APTF VIZAG: September 2020

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

New Rules: అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

New Rules | ఎస్‌బీఐ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం, డ్రైవింగ్ లైసెన్స్... ఇలా పలు అంశాల్లో అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.

Driving License: అక్టోబర్ 1 నుంచి దేశంలో ఒకే తరహా డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డుల జారీ ప్రారంభం కానుంది. కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లో క్విక్ రెస్పాన్స్-QR కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్-NFC లాంటి అధునాతన ఫీచర్స్ ఉంటాయి. వీటి ద్వారా సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ డేటాబేస్‌లో 10 ఏళ్ల వరకు వాహనదారుల వివరాలు, చెల్లించిన పెనాల్టీలను భద్రపర్చొచ్చు.

Credit cards: పెట్రోల్ బంకుల్లో ఇకపై మీ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే ఎలాంటి డిస్కౌంట్ లభించదు. డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహించేందుకు ఆయిల్ కంపెనీలు గతంలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇ వ్యాలెట్ పేమెంట్స్‌పై డిస్కౌంట్స్ ఇచ్చేవి. వీటిలో క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై అక్టోబర్ 1 నుంచి డిస్కౌంట్లు ఉండవు. డెబిట్ కార్డులు, వ్యాలెట్ల ద్వారా పేమెంట్ చేస్తే డిస్కౌంట్ పొందొచ్చు.

Loans: అక్టోబర్ 1 నుంచి పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. ఎక్స్‌టర్నల్ ఇంట్రెస్ట్ రేట్ బెంచ్ మార్క్స్ ద్వారా కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆదేశించడంతో తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు.

SBI: యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తగ్గించనుంది. అక్టోబర్ 1 నుంచి మెట్రో, అర్బన్ సెంటర్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.3,000 కాగా, రూరల్ బ్రాంచ్‌లల్లో రూ.1,000. ఈ బ్యాలెన్స్‌లో 50 శాతం తక్కువగా ఉంటే రూ.10+జీఎస్‌టీ, 50 నుంచి 75 శాతం తక్కువ ఉంటే రూ.12+జీఎస్‌టీ, 75 శాతం మించితే రూ.15+జీఎస్‌టీ చొప్పున పెనాల్టీ చెల్లించాలి.

Corporate tax: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పొరేట్ పన్ను కోత అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది.

Health Insurance: అక్టోబర్ 1 నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు పెరిగే అవకాశముంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో ఎక్కువ రోగాలను చేర్చుతుండటంతో ప్రీమియం ధర కూడా పెరుగుతుంది. గతంలో 30 రోగాలు హెల్త్ పాలసీలో కవర్ అయ్యేవి కావు. వాటిని 17 కు తగ్గించారు. దీంతో హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం 5 నుంచి 20 శాతం పెరగొచ్చని అంచనా.

అన్‌లాక్‌ 5.0: -కేంద్రం మార్గదర్శకాలు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30తో అన్‌లాక్‌ 4.0 గడువు ముగియడంతో మరిన్ని మినహాయింపులతో కూడిన 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది.


Click Here To Download HOME MINISTRY GUIDELINES 

Vidya varadhi programme,DD SAPTHAGIRI TV lessons schedule for the month of October 2020

October 1 నుండి 30వరకు  దూరదర్శన్ సప్తగిరి చానెల్ లో 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ప్రసారమయ్యే పాఠ్యాంశాల టైమ్ టేబుల్ ఇవ్వడం జరిగింది.
1,2 వారికి 11గం.ల నుండి 12 గం. వరకు
3,4,5 వారికి 12 గం.ల నుండి 1గం. వరకు
6,7 వారికి 2 గం.ల నుండి 3 గం. వరకు
8,9 వారికి 3 గం.ల నుండి 4 గం. వరకు
1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సప్తగిరి ఛానల్ లో ప్రసారమయ్యే ఆన్లైన్ క్లాసెస్ ఈ క్రింది APP ని ఇన్స్టాల్ చేసుకుని అందులో మీ మొబైల్ లో  చూడవచ్చు.

Click Here To Download SAPTHAGIRI TV CHANNEL APP

డిపార్టమెంటల్ పరీక్షలు మే-2020 సెషన్ రద్దు చేస్తూ ప్రకటన..Cancellation of Departmental Tests MAY, 2020 web note by APPSC



  • ఈ సారి అప్లై చేసిన వారు తదుపరి నోటిఫికేషన్ కు మరలా  అప్లై చేయనక్కర లేదు....   తదుపరి నోటిఫికేషన్  ఇచ్చినప్పుడు   3 డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ MAY 2020 ని రద్దుచేస్తూ APPSC వెబ్ .గతం లో అప్లై చేయనివారికి మళ్లీ అప్లై చేసుకోవడానికి ఫ్రెష్ నోటిఫికేషన్ ద్వారా అవకాశం ఇస్తారు.
ఇప్పటికే అప్లై చేసినవారికి సెంటర్ మార్చుకొనే  అవకాశం ఇస్తారు. ఇప్పటికే అప్లై చేసినవాళ్ళు మరలా అప్లై  చెయ్యవలసిన అవసరం లేదు.

YSR JALAKALA ONLINE APPLICATION

YSR జలకల పధకం లో భాగంగా  పొలాలకి ఉచిత బోర్లు వేసుకోవడానికి రైతులు తమ దరఖాస్తు లను ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

ఉచిత బోరుకు ప్రతీ రైతు అర్హుడే
ఆ రైతు భూమిలో బోరు లేకుంటే చాలు.

వైఎస్సార్ జలకళ పథకం విధివిధానాల్లో సవరణ
రెండున్నర ఎకరాల నిబంధన మినహాయింపు గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ.

