APTF VIZAG: విద్యార్థులకు రెండు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ గారు

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

విద్యార్థులకు రెండు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ గారు

ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కనీసం రెండు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వారిని తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదేశించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో గురువారం జరిగిన అండర్‌-14, 17, 19 పాఠశాల క్రీడల కార్యదర్శుల కార్యనిర్వాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విద్యార్థులకు సామర్థ్యాల పరీక్ష నిర్వహించి ఖేలో ఇండియా ఫిట్‌నెస్‌ యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. ఆసక్తి గల విద్యార్థులను తరగతులు పూర్తయిన తర్వాత రోజూ రెండు గంటలు ఆటలు ఆడించాలి. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి పాఠశాలలో క్రీడలు నిర్వహించేలా పీఈటీలు బాధ్యత వహించాలి. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబరు నెలాఖరుకల్లా పూర్తి చేసి, జాతీయ పోటీలకు జట్లను సిద్ధం చేయాలి. ప్రాథమిక పాఠశాల నుంచి జూనియర్‌ కళాశాల వరకు అవసరమైన క్రీడా పరికరాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో ఒక పాఠశాలను ‘స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’గా ఎంపిక చేసి, విద్యార్థులకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ అదనపు సంచాలకుడు శ్రీనివాసరావు, సంచాలకురాలు పార్వతి, జేడీ రామలింగం, రాష్ట్ర పాఠశాల క్రీడల కార్యదర్శి భానుమూర్తిరాజు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results