల్ల కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయవలసిన అవసరం ఎర్పడిందని పేరొ్కో న్నారుఅందుకోసం మరిన్ని పాఠ్య పుస్తకాల ముద్రణకు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. అధనంగా 4లక్షల 11 వేల 427 మందికి సరిపడా పుస్తకాలు, వర్క్స్ మిక్స్ కోసం టెండర్ పూర్తి చేశామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రా ధాన్యం జస్తూజగనన్నవిద్యాకానుక జగనన్న అమ్మ డి, మనబడి 2అమ్యఒకి,/ నాడు. వేడు" వంటి పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల వారా వరణాన్ని సమూలంగా మార్చడంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభు త్వ పాఠశాల్లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు ఈ ఏడాది ఎదురైన పరిస్థితుల దృష్ట్యా రామన్న విద్యా సంవత్స రానికి ఇప్పటి నుంచే చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. సమా వేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్ష ఎస్పీడీ వెట్రివేల్వ, ఒకీకి మధుసూదన్ పాల్గొన్నారు.

Featured post

Ap open school 10th Class and intermediate results