ఉచిత బోరు పథకానికి విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు అర్హుడే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌ జలకళ పథకం విధివిధానాలను సవరిస్తూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ పథకం విధివిధానాలపై జారీ చేసిన ఉత్తర్వుల్లో ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులనే అర్హులుగా పేర్కొన్నారు.తాజా నిబంధనల ప్రకారం ఇప్పటి దాకా బోరు వసతి లేని, ఫెయిల్‌ అయిన బోర్‌ ఉన్న రైతులంతా అర్హులేనని పేర్కొన్నారు.
► గతంలో ఉచిత బోరు తవ్వకానికి రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలని, ఒక రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి లేకపోతే, గరిష్టంగా 5 ఎకరాల
వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడాలన్న నిబంధనను తాజా విధివిధానాలలో సవరించారు.
► బోరు తవ్వకానికి ప్రత్యేకంగా ఎటువంటి విస్తీర్ణం పరిధిని పేర్కొనలేదు. అంటే రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతు మిగిలిన వారితో సంబంధం లేకుండా తన భూమిలో ఉచిత బోరు తవ్వకానికి అర్హుడేనని అధికారులు వెల్లడించారు.
► భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్న రాష్ట్రంలోని 1094 రెవిన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలు కాదని పేర్కొన్నారు. అయితే భూగర్భ జల మట్టాన్నిబట్టి ఈ గ్రామాల సంఖ్యలో మార్పులు ఉంటాయన్నారు.సన్న, చిన్నకారు రైతులకు పంపుసెట్, పైపులు, వైర్‌ ఉచితం
► సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాలలోపు భూమి ఉండే వారు) ఉచిత బోరుతో పాటు మోటార్‌ (పంపుసెట్‌) కూడా ఉచితంగా అందజేస్తారు. ఈ మేరకు సీఎం ప్రకటనకు అనుగుణంగా తాజాగా మరో ఉత్తర్వు జారీ చేశారు.
► పైపులు, విద్యుత్‌ వైరు, ప్యానల్‌ బోర్డు వంటి అనుబంధ పరికరాలను కూడా ఉచితంగా అందించనున్నట్టు పేర్కొన్నారు.
► హైడ్రో-జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వేలు నిర్వహించాకే బోరు బావి తవ్వకం ప్రారంభిస్తారు. అర్హత కలిగిన రైతులు ఫొటో, పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
► డ్రిల్లింగ్‌ అనంతరం గంటకు కనీసం 4,500 లీటర్లు తోడడానికి అవకాశం ఉన్న దానినే విజయవంతమైన బోరు బావిగా పరిగణిస్తారు. అనంతరం జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్‌ ఫొటోలతో రికార్డు చేస్తారు. పారదర్శకత కోసం సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తారు.
దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే పేజి ఓపెన్ అవుతుంది. ఇందులో మన ఆధార్ నెంబర్ ను ఇచ్చి సబ్మిట్ చేయాలి.
 
పైన చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతుంది అందులో మీరు మీ యొక్క వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయగానే మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
మీరు ఆన్లైన్ లో అప్లై చేయలేకపోతే మీరు మీ గ్రామ సచివాలయం లో అప్లై చేసుకోవచ్చు.

YSR జలకల అప్లికేషన్ కోసం ఇక్కడ నోక్కండి. 

AP POLYCET Official Final Answers Key 2020

AP Polytechnic  ప్రవేశ పరీక్షల యొక్క Final Answer Key Set A, B, C, D వారీగా అందుబాటులో ఉంచారు.


 

 

AP లో స్కూల్స్ పునః ప్రారంభం వాయిదా !



నవంబర్ 2 న తెరవాలని నిర్ణయం.అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ JAGAN MOHAN  రెడ్డి గారు.

AP Samagra Shiksha - SIEMAT / Quality Education - Commemoration period of the 150th Birth Anniversary of Mahatma Gandhi will be concluding on 2nd October, 2020 - Organizing the quiz on Mahatma Gandhi by the NCERT - Certain Instruction - Issued.

గాంధీజీ 150 వ జయంతిని పురస్కరించుకొని QUIZ programmes ను NCERT ,Delhi వారు మూడు విభాగాలలో నిర్వహించుచున్నారు.
అవి  1.3rd to 5th. ,  2.6th to 8th.
3.9th &10 th.కు ఉంటుంది.
This is to inform and appraise you about the development and readiness about the Discover Gandhi Portal and App.
The quiz will be open from 2 OCTOBER, 2020 starting on 10.00 AM and will close on  1st NOVEMBER, 2O2O midnight.
The web portal and mobile App are ready for launching the Quiz on Gandhi Ji.
The quiz platform has following broad categories: 1. Homepage, 2. Blog, 3. Gallery, 4. Quiz, 5. Resources,

The quiz portal can be accessed at: http://gandhiparichay.in/

And the Discover Gandhi mobile App can be easily downloaded from Google Play Store on Android mobile phone –

https://play.google.com/store/apps/details?id=com.discovergandhi.kholkhel

For logging into quiz, the participants have to register on the DIKSHA portal to take part in the Quiz. ln details, please provide information like your name, class, date of birth, gender, school name, mobile number(your parents/guardian) and schools' name.
Click Here To Download Complete Proceedings 
A total of 250 multiple choice questions in both English and Hindi medium have been developed by NCERT for the quiz,
Each question in the quiz is in multiple choice formats and with only one correct answer.
Each question carries one mark. Students are required to attempt all questions in each category. No negative marking will be done
All those who answer maximum questions will be awarded
For learners with visual impairments there is text to speech option in both the medium i.e. English and Hindi.
You are allowed to attempt the quiz only once and only one option will be accepted for a question. However, you may revise your answer before final submission.
After responding to a question, click on the "next question" button to go to the next question.
After attempting questions, final submission should be clicked, No change can be made after the final submission.
Answer will be published after the closure of the Quiz.
The questions are largely based on Mahatma Gandhi's life history, his teachings, values, ideas and major contributions.
The questions are factual as well as to test the critical thinking skills of the learners,
The questions have also been categorised into primary, middle, secondary, and senior secondary levels as indicated in the Ministry's letter,
The Quiz items are meant for children from the primary classes-III to V, Middle- VI to Vlll and Secondary /Senior Secondary lX to Xll.
The time duration of the quiz will be 15 minutes
And the winners will be selected on the basis of maximum number of correct responses in shortest time duration.
Each participant will be given a certificate of participation and three best winners would be selected from each category and their names will appear on MoE website and social media handles,
Please find attached a detailed documentation on the Gandhi Portal & App for your kind perusal.
Note: the decision of NCERT, New-Delhi will be final in all Quiz related matters.

