APTF VIZAG: సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వోద్యోగులకు బంపరాఫర్ అందిస్తున్నది.లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను సిబ్బంది కోసం కొనుగోలు చేయనున్నది.

తాజాగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుక్కోవాలని ఆసక్తి చూపుతున్న ప్రభుత్వోద్యోగులకు జగన్ ప్రభుత్వం చేయూతనివ్వనున్నది.

ఈఈఎస్ఎల్‌తో ఏపీ సర్కార్ జట్టు.ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌)తో ఏపీ సర్కార్ జత కట్టింది.

భారీగా ఈవీ టూ వీలర్స్‌ను ప్రభుత్వోద్యోగులకు సరఫరా చేసేందుకు సంబంధిత మోటారు సైకిళ్లు-స్కూటర్ల తయారీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నది.

ఆకర్షణీయ వాయిదాల్లో ఇలా టూ వీలర్స్.పథకం కింద ఈవీ టూ వీలర్స్ పొందిన వారికి తక్కువ వడ్డీరేటుపై ఆకర్షణీయ రుణ వాయిదాల కింద రుణాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత బ్యాంకర్లతో సంప్రదిస్తున్నది.

 కేఎఫ్‌డబ్ల్యూ, జీఐజడ్ వంటి గ్లోబల్ సంస్థలతోనూ చర్చిస్తున్నది.

ప్రభుత్వోద్యోగులకు భారీగా విద్యుత్ టూ వీలర్స్ సరఫరా చేసేందుకు బిడ్లను ఆహ్వానించినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రమణారెడ్డి తెలిపారు.

భారీ సంఖ్యలో ఒక రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం ప్రపంచంలోనే ఇది తొలిసారని భావిస్తున్నారు

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results