Free Bore well for agriculture పొలాలకి ఉచిత బోర్లు వేసుకోవడానికి సంబంధించిన సమాచారం

ఉచిత బోర్లు అప్లై చేయడానికి కావలసిన అర్హతలు

ఉచిత బోరు అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

👉రెండున్నర ఎకరాల పొలం ఉండాలి.
(ఒకవేళ రెండున్నర ఎకరాల ఒకరిపైన లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ పొలాలు పట్టాదారులు ఇద్దరూ, ముగ్గురు కలిసి బోరు కి అప్లై చేయొచ్చు.)

👉 ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకము మరియు బ్యాంకు పాస్ పుస్తకం.
👉 1B, అడంగల్ సచివాలయంలో తీసుకోవాలి.
👉 మార్జినల్ సర్టిఫికెట్ సచివాలయం లో తీసుకోవాలి.
(ఇక్కడ మార్జినల్ సర్టిఫికెట్ అంటే మేము చిన్న రైతులు హా లేదా  పెద్ద రైతుల హా అని సర్టిఫికేట్ తీసుకోవాలి. సచివాలయంలో అప్లై చేస్తే సచివాలయం వాళ్ళు మార్జినల్ సర్టిఫికెట్ ఇస్తారు.
👉 రైతు భరోసా పొందిన పట్టాదారు పాసు పుస్తకము ఉండాలి.  అయితే కొంచెం తొందరగా వర్క్ మూవ్ అవుతుంది.
👉 ఇంతకుముందే బోరు ఉంటే వాళ్ళకి కొత్త బోరు వేయరు. వాళ్ళకి బోరు రాదు.notelgible
👉కొత్త బోరు కావాల్సిన వాళ్ళు పైన తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాల ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో  కలవండి.

Newly Selected DSC 2018 candidates Required Documents

నూతనంగా రిక్రూట్ అయిన DSC-2018 ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు తక్షణం అవసరమైన APPLICATIONS వివరాలు.
1)నూతనంగా JOB లో చేరటానికి మొదట PHYSICAL FITNESS CERTIFICATE కావాలి.
అందుకోసం PHYSICAL FITNESS CERTIFICATE ను ప్రభుత్వ సివిల్ సర్జన్ సంతకంతో మీ DDO లకు ఇవ్వవలసి ఉంటుంది.
2)మీకు జీతం రావాలి అంటే PRAN NUMBER ALLOT కావాలి.
Click Here To Download Total Required Forms
PRAN (PERMINENT RETIREMENT ACCOUNT NUMBER)
ఇందుకోసం CSRF-1.5 VERSION APPLICATION ను బ్లాక్ పెన్ తో నింపి మీ DDO &STO చే సైన్ చేయించి కార్వే సంస్థకు పంపవలసి ఉంటుంది.
PRAN అప్లికేషన్ కు COVERING LETTERS
S5
DDO COVERNIG LETTOR
S6
STO/PAO COVERING LETTORS ను పూర్తిచేసి
CRA FACILITATION సెంటర్స్ కు పంపుకోవాలి.పూర్తి చేసిన PRAN APPLICATIONS పంపవలసి అడ్రస్ లు.
 CRA FACILITATION CENTERS ADDRES
1)విజయవాడ అడ్రెస్
2)విశాఖపట్నం అడ్రెస్
 

PLASTIC (PVC) AADHAR CARD ONLINE APPLY PROCESS

PVC ఆధార్ కార్డు కొరకు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకుని 50 రూపాయలు ఆన్లైన్ లోనే పే చేసినట్లయితే మన ఇంటికే ప్లాస్టిక్ ఆధార్ కార్డు పోస్టు ద్వారా పంపిస్తారు.

PVC ఆధార్ కార్డు కొరకు మనం ఏం చేయాలి అనే వివరాలను స్క్రీన్ షాట్ ద్వారా వివరించడం జరిగింది.

ముందుగా మీరు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

https://residentpvc.uidai.gov.in/order-pvcreprint

ఇలా లింక్ ఓపెన్ చేయగానే క్రింద చూపిన విధంగా విండో ఓపెన్ అవుతుంది.
         
ఇందులో మనం మన ఆధార్ నెంబర్ ను, క్రింద ఇచ్చిన కోడ్ నెంబరు ని ఎంటర్ చేయాలి.మీరు ఇంతకు ముందు మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉంటే మీరు SEND OTP పై క్లిక్ చేయండి లేకపోతే మీరి కింద చెక్ బాక్స్ లో టిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి SEND OTP పై క్లిక్ చేయగానే మీ మొబైల్ కి OTP వస్తుంది.

OTP ని ఎంటర్ చేయగానే మనది  రిజిస్టర్డ్ మొబైల్  అయితే  ఆధార్ ప్రివ్యూ చూపిస్తుంది.రిజిష్టర్డ్ మొబైల్ కాకపోతే  ఆధార్ కార్డు వివరాల ప్రివ్యూ చూపించదు.
ఇలా మన వివరాలు చూపించిన తరువాత క్రింద పేమెంట్ ఆప్షన్ ఉంటుంది.దాని పైన క్లిక్ చేయగానే డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పోన్ పే వంటి ఆప్షన్ లులో సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయాలి. 
ఇలా చేయగానే మనకి ఓక నెంబరు జనరేట్ అవుతుంది.మన కార్డు స్టేటస్ ను క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. 

https://residentpvc.uidai.gov.in/check-reprint-status.php


INITIAL KEYS - Objections on Initial keys -AP - GRAMA WARD SACHIVALAYAM RECRUITMENT – 2020


గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ప్రిలిమినరీ 'కీ' విడుదల. 
PRIMARY KEY కొరకు  క్రింది లింక్ పై క్లిక్ చేయండి.🔽🔽

http://gramasachivalayam.ap.gov.in/intitialkeys20.html



ప్రిలిమినరీ కీ పై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 29వ తేదీలోగా తెలపాలి.
అనంతరం వాటిని పరిశీలించి తుది 'కీ'ని విడుదల.
OBJECTIONS పంపడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://apgsvam20reports.apcfss.in/apgsmraiseobjectiononintialkey16516542020.apgs


Interested Teachers Apply 7th Class Text Books Writers

A.P, Samagra Shiksha - SIEMAT-EMIC – Curriculum Revision- Development of New Textbooks for Class VII for the academic year 2021-2022- Inviting invitation from interested teachers to participate in the textbook writing -Communication of Google link–to fill the details intimation -
In view of the above, interested teachers are requested to furnish their details in the following google link :
 https://forms.gle/72hg9AJxzwqq3XCQA

Child Info New Website

ఛైల్డ్‌ ఇన్‌ఫోకు కొత్త వెబ్‌సైట్‌
పాఠశాలల్లో చేరే విద్యార్థుల వివరాలను అప్‌డేట్‌ చేసే పాఠశాల కొత్త వెబ్‌సైట్‌ను విద్యాశాఖ  అప్‌డేట్‌ చేసింది.ఇందులో క్రింది సర్వీస్ లను అందుబాటులో ఉంచారు.
 1.New Student Entry , 2.Edit Student
3.Transfer Certificate , 4.Dropout , 5.Dropout to Active , 6.Aadhar Update , 7.Student Active to Dropbox ,8.New Child Insert No Aadhar No EID , 9.Approve Schools
Click Here To New Child Info Website

School Complexes 2020-21 - Restructuring of the school complexes Amendment Memo No.SS-15024/92/2020-SAMO-SSA Dt.25/09/2020



పాఠశాల సముదాయాలు 2020-21 పునర్నిర్మాణం మార్గదర్శకాలలో మండల స్థాయి కమిటీలో మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులు విడుదల .

APPSC DEPARTMENTAL TEST NEGATIVE MARKS REMOVED


Departmental Exams లో Negative Marks తొలగింపు ఉత్తర్వులు.

SIKSHAK PARV Link and Final Feed Back Form


ఈ రోజు 10గం. ల నుంచి 11.30గం. వరకు  ప్రసారం అయ్యే శిక్షక్ పర్వ్ వెబినార్ కార్యక్రమం
Click Here To Sikshak Parv Link

శిక్షక్ పర్వ్ కార్యక్రమం పూర్తి అయిన తరువాత అందరు ఉపాధ్యాయులు నింపవలసిన ఫైనల్ ఫీడ్ బ్యాక్  గూగుల్ పామ్
All the teachers are requested to submit the final feed back form on Shikshak Parv after today's Webinar on NEP 2020.
Click Here To Submit Final Feed Back AP  GOOGLE FORM
Click Here To Submit Final Feed Back  vizag Google Form 


3 DAYTraining on DIKSHA Awareness e-content Creation

3రోజుల పాటు జరిగే దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదటి సెషన్, రెండవ సెషన్ ల రోజు వారీగా యూట్యూబ్ చానెల్ వీడియో లింక్ ను పొందుపరచడం జరిగింది.

DAY - 3
Date : 26.09.2020
Session - 1
TIME : 11:30 am to 12:30 pm
Topics :  Different FOSS Tools , Creation of Simple Video                                                      https://youtu.be/PkNFRyIyOOQ
                                      
Session - II
TIME : 02:30 pm to 03:30 pm
Topics : Submission  of e-Content in DIKSHA , Content review Process


AP DIKSHA YouTube ఛానల్ ద్వారా - సెప్టెంబర్ 24 నుండి 26 వరకు ️ఉపాధ్యాయులందరికీ 3 రోజుల ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమానికి సంభందించి అన్ని రోజుల అన్ని సెషన్స్ లైవ్ లింక్స్ అందుబాటులో
★ DAY -2
★ 25-09-2020
★ Session -1 ( 11:30 AM to 12:30 PM)
★ Getting DIKSHA workspace
★ Different tools in DIKSHA workspace for content creation

★ Session- 2( 2:30 PM to 3:30 PM)
★ Hands on training on workspace of DSIKSHA.
★ Online Courses in DIKSHA

DAY -1
Date : 24-09-2020
Session - 1
TIME : 11:30 am to 12:30 pm
Introduction to DIKSHA
Installation DIKSHA
Session - II
TIME : 02:30 pm to 03:30 pm
exploring e-content Repository in DIKSHA
Coherent usage of DIKSHA Content

IMPLEMENTATION OF THE SCHOOL SAFETY PROGRAM


All the head masters are instructed to fill the following questions with regard to implementation of school safety plan .

Teachers Card Dowmload and Edit process in CSE website

టీచర్లందరూ మీ School log in లో కి వెళ్ళి >Services  లోకి  Teacher information System  లో మీ details  సరిగా ఉన్నయో లేవో check  చేసుకొనగలరు.
Click Here To Teachers Card Website

Date of joining in service,
Date of joining in school,
Date of birth, Cell no, Spouse details,
HRA ,Transfer details etc   ను check  చేసుకొని Edit  చేసుకోగలరు. Save  చేసుకొనగలరు

>Process  లోకి వెళ్ళి మీ Treasury id  తో  Teacher card download  చేసుకోగలరు.

>Master data  లో mistakes  కనపడుతున్నవి.

> Transfer Application  లో ఈ  సమాచారము default  గా వచ్చును

> TIS  లో ఉన్న cell no  కు Transfer Application కు OTP  వచ్చును
అందరూ ఈ విషయములో శ్రధ్ధ పెట్టగలరు.

Samagra Shiksha – awareness on DIKSHA – Content Creation using DIKSHA tools – 3 day Online training to all teachers -through AP DIKSHA YouTube Channel - from 24th to 26th September - 2020



DIKSHA YouTube ఛానల్ ద్వారా  సెప్టెంబర్ 24 నుండి 26 వరకు ️ఉపాధ్యాయులందరికీ 3 రోజుల పాటు  ఆన్‌లైన్ లో  శిక్షణ.


APOSS OPEN 10TH AND INTERMEDIATE EXAMS ALL PASS


APOSS -ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను రద్దు చేయడమైనది మరియు పరీక్ష ఫీజు కట్టి పరీక్షకు హాజరగుటకు అర్హత కలిగిన అభ్యాసకులందరినీ ఉత్తీర్ణత ప్రెస్ నోట్.
అందరూ పాస్ అయినట్లు ప్రకటించిన ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీ


OFFICIAL E-BOOKS APP OF AP Govt


AP SCERT E Books (NEW Text Books 1 to 10th class )  Official Android App
Textbooks, Workbooks, Handbooks, Academic calendar, Videos, Parents Book అన్నీ ఒకే చోట లభ్యం.
A free and open app that can be installed and used by the school children to view the class study material. App has the pdf versions of the following components.
Click Here To Download E BOOKS APP
Click Here To Download Text Books

1. Textbooks
2. Workbooks
3. Handbooks
4. Academic calendar
5. Parent book
6. Videos
Pdfs are placed in the app class, semester , subject and lesson wise. Pdfs will be saved offline on the student mobile for the first time access, which further enables the student to walk through the lessons offline. Web interfaces are developed to upload the pdfs and to add / edit the subjects whenever required.

EMPLOYEE IDENTITY CARD FORMAT - APSS VISAKHAPATNAM


  1. ప్రస్తుతం ఎటువంటి  లింక్ జిల్లా వారు పంపలేదు.దయచేసి గమనించ గలరు. 

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా డి.ఇ ఓ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు  ఇచ్చుట  నిమిత్తం కావలసిన సమాచారాన్ని అడుగుట జరిగింది.
Please fill the Google form for teacher identity card In Visakhapatnam Distict Teachers 


ఏపీ ఓపెన్‌ స్కూల్‌ లో పదవ తరగతి, ఇంటర్ మీడియేట్ ప్రవేశాలు 2020 - 21 ప్రారoభం

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే దూర విద్య ఇంటర్‌, పదో తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకోసం 1,077 స్టడీ సెంటర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాలను సంప్రదించి దూర విద్య విధానంలో ఇంటర్‌, పది పూర్తి చేయడానికి ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయడానికి అక్టోబరు 10 వరకు గడువు ఉందని తెలిపారు.
అడ్మిషన్‌ ఫీజు చెల్లించడానికి అక్టోబరు 15, ఆలస్య రుసుముతో అక్టోబరు 31, రూ.200 నిర్ణీత ఫీజు, ఆలస్య రుసుముతో నవంబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రవేశాలు ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడండి.
Click Here To AP OPEN SCHOOL WEBSITE 

AP GRAMA, WARD Sachivalayam Hall tickets Released

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయం లో మిగిలి ఉన్న పోస్టులకు నిర్వహించే పరీక్ష లకు సంబంధించి హాల్ టికెట్ లను అందుబాటులో ఉంచారు.
Click Here To Download GRAMA SACHIVALAYAM HALL TICKETS


AP KGBV Selection list for 6th, 7th, 8th Class, Inter Admissions 2020 District wise, School wise list



కెజివిబి లలో 6వ,7వ,8వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ కొరకు సెలెక్ట్ అయిన  విద్యార్థుల యొక్క వివరాలు జిల్లా వారీగా, పాఠశాల వారీగా జాబితా విడుదల చేయడం జరిగింది.

E-SR completed By September 30

ఈ నెల 30 లోపు ఈ సర్వీస్ రిజిస్టర్ పూర్తి చేయమని పే అండ్ అకౌంట్స్ ఆఫీస్  వారు అందరు HODS కు ఆదేశాలు విడుదల చేయడం జరిగింది.
COMPLETE ESR ON OR BEFORE SEP 30TH

Depute the concerned officers for Verification of Reapportion of Teaching Staff under various Managements

బదిలీలు : జిల్లా వారీ బదిలీల పరిశీలనకు ఆఫీసర్స్ ని డెప్యూటీ చెయ్యమని  పాఠశాల విద్యా శాఖ వారి ఉత్తర్వులు.
Rc.No.memo.No.13/27/2019-Est 3-CSE  Dated 11-09-2020
బదిలీలపై సన్నాహక‌ చర్య- ఖాళీలను,రేషన్ లైజేషన్   కొరకు Soft copies ను Ready చేయుట
విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, మరియు పశ్చిమ గోదావరి.
16-09-2020
కృష్టా,గుంటూరు, ప్రకాశం, SPSR నెల్లూరు.
17-09-2020
చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం.
18-09-2020
పైన కనబర్చిన తేదిలలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ప్రొవిజనల్ జాబితాను DSE నందు సబ్మిట్ చేయడానికి సంబంధిత అధికారులను డిప్యూట్ చేయాలని ఆదేశాలు...

Rc.No.151/A&I/2020 Dated:10/09/2020 Teachers shall have to attend the schools @ 50 % at a time for online teaching/tele counselling and related work for guiding on the vidya varadhi work in all schools, government, private and private aided in areas outside the Containment Zones only.

ఈ నెల 22 నుంచి ప్రతి టీచర్ పాఠశాలలకు హాజరు కావాలి: CSE వారి తాజా ఉత్తర్వులు.ఈ నెల 21 న 100% ఉపాధ్యాయులు 22నుంచి 4-10-2020 వరకు అన్ని పాఠశాలల యందు ప్రతిరోజు 50% ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలి. CSE వారి తాజా ఉత్తర్వులు Rc.No.151/A&I/2020 Dated:10/09/2020.

జగనన్న గోరు ముద్ద 4విడతల డ్రైరేషన్ పంపిణీ వివరాలు

మొదటి విడత

 ❲ మార్చి 19 నుండి 31 వరకు❳-10 రోజులు
బియ్యం =1 కేజీ (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం 1.5 కేజీలు.  (ప్రాథమికోన్నత పాఠశాలలు)
గుడ్లు - 8  , చిక్కీలు -4
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓

 రెండవ విడత

ఏప్రిల్ 1 నుండి 23 వరకు - 17 రోజులు.
బియ్యం - 1.7 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
 బియ్యం -  2.55కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
గుడ్లు- 14.   చిక్కీలు-9
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓

మూడవ విడత(యాప్ లో Phase IV)

 ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు - 40 రోజులు
బియ్యం - 4.0కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం -  6.0 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
 పై వరకు అన్నీ పంపిణీ చేసాము. ఇక కింద చూపబడినవి మాత్రమే పంపిణీ చేయవలెను.
గుడ్లు- 34.   చిక్కీలు-20
 1:17 గుడ్లు +10 చిక్కీలు
 2 :17 గుడ్లు +10 చిక్కీలు
పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓

నాల్గవ విడత: 

జూన్ 12 నుండి ఆగస్టు31 వరకు 62 రోజులు (యాప్ లో Phase V అని ఉంటుంది)
బియ్యం - 6.2 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం -  9.3 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
(రైస్ సెప్టెంబర్ లో వస్థాయి కావున ఆ నెలలో పంపిణీ చేయాలి.)
గుడ్లు- 56. ,  చిక్కీలు-35
1 :28 గుడ్లు +18 చిక్కీలు
 2 :28 గుడ్లు +17 చిక్కీలు

పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.

YSR ఆసరా పధకం యొక్క పూర్తి సమాచారం.

డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేసే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వంYSR ఆసరా పధకం ప్రవేశ పెట్టడం జరిగింది. గ్రామ స్థాయి లో డ్వాక్రా సంఘాలు రుణం ఎంత తీసుకున్నారు,ఎప్పుడు తీసుకున్నారు ,వారికి రుణమాఫీ ఎంత వస్తుంది వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

మీ యొక్క డ్వాక్రా గ్రూప్ రుణం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మీ గ్రూప్ ఐడి నెంబర్ తో మీ లోన్ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

పట్టణ ప్రాంతం యొక్క డ్వాక్రా గ్రూప్ రుణం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

AP EAMCET 2020 HALL TICKETS FOR DOWNLOADING

Engineering, Agriculture and Medical Common Entrance Test (EAMCET) is conducted by Jawaharlal Nehru Technological University Kakinada on behalf of APSCHE. This examination is the prerequisite for admission into various professional courses offered in University/ Private Colleges in the state of Andhra Pradesh.
Click Here To Download Hall Tickets                                              

AP Samagra Shiksha - SIEMAT - Vidya Vaaradhi - Telecast of the Video Lessons for 1 to 10 classes through Saptagiri Channel schedule from 11th 30th September 2020 - Communicated.

దూరదర్శన్ సప్తగిరి చానెల్ లో సెప్టెంబర్ 11 నుండి 30 వరకు 1 నుండి 10వ తరగతి వరకు  ప్రసారమయ్యే  ఆన్ లైన్ తరగతుల షెడ్యూల్.

APREIS Class 5 Admissions Result available



ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 2020-21 సం. 5వ తరగతి  ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.


State Wide SHIKSHAK PARV Feed Back GOOGLE FORM


The Ministry of Education is organizing “Shikshak Parv” on the theme of National Education Policy, 2020 for Principals, Teachers, parents, students, schools, HEIs, TEIs, government school education functionaries, educationists, CSOs, Are submitted google form
 అన్ని జిల్లాల యొక్క SHIKSHAK PARV కి సంబంధించి FEEDBACK, ATTENDANCE FROM ఇవ్వడమైనది.ప్రతిరోజు అప్ డేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ప్రతి రోజు తప్పకుండా సబ్మిట్ చేయాలి.
అన్ని జిల్లాల యొక్క SHIKSHAK PARV  UPDATED FEEDBACK FROM
Click Here To All Districts Feedback From

Rc.No.SS-16021/56/2020-CMO-SSA-2 Dated08-09-2020 AP Samagra Siksha - Teacher's Identity Card (Elementary)


ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు జారీకి రూ.50,84,350/- మంజూరు చేసిన ఉత్తర్వులు

Shikshak Parv - feedback form

AP Eamcet Hall Tickets Available For Download

Download Hallticket for APECET - 2020

Date of Birth ఇచ్చి మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

watch live Webinars/Sessions in virtual mode from 5th September 2020 to 25th September 2020

శిక్షక్ పర్వ్ పేరుతో MHRD, NCERT వారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి సెప్టెంబర్ 25 వరకు నిర్వహించ బోయే వెబినార్ కార్యక్రమాలు మరియు రోజువారీ షెడ్యూల్

Click Here To SIKSHAK PARV WEBSITE 

Live Telicast కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://webcast.gov.in/mhrd/shikshakparv/

                     Watch Live :


G.O.MS.No.81 Fin.Dept Dated:07-09-2020 ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక భీమా పథకం(GIS)


PUBLIC SERVICES – Employees Welfare Scheme– Andhra Pradesh State Employees Group Insurance Scheme – 1984 – Revised Rate of Interest (@7.9% per anum with effect from 01.01.2020 to 31.03.2020) and Revised Rate of Interest (@7.1% per anum with effect from 01.04.2020 to 30.06.2020) on Accumulated Savings- Fund Communication of Tables and Benefits for Savings Fund for the Period from 01.01.2020 to 30.06.2020–Revised Tables-Orders

Unlock 4.0 Guidelines for Reopening in the State of Andhra Pradesh GO.390 Dt:7.9.20


 అన్‌లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం.కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏపీ అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్‌ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

💍దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అదే రోజునుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరచుకునేందుకు అనుమతినిచ్చింది.
💍100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ నెల 20 నుంచి పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
💍21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులకు అనుమతి నిరాకరించింది.


THE ANDHRA PRADESH PUBLIC SERVICES DELIVERY GUARANTEE RULES, G.O.MS.No. 47 , Dated: 03-09-2020.


ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్దేశించిన కాలంలో ప్రజలకు సకాలం లో  వారు అప్లై చేసిన  పని పూర్తి కానట్లయితే జరిమానా విధించేలా ప్రభుత్వ ఉత్తర్వులు.

Departmental Test Revised Time Table For Telangana

TELENGANA STATE DEPARTMENTAL TESTS : MAY, 2020 SESSION NOTIFICATION NO. 04/2020 Revised  TIME – TABLE &SCHEME
Exams starting From 3-10-2020

పత్రికా ప్రకటన: అక్టోబరు 5నాటికి 'జగనన్న విద్యా కానుక' వాయిదా



ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య సంచాలకులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు (ఐ.ఎ.ఎస్) గారు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జగనన్న విద్యాకానుక' కార్యక్రమాన్ని సెప్టెంబరు5వ తేదీన ప్రభుత్వం నిర్వహించాలనుకున్న విషయం విదితమే.
అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ - 19 అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు 30 దాకా పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించడం వలన ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5వ తేదీ నాటికి వాయిదా వేస్తున్నట్లు తాత్కాలికంగా నిర్ణయించడమైనదని పేర్కొన్నారు.

Teachers Day on September 5th

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం.  సమాజాన్ని జాగృతంచేసి , విద్యార్ఢులలో నిభిడీకృతమైన శక్తులను వెలికితీసీ సంపూర్ణ వ్యక్తిత్వంకల భావిభారత పౌరులను తీర్చిదిద్దుతు ,ఉన్నత మానవతా  విలువలు కలిగిన పౌరసమాజాన్ని తీర్చి దిద్దుతున్న గురుదేవుళ్లందరికీ  ముందుగానే గురుపూజోత్సవ   శుభాకాంక్షలు. కోవిడ్ 19 వల్ల ఈ సంవత్సరం సోషల్ మీడియా ద్వారానే శుభాకాంక్షలు చెప్పుకోవలసిన పరిస్ధితి ఉంది.

సమాజంలో ఉన్నతంగా తీర్చి దిద్దబడిన ఒక వ్యక్తి నా ఈ స్థాయికి మా గురువుగారు కారణం అని చెప్పగలిగేలా చేసిన గురువు సమాజానికి దేవుడుతో సమానం. ఈ గౌరవంముందు  ఏ అవార్డయినా చిన్నదే అవుతుంది. అటువంటి అత్యుత్తమమైన సమాజ అభిమానం ప్రతీ ఉపాధ్యాయుడు పొందాలని ఆకాంక్షిస్తూ నా ఉపాధ్యాయ సోదర సోదరీమణు లెల్లరకూ  ఉపాధ్యాయ  దినోత్సవ శుభాకాంక్షలు. కె.సన్యాశి నాయుడు

మనదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబరు 5 తేదీన  ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers' Day)   జరుపు కుంటాము.

పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు.
విద్యార్ధి ...సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ.
అదృష్టవశాత్తూ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే మన దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానమే ఉంది. అందుకే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా "టీచర్స్ డే" గా  జరుపుకుంటున్నాము.
 సెప్టెంబర్ 5నే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఆ రోజు భారత ద్వితీయ రాష్ట్రపతిగా అద్వితీయంగా తన పదవీ బాధ్యతలను నిర్వహించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం కావడమే.  1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షుడిగా పని చేసిన రాధాకృష్ణన్ ప్రారంభంలో ఉపాధ్యాయుడు. స్వయంగా ఉపాధ్యాయుడైన ఆయన విద్య మీద అపార నమ్మకంగలవాడు. విద్యాధికులు మాత్రమే దేశ సౌభాగ్యానికి చుక్కానులని ఆయన విశ్వసించేవారు. వాస్తవానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరపవలసిందిగా కోరిందీ ఆయనే. తన పుట్టిన రోజునాడు తనని అభినందించడానికి వచ్చిన తన అభిమానులను ఆయన ఈ రోజు నన్ను అభినందించడంకంటే ఉపాధ్యాయులను అభినందిం చడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనడంతో ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్ పుట్టిన రోజునాడు నిర్వహించడం జరుగుతున్నది.

 ప్రపంచవ్యాప్తంగా గొప్పవారైన వారిలో అనేకమంది తమ గొప్పతనాన్ని తమ గురువులకు ఆపాదించడం మనం చూస్తూనే ఉన్నాం.

"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు.

 "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడి పోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది.

ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. సాక్షాత్తూ భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుణ్ణి పంపిస్తే విద్యార్ధులు మాత్రం ఆయన్ను విస్మరించి మార్కుల కోసం, పరీక్షా ఫలితాలకోసం గుళ్ళూ, గోపురాల చుట్టూ తిరగడం శోచనీయం.

 ప్రయత్నం మానవ లక్షణం. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడనే వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా  గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు.

ఇక్కడ గురు శిష్య సంబంధం కూడా చర్చించతగ్గది. ఎందుకంటే విద్యార్ధుల మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముందుంటాడు. అందుకోసం అతడు ఆ విద్యార్ధితో ఎంతో చనువుగా మెలుగుతాడు. అతనితో స్నేహం చేస్తాడు. అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఆ ఉపాధ్యాయుడికి ఎంతో సహనం అవసరం. అసహనం ఎదుటి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి శాంతానికి చిహ్నంగా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నిలిచివుంటాడు. అంతే కాదు ఉపాధ్యాయుడు విద్యార్ధుల భవిష్యత్తును సన్మార్గంలోకి తీసుకెళ్ళే డ్రైవర్‌గానూ, వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యుడుగానూ, వివిధ రకాల పరిస్థితులను విడమరచి చెప్పడంలో సైంటిస్టుగానూ, కలబోసి వివరిస్తూ ఆపైవచ్చే ఫలితాన్ని చూపేందుకు వంటవాడిగానూ, అతనికి బలమైన నిర్మాణాత్మక శక్తినిచ్చేందుకు కాంట్రాక్టర్‌గానూ ...ఇలా సంఘంలో ప్రతి వృత్తినీ తనలో ఇముడ్చుకొని, తానే అన్ని వృత్తులని నిర్వహించేవాడిగా విద్యార్ధికి సంపూర్ణ అవగాహన కలిగేట్లు చేస్తాడు.

విద్యార్ధి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ ఉపాధ్యాయుడితో తన పని పూర్తై పోయిందనుకోకూడదు. విద్యాలయంనుంచి బైటికొచ్చాకే అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసరమవుతుంది. అప్పటివరకు కంటికి రెప్పలా చూసుకున్న ఉపాధ్యాయుడి స్థానంలో అతనికి ఆ ఉపాధ్యాయుడి సందేశం మాత్రమే తోడుగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడి దగ్గర్నుంచి అప్పటివరకు తాను నేర్చుకున్న నడవడి, క్రమశిక్షణ మాత్రమే అతను పై అంతస్తులకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఇప్పుడే విద్యార్ధి అత్యంత జాగరూకతతో నడుచుకోవాలి. ఇది అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి తన గురువును తలుచుకుంటూ అడుగులేస్తే ఆ అడుగులు మరి అభ్యుదయంవైపే చకాచకా సగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

మాజీ రాష్ట్రపతి కలాం కూడా గతంలో ఉపాధ్యాయుడే. పదవీ విరమణ అనంతరం ఆయన మరలా ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించి మరణంవరకూ ఉపాధ్యాయుడుగానే ఉండడం ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్నీ, విశిష్టతను తెలియజేస్తుంది.

ఇటీవల రష్యా అధ్యక్షుడు కోవిడ్ వేక్సిన్ విడుదలచేస్తూ ముందుగా వేక్సిన్ ఉపాధ్యాయులకు వైద్యులకు మాత్రమే ఇవ్వబడుతుందని ఉపాధ్యాయుడు లేని సమాజాన్ని మనం ఊహించలేమని చెప్పడం - సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర గురించి తెలియచేస్తుంది.

ప్రపంచంలో "సార్" అని ప్రతిఒక్కరూ సంబోధించతగ్గ ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. దేశాధ్యక్షుడు సైతం "సార్" అని సంబోధించవలసిన ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే.

సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించతగ్గ విషయం. ఇది సర్వత్రా వాంచనీయం. ఈ రోజుని ప్రతి విద్యాలయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి.

 ఒకప్పుడు బ్రతకలేక బడి పంతులు అనిపించుకున్న వృత్తి నేడు నేడు బ్రతుకు కొరకు బడి పంతులు అని వేనోళ్ళ కీర్తించబడుతుందంటే అందుకు కారణం సంఘ నిర్మాణంలో ఉపాధ్యాయుడు నిర్వర్తించిన ,నిర్వహిస్తున్న పాత్ర అని సగర్వంగా చెప్పవచ్చు.

Ap NEW Text Books information


📚కొత్త బుక్స్  గురించి మీకు అవగాహన కోసం...
1 to 5th.
📗తెలుగు ఒకో తరగతికి
  1 టెస్ట్ బుక్ + 1 work Book
📙ఇంగ్లీష్   ఒకో తరగతికి
1 టెస్ట్ బుక్ +ఒక  Work Book
📙Maths ఒకో తరగతికి
👉సెమిస్టర్ విధానం 3 సెమిస్టర్ లలో
👉3 టెస్ట్ బుక్స్+ 3 Work బుక్స్
(ఇప్పుడు ఒక టెస్ట్ బుక్+ఒక Work Book ఇస్తున్నారు)
👉ఇది ద్విభాషా విధానం లో ఒక పేజీ ఇంగ్లీష్ లో ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు.
📗పరిసరాల విజ్ఞానం 3వ తరగతి నుంచి.. ప్రవేశ బెట్టారు.
ఒకో తరగతికి
👉సెమిస్టర్ విధానం 3 సెమిస్టర్ లలో
👉3 టెస్ట్ బుక్స్+ 3 Work బుక్స్
(ఇప్పుడు ఒక టెస్ట్ బుక్+ఒక Work Book ఇస్తున్నారు)
👉ఇది ద్విభాషా విధానం లో ఒక పేజీ ఇంగ్లీష్ లో ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు.
👉1 to 5 టోటల్ బుక్స్:
📗1st Class:10
📗2nd Class :10
📗3rd Class:16
📗4th Class:16
📗5th Class:16
Total:68
వీటిలో టెస్ట్ Books:34 &work Boos:34
అన్ని చిన్న చిన్నగా చాలా ఆకర్షణీయంగా పూర్తిగా మార్పు చేయటం జరిగింది.

📗6th Class

📗తెలుగు టెస్ట్ :1
📙ఇంగ్లీష్ టెస్ట్:1

📗Maths, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం..
👉సెమిస్టర్ విధానం 3 సెమిస్టర్ లలో
👉ఒక్కో సబ్జెక్ట్ కి 3 టెస్ట్ బుక్స్
(ఇప్పుడు ఒక టెస్ట్ బుక్ ఇస్తారు)
👉ఇది ద్విభాషా విధానం లో ఒక పేజీ ఇంగ్లీష్ లో ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు.

Agriculture free electricity NEW Policy


వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా పథకంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఉచిత విద్యుత్‌ సబ్సిడీని నెలవారీ నగదు రూపంలో రైతులకు ప్రభుత్వం చెల్లించనుంది. దీనిలో భాగంగా వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వినియోగం మేరకు వచ్చిన బిల్లులను రైతులే డిస్కంలకు చెల్లించేలా కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు వ్యవసాయ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

నవరత్నాల్లో భాగంగా ఉచిత విద్యుత్తుకు రూ.8400 కోట్లు ఖర్చవుతోందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ పథకం కోసం రాష్ట్రంలోని సుమారు 18 లక్షల రైతులకు ఏటా 12వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించింది. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులపై భారం పడకుండా ఉచిత విద్యుత్‌ పథకం అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు వీలుగా రూ.1,700కోట్లతో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం సూచనలకు అనుగుణంగానే ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకం అమలుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Cabinet Meeing Decissions On 03-09-2020


03-09-2020 న జరిగిన  ఏపీ కేబినెట్ మంత్రివర్గ నిర్ణయాలు
రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధం
నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు, జరిమానా
ఆన్‌ లైన్‌ జూదం ఆడుతూ పట్టుబడితే ఆరునెలల జైలు
వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకానికి కేబినెట్‌ ఆమోదం
డిసెంబర్‌ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు
వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు
రాష్ట్ర ఫీడర్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.1700 కోట్లు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం
పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం
రాష్ట్రంలో ఉన్న లక్ష అనధికార ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు కేబినెట్‌ ఆమోదం
భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయాలని నిర్ణయం
విద్యుత్‌ బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం
రాష్ట్రంలో ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
ప్రకాశం బ్యారేజీ దిగువన 3 టీఎంసీల సామర్ధ్యంతో మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
రూ.1350 కోట్ల ఖర్చుతో కృష్ణానదిపై చోడవరం వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం
రూ. 1280 కోట్లతో మోపిదేవి వద్ద కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం
రూ.15380 కోట్లతో ఉత్తరాంధ్రలోని మెట్టప్రాంతాల కోసం బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకం
బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకంతో 8 లక్షల ఎకరాలకు లబ్ది
రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరిత గతిన పూర్తి చేయాలని నిర్ణయం
బాపట్ల, మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం స్ధల కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదం
మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగింపు
పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ పచ్చజెండా

Featured post

Ap open school 10th Class and intermediate results